Dhoni:ధోనీతో పరాగ్‌ని చూస్తే ఆశ్చర్యపోతారు

రియాన్‌ పరాగ్‌.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేవారికి పరిచయమక్కర్లేని పేరు. 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ 19 ఏళ్ల యువ ఆల్‌రౌండర్‌..ప్రస్తుతం రాజస్థాన్‌

Published : 11 Jun 2021 01:49 IST

(photo:Rajasthan Royals Twitter)
 

ఇంటర్నెట్ డెస్క్: రియాన్‌ పరాగ్‌.. ఐపీఎల్‌ మ్యాచ్‌లను వీక్షించేవారికి పరిచయం అక్కర్లేని పేరు. 2019లో ఐపీఎల్ అరంగేట్రం చేసిన ఈ 19 ఏళ్ల యువ ఆల్‌రౌండర్‌..ప్రస్తుతం రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కు దిగే పరాగ్‌..క్రీజులో ఉన్నంతసేపు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయడమే కాకుండా అవసరమైనప్పుడు బౌలింగ్‌పరంగానూ జట్టుకు ఉపయోగపడుతూ మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందుతున్నాడు.


అయితే, టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీతో రియాన్‌ పరాగ్‌ దిగిన ఫొటోను రాజస్థాన్‌ రాయల్స్‌ తాజాగా ట్వీట్‌ చేసింది. ఇందులో ఓ ఆసక్తికరమైన అంశం దాగి ఉంది. పరాగ్‌ ఆరేళ్ల వయసులో ఉన్నప్పుడు ధోనీతో కలిసి దిగిన ఫొటోని, 2019లో రియాన్‌ ఐపీఎల్ అరంగేట్రం చేసినప్పుడు ధోనీతో దిగిన ఫోటోని పక్కపక్కన ఉంచుతూ ‘మొదలుపెట్టు, నేర్చుకో, ఎదుగు’అనే వ్యాఖ్యను జతచేసింది.ఈ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తోంది.

ఇక, కరోనా కారణంగా వాయిదాపడిన ఐపీఎల్ 14 సీజన్‌లో రియాన్‌...7 మ్యాచ్‌ల్లో 78 పరుగులు సాధించి ఒక వికెట్‌ పడగొట్టాడు.మిగిలిన ఐపీఎల్ మ్యాచ్‌లను యూఏఈలో నిర్వహించడానికి  బీసీసీఐ ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని