Sushil Kumar: అరెస్టు ఎందుకంటే..?
భారత్కు స్వతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు..
* సుశీల్ కెరీర్ను కూల్చిన అద్దె వివాదం
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
భారత్కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఒలింపిక్స్లో వ్యక్తిగతంగా వరుసగా రెండు పతకాలు సాధించిన ఏకైక క్రీడాకారుడు.. దేశంలో అతడిని వరించని క్రీడా పురస్కారం లేదు.. ఎంతోమంది యువకులు అతడిని చూసి పహిల్వాన్ అవ్వాలని జిమ్లలో చేరారు. అలాంటి వ్యక్తి తన శిష్యుడినే హత్య చేశాడనే ఆరోపణలపై కొన్నాళ్లపాటు పరారయ్యాడు.. అతడిపై పోలీసులు రూ.లక్ష రివార్డు కూడా ప్రకటించారు. ఎట్టకేలకు పోలీసులకు దొరికి జైలుపాలయ్యాడు. అతడే రెజ్లింగ్ ఛాంపియన్ సుశీల్కుమార్..!
ఇంటి అద్దె గొడవ..
సుశీల్ కుమార్కు దిల్లీలోని మోడల్ టౌన్లో ఒక ఇల్లు ఉంది. దానిలో రెజ్లర్ సాగర్ కుమార్ ధన్కర్ కొన్నాళ్లు అద్దెకు ఉన్నాడు. ఈ క్రమంలో అతను అద్దె సరైన సమయానికి చెల్లించలేదు. దీంతో సుశీల్, అతనికి మధ్య వివాదం చోటు చేసుకొంది. అప్పట్లో సాగర్ను ఖాళీ చేయించడానికి సుశీల్ తీవ్రంగా ప్రయత్నించాడు. దీనికి అతడి బంధువు ఆనంద్ అనే వ్యక్తి కూడా సాయం చేశాడు. దీంతో సాగర్ నాలుగు నెలల క్రితం ఆ ఇంటిని ఖాళీ చేసి వేరే చోటుకు మారిపోయాడు. ఆ తర్వాత నుంచి సుశీల్ కుమార్ను సాగర్ అందరి ఎదుట దూషించడం మొదలుపెట్టాడని పోలీసులు పేర్కొన్నారు. దీంతో తన ప్రతిష్ఠ దెబ్బతింటోందని సుశీల్ ఆగ్రహం చెందాడు.
స్టేడియం వద్ద ఘర్షణ..
మే 4వ తేదీ అర్ధరాత్రి ఛెత్రసాల్ స్టేడియం వద్ద సుశీల్, ఆయన బృందం హాకీ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లతో తమపై దాడి చేసిందని క్షతగాత్రుల్లో ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి సమయంలో సుశీల్ అక్కడే ఉన్నారని చెప్పారు. వారి కార్లలో హాకీ బ్యాట్లు, క్రికెట్ బ్యాట్లు ఉన్నాయని వెల్లడించారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో స్టేడియంలో అథ్లెట్లు ఉన్నట్లు సమాచారం. దాడి అనంతరం రాత్రి 2 గంటల సమయంలో సుశీల్ కుమారే పోలీసు కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి స్టేడియం వద్ద ఘర్షణ జరిగినట్లు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి వెళ్లేసరికి ఐదుకార్లు ఆపి ఉన్నాయి. వాటిల్లో ఉన్న ఒక స్కార్పియో కారులో తూటాలు నింపి ఉన్న డబుల్ బ్యారెల్ గన్, మూడు కార్ట్రెడ్జ్లు దొరికాయి. ముగ్గురు వ్యక్తులు తీవ్రగాయాలతో పడిపోయి ఉన్నారు. వారిలో సాగర్ చికిత్స పొందుతూ మరణించాడు. సుశీల్ బృందం చేసిన దాడిలో సోను మోనల్, అమిత్ కుమార్ అనే వ్యక్తులు కూడా తీవ్రంగా గాయపడ్డారు. వీరు సుశీల్ కుమార్ పై ఆరోపణలు చేశారని డీసీపీ జి.ఎస్.సిద్ధు తెలిపారు. ఈ దాడిలో దాదాపు 20 మంది పాల్గొన్నట్లు సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ప్రిన్స్ దలాల్ అనే రెజ్లర్ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి సుశీల్ పరారీలో ఉన్నాడు. అతడి ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది.
సాగర్ ఎవరు..?
సాగర్ ధన్కర్ హరియాణాలోని సోనిపట్కు చెందిన యువకుడు. అతడు సుశీల్ విజయాలను చూసి.. స్ఫూర్తి పొంది రెజ్లర్గా మారాడు. దాదాపు 8 ఏళ్ల పాటు దిల్లీలోని ఛెత్రసాల్ స్టేడియంలో శిక్షణ పొందాడు. 23 ఏళ్ల సాగర్ కూడా రోమన్స్టైల్ రెజ్లింగ్లో 97 కిలోల విభాగంలో జూనియర్ నేషనల్ ఛాంపియన్. సాగర్.. సుశీల్ కుమార్ను తన గరువుగా భావిస్తాడని అతడి తండ్రి అశోక్ ధన్కర్ మీడియా ఎదుట చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు. అశోక్ దిల్లీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు.
సుశీల్ కుమార్ స్వయంగా సాగర్, సోను, అమిత్లను బలవంతంగా కారులో ఎక్కించుకొని ఛెత్రసాల్ స్టేడియానికి తీసుకెళ్లినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఉన్న అనుచరుల సాయంతో దాడి చేసినట్లు తెలిసింది. ఈ క్రమంలో చుట్టుపక్కల వారు మొబైల్లో చిత్రీకరించిన వీడియో పోలీసులకు లభించినట్లు సమాచారం. గాయపడిన సాగర్ 5వ తేదీన మరణించాడు. అప్పటి నుంచి సుశీల్ కుమార్ అదృశ్యం అయిపోయాడు. ఈ విషయం పోలీసులకు అనుమానం పెంచింది. తొలుత ఓ బాబా ఆశ్రమంలో దాక్కొన్నట్లు సమాచారం లభించడంతో అక్కడ తనిఖీలు చేశారు. ఆ తర్వాత సుశీల్ కారులో ప్రయాణిస్తున్న ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది.
సుశీల్ ప్రతిష్ఠ దెబ్బతింది ఇలా..
ఇండియన్ రైల్వేస్లో అసిస్టెంట్ కమర్షియల్ మేనేజర్గా పనిచేస్తున్న సుశీల్ కుమార్ను కొన్నాళ్ల క్రితం ఛెత్రసాల్ స్టేడియానికి ఓఎస్డీగా నియమించారు. ది స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడు కూడా. ఈ ఫెడరేషన్కు గుర్తింపులేదు. ఇక స్టేడియం ఇన్ఛార్జి సత్పాల్ స్వయాన సుశీల్ కుమార్కు మావయ్య. దీంతో సుశీల్ మాటకు స్టేడియంలో ఎదురులేదు. 2012 ఒలింపిక్స్ తర్వాత సుశీల్ చాలా వ్యాపారాలను మొదలుపెట్టారు. ఒక దశలో దిల్లీ చుట్టుపక్కల టోల్ప్లాజాల కాంట్రాక్టులు అత్యధికంగా అతడికే దక్కాయి. దీంతో పాటు ఆయన చెడు స్నేహాలకు అలవాటు పడినట్లు కథనాలు వెలువడ్డాయి. కొన్నేళ్ల క్రితం సుశీల్ అనుచరులు పర్వీన్ రాణా అనే రెజ్లర్ పై దాడి చేశారు. ఈ ఘటనలో సుశీల్ నేరుగా పాల్గొనలేదు. నర్సింగ్ యాదవ్ అనే రెజ్లర్ నిషేధిత ఉత్ప్రేరకాలు వాడి సస్పెండ్ కావడం వెనుక సుశీల్ హస్తం ఉందన్న ఆరోపణలున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!