IPL - MSD: ఐపీఎల్ 2024లోనూ ఎంఎస్ ధోనీ ఆడతాడా..? రైనా రెస్పాన్స్ ఇదే..!
మరో పక్షం రోజుల్లో ఐపీఎల్ (IPL 2023) సందడి మొదలు కానుంది. దాదాపు రెండు నెలల పాటు జరిగే మెగా టోర్నీలో ఆటగాళ్లు సర్వశక్తులూ ఒడ్డుతారు. కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ ఇప్పటికే ప్రాక్టీస్ను ప్రారంభించాడు. అయితే, ఇదే చివరి సీజన్ అవుతుందా..? లేకపోతే వచ్చేఏడాది కూడా ఆడతాడా..? అనేది అందరిలోనూ మెదిలే ప్రశ్నలు.
ఇంటర్నెట్ డెస్క్: మార్చి 31 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) పదహారో సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ (GT vs CSK) జట్ల మధ్య పోరుతో మెగా టోర్నీ షురూ అవుతుంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఎంఎస్ ధోనీ (MS Dhoni) ప్రాక్టీస్ను కూడా ప్రారంభించేశాడు. అయితే, ఈ సీజన్ తర్వాత ధోనీ ఐపీఎల్కూ గుడ్బై చెప్పేస్తాడని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేశారు. ఇదే విషయాన్ని సురేశ్ రైనా (Suresh Raina) దృష్టికి తీసుకెళ్లగా.. అద్భుతమైన సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం రైనా లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) ఆడుతున్నాడు. ప్రెస్ కాన్ఫెరెన్స్లో రైనా మాట్లాడుతూ.. తప్పకుండా వచ్చేసీజన్లోనూ ఆడతాడని పేర్కొన్నాడు.
‘‘ఎంఎస్ ధోనీ ఐపీఎల్ 2024 (IPL 2024) సీజన్లోనూ ఆడాలని కోరుకుంటున్నా. అయితే, అతడి ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. బ్యాటింగ్ బాగానే చేస్తాడు. ఫిట్నెస్లో తిరుగులేదు. అయితే, ఈ ఏడాది ధోనీ ప్రదర్శనపైనే వచ్చే సీజన్ ఆడాలా...? వద్దా..? అనే నిర్ణయం ఆధారపడి ఉంటుంది. సంవత్సరం నుంచి ఆడని ధోనీ, అంబటి రాయుడుకు సవాల్ తప్పదు. జట్టు ఇప్పటికీ చాలా బలంగా ఉంది. చాలామంది యువ ఆటగాళ్లు నిరూపించుకుంటున్నారు. రుతురాజ్ గైక్వాడ్, డేవన్ కాన్వే, జడేజా, బెన్ స్టోక్స్, దీపక్ చాహర్.. ఇలా అనుభజ్ఞులు, యువతతో కూడిన జట్టు సిద్ధంగా ఉంది. అయితే, వారు ఎలా ఆడతారో చూడాలి’’ అని రైనా చెప్పాడు.
ఇప్పటికీ ధోనీ ఫోన్లోనూ అందుబాటులో ఉండడని చాలా మంది క్రికెటర్లు చెబుతూ ఉంటారు. అయితే, తాను మాత్రం ధోనీతో టచ్లోనే ఉన్నట్లు రైనా తెలిపాడు. ‘‘అలాంటిదేం లేదు. తరచూ టచ్లోనే ఉంటాం. ఇప్పుడు ధోనీ కఠినంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. సీఎస్కే సోషల్ మీడియాలోని వీడియోలను చూస్తే మీకే తెలుస్తుంది. నెట్స్లో భారీ షాట్లను కొట్టేస్తున్నాడు. ఇలానే మ్యాచ్లోనూ ఆడితే విజయం వరించడం ఖాయం’’ అని రైనా తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
ప్రపంచ కప్ కోసం జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్లు కాస్త గుర్రుగానే ఉన్నారు. సెలక్షన్ కమిటీ కొందరిపట్ల అభిమానం చూపిస్తుందని విమర్శలు గుప్పించారు. -
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
పంజాబ్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ప్లేఆఫ్స్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. -
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
నంబర్ 6 ర్యాంకర్కు నో ప్లేస్.. ఆ బాధను తట్టుకోవడం కష్టమే: ఇర్ఫాన్ పఠాన్
-
దిల్లీ ఎల్జీ కీలక నిర్ణయం.. మహిళా కమిషన్లో 223 మంది తొలగింపు
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి