Ajinkya Rahane: టీమ్ఇండియాలోకి రీ ఎంట్రీ ఇస్తా.. నా లక్ష్యం అదే: అజింక్య రహానె
భారత సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె (Ajinkya Rahane) కొన్ని నెలలుగా జట్టులో చోటు కోల్పోయాడు. అతడు తిరిగి టీమ్లోకి రావడంపై దృష్టిసారించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా సీనియర్ బ్యాటర్ అజింక్య రహానె (Ajinkya Rahane) ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. 2020-21 సీజన్లో ఆస్ట్రేలియా గడ్డపై భారత్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్ విజయం సాధించింది. ఈ చిరస్మరణీయ సిరీస్కు రహానె కెప్టెన్గా వ్యవహరించాడు. చాలా మ్యాచ్ల్లో కీలక ఇన్నింగ్స్లో టీమ్ఇండియాను ఆదుకున్న అతడు కొత్త కుర్రాళ్ల రాకతో టెస్టు జట్టు రేసులో బాగా వెనకబడిపోయాడు. అతడు చివరిగా 2023లో రెండు టెస్టుల సిరీస్ కోసం వెస్టిండీస్ పర్యటనకు వెళ్లాడు. ఆ సిరీస్లో విఫలమవడంతో అప్పటి నుంచి పక్కన పెట్టారు. త్వరలో ఇంగ్లాండ్తో జరగబోయే టెస్టు సిరీస్కూ ఎంపిక చేయలేదు. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న రహానె ప్రస్తుతం రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు. ముంబయికి కెప్టెన్గా వ్యవహరిస్తున్న రహానె ఆంధ్రా జట్టుపై విజయం సాధించిన తర్వాత మాట్లాడాడు.
‘‘ముంబయి తరఫున మెరుగైన ప్రదర్శన చేయడంపై దృష్టిపెట్టా. మేం ఈ సీజన్ను గొప్పగా ప్రారంభించాం. ట్రోఫీని గెలవాలంటే టోర్నీ ఆసాంతం నిలకడగా ఆడాలి. అది సవాలుతో కూడుకున్నది. ఒక్కో మ్యాచ్పై దృష్టిపెట్టి ముందుకుసాగుతున్నాం. రంజీ ట్రోఫీ గెలవడంతో పాటు 100 టెస్టు మ్యాచ్లు ఆడటం నా లక్ష్యం’’ అని రహానె పేర్కొన్నాడు. అజింక్య ఇప్పటివరకు భారత్ తరఫున 85 టెస్టులు ఆడి 5077 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 26 అర్ధ సెంచరీలున్నాయి. 102 క్యాచ్లు కూడా పట్టాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాయల్స్.. రయ్మని
ఎప్పుడో ఐపీఎల్ తొలి ఏడాది ఛాంపియన్గా నిలిచింది రాజస్థాన్. ఆ తర్వాత మరోసారి ట్రోఫీని ముద్దాడలేకపోయింది. 2022లో అవకాశమొచ్చినా తుది మెట్టుపై బోల్తా కొట్టింది. -
ముంబయి కొద్దిలో...
ఐపీఎల్లో ఇప్పుడు 250 స్కోరు చేసినా గెలుస్తామన్న గ్యారెంటీ లేదు. కోల్కతా-పంజాబ్ మధ్య గత మ్యాచ్లో కేకేఆర్ 261 పరుగులు చేస్తే.. పంజాబ్ 8 బంతులు ఉండగానే అంతటి లక్ష్యాన్ని ఊదేసింది. -
జ్యోతి అదరహో..
తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ అదరగొట్టింది. ఆర్చరీ ప్రపంచకప్ కాంపౌండ్ విభాగంలో హ్యాట్రిక్ స్వర్ణాలు సాధించింది. -
ఫిడే గ్రాండ్ప్రి బరిలో హంపి, హారిక
ఫిడే మహిళల చెస్ గ్రాండ్ప్రి సిరీస్లో భారత స్టార్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బరిలో దిగుతున్నారు. -
భారత్ శుభారంభం
ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ శుభారంభం చేసింది. -
రన్నరప్గా షన్విత జోడీ
ఐటీఎఫ్ జూనియర్ సర్క్యూట్ టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి షన్వితరెడ్డి రన్నరప్గా నిలిచింది.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ బరిలో తమిళ పార్టీ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (28/04/24)
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
‘అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా’: బైడెన్
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్