Team India: మా ఓటములకు అదే కారణం.. అంతమాత్రాన బ్యాడ్ టీమ్ కాదు: రోహిత్
టీమ్ఇండియా బ్యాట్స్మన్ ఫామ్లోకి వచ్చారు. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో చెలరేగినట్లు బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్పై దంచికొట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్, రాహుల్ అర్ధశతకాలతో విరుచుకుపడి...
ఇంటర్నెట్డెస్క్: టీమ్ఇండియా బ్యాట్స్మన్ ఫామ్లోకి వచ్చారు. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో చెలరేగినట్లు బుధవారం రాత్రి అఫ్గానిస్థాన్పై దంచికొట్టారు. ముఖ్యంగా ఓపెనర్లు రోహిత్, రాహుల్ అర్ధశతకాలతో విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో రోహిత్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. అయితే, మ్యాచ్ అనంతరం హిట్మ్యాన్ మీడియాతో మాట్లాడుతూ టీమ్ఇండియా తొలి రెండు ఓటములకు గల కారణాలు వెల్లడించాడు.
‘ఇప్పుడు మేం ఆడుతున్నన్ని మ్యాచ్లు, అలాగే బయట ఉన్న ప్రతికూల పరిస్థితుల నడుమ కొన్నిసార్లు రాణించడం కష్టమవుతోంది. బరిలోకి దిగిన ప్రతిసారీ కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అందుకోసం మేం మానసికంగా ప్రశాంతంగా ఉండాలి. ఎక్కువ మ్యాచ్లు ఆడటం వల్ల కొన్నిసార్లు మా నిర్ణయాలు సరైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు. బిజీ షెడ్యూల్ వల్లే ఇలా జరుగుతుంది. ఆటగాళ్లకు క్రికెట్ నుంచి కొంత సమయం విరామం ఉండాలి. దాంతో రిఫ్రెష్ అవ్వొచ్చు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
అలాగే ప్రపంచకప్లాంటి మెగా టోర్నీలు ఆడేటప్పుడు ఆటగాళ్ల ధ్యాసంతా మ్యాచ్పైనే ఉండాలి.. కానీ, గత రెండు మ్యాచ్ల్లో తాము అదే చేయలేకపోయామని హిట్మ్యాన్ అంగీకరించాడు. అందుకే ఆ రెండు మ్యాచ్లు ఓటమిపాలయ్యామని చెప్పాడు. అంతమాత్రాన టీమ్ఇండియా బలహీనమైన టీమ్ కాదన్నాడు. అలా తప్పులు జరిగినప్పుడు వాటిని సరిదిద్దుకొని తిరిగి రావడం చాలా ముఖ్యమని తెలిపాడు. ఇప్పుడు అఫ్గాన్తో మ్యాచ్లో తాము అదే పనిచేశామని చెప్పాడు. అనంతరం టీమ్ఇండియా సెమీస్కు చేరే విషయంపై స్పందిస్తూ.. అది తమకు చాలా దూరంగా ఉందన్నాడు. కానీ.. అఫ్గాన్, న్యూజిలాండ్ మ్యాచ్పై తమ అవకాశాలు ఆధారపడ్డాయని చెప్పాడు.
ద్రవిడ్ ఎంపిక అధికారిక ప్రకటనా..? నాకు తెలియదు
చివరగా బ్యాటింగ్ దిగ్గజం, మాజీ సారథి రాహుల్ ద్రవిడ్ టీమ్ఇండియా కొత్త కోచ్గా ఎంపికవ్వడంపై రోహిత్ హర్షం వ్యక్తం చేశాడు. తొలుత ఈ విషయం గురించి తనకు తెలియదని చెప్పాడు. తాము అఫ్గాన్తో మ్యాచ్లో బిజీగా ఉన్నామని, దాని గురించి సమచారం లేదన్నాడు. అయినా, ద్రవిడ్ పర్యవేక్షణలో మెరుగైన శిక్షణ పొందడానికి ఆటగాళ్లంతా సిద్ధంగా ఉన్నారన్నాడు. ద్రవిడ్ భారత జట్టులో మళ్లీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో శుభాకాంక్షలు చెప్పాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జనం భూమిలో... జగన్ చిచ్చు..!
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్