Shubman Gill: విమర్శలకు కౌంటర్.. 12 ఇన్నింగ్స్ల తర్వాత గిల్ సెంచరీ
భారత యువ ఆటగాడు శుభ్మన్ గిల్ సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్పై భారత్ పట్టు బిగించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: పేలవ ఫామ్తో విమర్శలు ఎదుర్కొన్న శుభ్మన్ గిల్ (Shubman Gill) ఎట్టకేలకు శతకంతో సమాధానం ఇచ్చాడు. వైజాగ్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో 132 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. భారత జట్టు ఆధిక్యాన్ని 350 పరుగులు దాటించాడు. అతడి కెరీర్లో ఇది మూడో శతకం. 12 ఇన్నింగ్స్ల తర్వాత మూడంకెల స్కోరు నమోదు చేశాడు. గతేడాది మార్చిలో ఆసీస్తో నాలుగో టెస్టులో చివరిసారిగా శతకం చేశాడు. ఏడేళ్ల తర్వాత వన్డౌన్లో స్వదేశం వేదికగా జరిగిన మ్యాచ్లో ఒక భారత బ్యాటర్ సెంచరీ సాధించడం విశేషం. చివరిసారిగా 2017లో నాగ్పుర్లో శ్రీలంకపై ఛెతేశ్వర్ పుజారా శతకం చేశాడు.
రెండో ఇన్నింగ్స్లో ఓవర్ నైట్ 28/0 స్కోరుతో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్ఇండియాకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ వరుస ఓవర్లలో ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (17), రోహిత్ శర్మ (13)ను పెవిలియన్కు పంపాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ (29)తో కలిసి గిల్ ఇన్నింగ్స్ను నిర్మించాడు. ఈ సమయంలో రెండుసార్లు లైఫ్లు రావడంతో గిల్ బతికిపోయాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని విజృంభించాడు. ఆరంభంలో ఆచితూచి ఆడిన అతడు.. కుదురుకున్నాక బ్యాట్ను ఝుళిపించాడు. అక్షర్తో కలిసి ఐదో వికెట్కు 89 పరుగులు జోడించిన అనంతరం షోయబ్ బషీర్ బౌలింగ్లో గిల్(104) పెవిలియన్ చేరాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్