IPL 2021: ఊపిరి పీల్చుకున్న రాహుల్.. నిరాశగా విలియమ్సన్
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. శనివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 5 పరుగులతో గెలిచింది...
ఇంటర్నెట్డెస్క్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఊపిరి పీల్చుకున్నాడు. శనివారం రాత్రి సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు 5 పరుగుల తేడాతో గెలిచింది. అంతకుముందు రాజస్థాన్తో తలపడిన పోరులో రాహుల్ టీమ్ తృటిలో విజయాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సన్రైజర్స్తో ఆడిన మ్యాచ్లో తొలుత ఓటమిపాలయ్యేలా కనిపించినా చివరి బంతి వరకూ పోరాడి మరో ఓటమిని తప్పించుకుంది.
ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా: రాహుల్
‘ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నా. ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉన్నా మేం మంచి స్కోర్ సాధిస్తే బౌలర్లు గెలిపిస్తారనే నమ్మకం కలిగించింది. ఇక షమి కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడు విలియమ్సన్, వార్నర్ లాంటి మేటి బ్యాట్స్మెన్ను ఔట్ చేయడంతో తర్వాత మా స్పిన్నర్లకు పని తేలికైంది. మేం మరో 20-30 పరుగులు చేసి ఉంటే స్కోరు 140-150కి చేరేది. అయితే, ఇది బ్యాటింగ్ పిచ్ కాదనే విషయాన్ని బ్యాట్స్మెన్ అర్థం చేసుకోవాలి. ఇక సన్రైజర్స్ ఆల్రౌండర్ హోల్డర్ అత్యద్భుతంగా ఆడాడు. తొలుత బంతితో ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసిన అతడు తర్వాత కష్టతరమైన పిచ్పై బ్యాట్తోనూ రాణించాడు’ అని పంజాబ్ కెప్టెన్ రాహుల్ పేర్కొన్నాడు.
చాలా నిరాశగా ఉంది: విలియమ్సన్
‘మా బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో ఎలాంటి లోపం లేదు. అయితే, పిచ్ ఒక్కటే కఠినంగా ఉంది. మేం కొన్ని భాగస్వామ్యాలు నిర్మించి ఉంటే బాగుండేది. హోల్డర్ రెండు ఇన్నింగ్స్ల్లోనూ మంచి ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా తన బ్యాటింగ్తో మ్యాచ్ను చివరి వరకూ తీసుకెళ్లాడు. అయితే వరుస ఓటములతో ఈ సీజన్ నిరాశ కలిగించింది. మేం ఎక్కడెక్కడ మెరుగవ్వాలో పరిశీలించుకోవాలి. పంజాబ్ బాగా ఆడింది. మాపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించింది. కానీ, ఈ పిచ్పై షాట్లు ఆడటం అంత తేలికకాదు. మేం సరైన భాగస్వామ్యాలు నిర్మించాల్సింది. ఇలాంటి పిచ్పై వికెట్లు కోల్పోకుండా వారిపై ఆధిపత్యం చెలాయించడం చాలా కష్టం. ఇక తర్వాతి మ్యాచ్పై దృష్టిపెట్టి మంచి ప్రదర్శన చేయాడానికి ప్రయత్నిస్తాం’ అని విలియమ్సన్ అన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.