
IND vs PAK: ఆనందం సరే.. అతిచేయవద్దు..
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియాపై చారిత్రక విజయం సాధించాక పాకిస్థాన్ ఆటగాళ్లకు కెప్టెన్ బాబర్ అజామ్ గట్టి హెచ్చరికలు జారీ చేశాడు. ఈ అద్భుత విజయాన్ని ఆస్వాదించే క్రమంలో మితిమీరిన విధంగా సెలబ్రేషన్స్ చేసుకోకుండా కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలని సూచించాడు. ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియాపై ఒక్కటే గెలవడానికి రాలేదని, ప్రపంచకప్ సాధించేవరకు కష్టపడాలన్నాడు. మ్యాచ్ అనంతరం బాబర్ తమ ఆటగాళ్లతో సమావేశమైన వీడియోను పాక్ క్రికెట్ బోర్డు ట్విటర్లో అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా బాబర్ ఇలా స్పందించాడు.
‘మనం ఈ విజయాన్ని ఆస్వాదిద్దాం. కానీ, హోటల్కు వెళ్లాక మన కుటుంబ సభ్యులతో సెలబ్రేట్ చేసుకుందాం. భారత్తో మ్యాచ్ అయిపోయింది కదా అని మిగతా మ్యాచ్లకు సన్నద్ధమవ్వడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ ఈ విజయాన్ని ఎంజాయ్ చేయండి. కానీ.. జట్టులో మీ పాత్రలేంటో మర్చిపోవద్దు. మనం ఇక్కడ భారత జట్టు ఒక్కదాన్నే ఓడించడానికి రాలేదు. ప్రపంచకప్ గెలవడానికి వచ్చాం. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి’ అని బాబర్ పేర్కొన్నాడు. అలాగే ఆ జట్టు మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్ ఓ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు ఈ విజయాన్ని ఆస్వాదించే క్రమంలో అతి చేయొద్దని, ప్రపంచకప్ గెలవడానికి ఇంకా చాలా మ్యాచ్లు ఆడాల్సి ఉందన్నాడు. అది జరగాలంటే భారత్పై చెలరేగినట్లే ప్రతి ఆటగాడు మిగతా మ్యాచ్ల్లో రాణించాల్సిన అవసరం ఉందని మాజీ కోచ్ అభిప్రాయపడ్డాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.