USA U-19W Team: మహిళల U19 ప్రపంచకప్ కోసం యూఎస్ఏ టీమ్.. అందరూ భారత సంతతే!
భారత్లో క్రికెట్కు ఆదరణ భారీగా ఉంటుంది. అలాగే ఆటను ఆడేవారూ ఎక్కువే. అదే అమెరికాలో అయితే బేస్బాల్, వాలీబాల్, ఫుట్బాల్... ఇలా క్రికెటేతర ఆటలు ప్రసిద్ధి. అయితే ఇటీవల అమెరికాలోనూ క్రికెట్కు ఆదరణ పెంచేందుకు ఐసీసీ చర్యలు చేపట్టింది. దీంతో వచ్చే ఏడాది జరిగే అండర్ - 19 ప్రపంచకప్ కోసం జట్టును ప్రకటించింది. ఈ జట్టులో అందరూ భారత్ మూలాలు ఉన్నవారే కావడం విశేషం.
(ఫొటో సోర్స్: యూఎస్ఏ క్రికెట్ ట్విటర్)
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జనవరి తొలి వారంలో తొలిసారిగా జరిగే మహిళల అండర్ -19 ప్రపంచకప్ పోటీలకు యూఎస్ఏ తన జట్టును ప్రకటించింది. ప్రతి దేశం తమ టీమ్లను ప్రకటిస్తుంది కదా.. ఇందులో వింతేముందంటారా? అయితే, ఇక్కడ రెండు ఆసక్తికరమైన విషయాలున్నాయి. మరి అవేంటో తెలుసుకోవాలని ఉందా..?
అమెరికా నుంచి తొలి మహిళా జట్టు
అమెరికా 2010లో పురుషుల అండర్ -19 జట్టు ప్రపంచకప్లో ఆడగా.. తాజాగా ఆ దేశ మహిళా జట్టు కూడా తొలిసారి ప్రపంచకప్ కోసం రంగంలోకి దిగింది. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 7వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు టోర్నీ జరగనుంది. 16 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, శ్రీలంకతో కూడిన గ్రూప్ - Aలో యూఎస్ఏ తలపడనుంది.
అందరూ భారత మూలాలు ఉన్నవారే..
అండర్ - 19 ప్రపంచకప్ కోసం యూఎస్ఏ 15 మందితో కూడిన ప్రధాన జట్టును ఎంపిక చేసింది. కెప్టెన్గా గీతికా కొడాలి బాధ్యతలు నిర్వర్తించనుంది. అలాగే మిగతా వారంతా భారత మూలాలు కలిగిన క్రికెటర్లు కావడం గమనార్హం. వెస్టిండీస్ మాజీ స్టార్ బ్యాటర్ శివనారయణ్ చంద్రపాల్ జట్టుకు కోచ్గా వ్యవహరిస్తాడు. అలాగే మరో ఐదుగురిని రిజర్వ్లో ఉంచారు. ఇందులో కెప్టెన్, వైస్ కెప్టెన్ సహా తెలుగు రాష్ట్రాల నేపథ్యం ఉన్నవారే ఐదుగురు ఉండటం విశేషం.
యూఎస్ఏ జట్టు ఇదే:
గీతికా కొడాలి (కెప్టెన్), అనికా కొలన్ (వైస్ కెప్టెన్), అదితి చుదసామ, భూమిక భద్రిరాజు, దిశా దింగ్రా, ఇసాని వంగేలా, జివానా అరాస్, లాస్య ముళ్లపూడి, పూజా గణేశ్, పూజా షా, రితు సింగ్, సాయి తన్మయి ఈయున్ని, స్నిగ్ధ పాల్, సుహాని తదాని, తరనుమ్ చోప్రా
రిజర్వ్: చేత్నా ప్రసాద్, కస్తూరి వేదాంతమ్, లిసా రంజిత్, మిథాలీ పట్వార్థాన్, టై గోన్సాల్వేస్
యూఎస్ఏ మ్యాచ్లు ఇలా:
* శ్రీలంకతో జనవరి 14న
* ఆస్ట్రేలియాతో జనవరి 16న
* బంగ్లాదేశ్తో జనవరి 18న
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
ప్రపంచ టీ20 క్రికెట్ చరిత్రలో పంజాబ్ అద్భుతం సృష్టించింది. ఇప్పటి వరకు ఏ జట్టుకూ సాధ్యంకాని రికార్డును తన ఖాతాలో వేసుకుంది. -
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM