సైబర్ భద్రత మనదే బాధ్యత
ఇంట్లోనే కాదు, ఆన్లైన్లోనూ దొంగలు పడతారు! కంటికేమీ కనిపించరు గానీ వ్యక్తిగత సమాచారం కాజేస్తారు. మాయమాటలు చెప్పో, బురిడీ కొట్టించో రహస్య వివరాలు లాగేస్తారు.
ఇంట్లోనే కాదు, ఆన్లైన్లోనూ దొంగలు పడతారు! కంటికేమీ కనిపించరు గానీ వ్యక్తిగత సమాచారం కాజేస్తారు. మాయమాటలు చెప్పో, బురిడీ కొట్టించో రహస్య వివరాలు లాగేస్తారు. వీటిని ఉపయోగించుకొని ఉన్నదంతా దోచేయొచ్చు. మన లోపాలు, బలహీనతలను అడ్డుపెట్టుకొని బెదిరించొచ్చు. డబ్బులు వసూలు చేయొచ్చు. కాబట్టి జాగ్రత్త అవసరం. ఇప్పుడు వస్తువులు కొనాలన్నా.. ప్రయాణాలకు, సినిమాలకు, వినోదాలకు టికెట్లు పొందాలన్నా.. బ్యాంకు లావాదేవీలకైనా ఆన్లైనే ప్రధాన సాధనంగా మారిపోయింది. అందువల్ల సైబర్ భద్రత రోజురోజుకీ ప్రాధాన్యం సంతరించుకుంటోంది. సంస్థలతో పాటు వ్యక్తులకూ ఇది తప్పనిసరి వ్యవహారంగా మారిపోయింది. కానీ చాలామంది తమకేమీ కాదని, తమ సమాచారానికి పెద్దగా ప్రాధాన్యం లేదనే ధీమాతో వ్యవహరిస్తుంటారు. అలాంటి కొన్ని అపోహల గురించి తెలుసుకొని, అప్రమత్తంగా ఉండటం నేర్చుకుందాం.
నాకేం కాదని అనుకోవద్దు
‘నా మీద ఎవరు దాడి చేస్తారు? కాబట్టి సైబర్ సెక్యూరిటీ గురించి చింతించాల్సిన అవసరం లేదు’ అని చాలామంది భావిస్తుంటారు. ఇది ప్రమాదకరమైన అపోహ. హ్యాకర్లు, సైబర్ నేరగాళ్లు ప్రముఖులనే కాదు.. వివిధ రకాల వ్యక్తులు, సంస్థలను లక్ష్యంగా పెట్టుకుంటారని మరవొద్దు. అంతర్జాలంతో అనుసంధానమైన ప్రతి ఒక్కరికీ ముప్పు పొంచే ఉంటుంది. సైబర్ నేరగాళ్లు ఆటోమేటెడ్ సాధనాలతో నిరంతరం ఇంటర్నెట్ను జల్లెడ పడుతూనే ఉంటారు. చిన్న గుట్టు దొరికినా దాడికి తెగబడతారు. కాబట్టి తమను, తమ డేటాను కాపాడుకోవటానికి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండటం, సెక్యూరిటీ పద్ధతులు పాటించటం తప్పనిసరి.
బలమైన పాస్వర్డ్ ఉంటే చాలదు
‘బలమైన పాస్వర్డ్ ఉంటే చాలు. నా ఖాతా సురక్షితంగా ఉన్నట్టే’ అన్నది మరికొందరి ఆలోచన. కఠినమైన పాస్వర్డ్లు పెట్టుకోవటం ఉత్తమమే కావొచ్చు గానీ ఇదొక్కటే సరిపోదు. సైబర్ నేరగాళ్లు నిజమైన బ్యాంకు అధికారులు, ఇంటర్నెట్ ప్రొవైడర్ల మాదిరిగా నమ్మించి ఖాతా నంబరు, పాస్వర్డ్లను ధ్రువీకరించుకోవాలని ఈమెయిళ్లు పంపొచ్చు. వీటి ద్వారా రహస్య సమాచారాన్ని తస్కరించొచ్చు (ఫిషింగ్). కాబట్టి ప్రతి ఆన్లైన్ ఖాతాకు విడివిడిగా ప్రత్యేక, సంక్లిష్ట పాస్వర్డ్లను పెట్టుకోవటంతో పాటు ఎక్కడ వీలుంటే అక్కడ టూఫ్యాక్టర్ అథెంటికేషన్ను ఎనేబుల్ చేసుకోవాలి.
యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉన్నా..
‘నా సిస్టమ్కు యాంటీవైరస్ సాఫ్ట్వేర్ ఉంది. ఇంకేం కావాలి? ఏమీ కాదు’ అని కొందరు నిశ్చితంగా ఉంటారు. ఒకసారి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకొని పనైపోయిందని భావిస్తుంటారు. నిజానికి సైబర్ భద్రత విషయంలో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ పాత్ర చాలా కీలకం. ఇది మంచి రక్షణ కల్పిస్తుంది. అయితే ఇదే పూర్తిగా కాపాడుతుందని చెప్పలేం. సాధారణంగా తెలిసిన మాల్వేర్లను గుర్తించి, తొలగించేలా యాంటీవైరస్ సాఫ్ట్వేర్లను రూపొందిస్తారు. కానీ కొత్తగా పుట్టుకొచ్చే ముప్పులను ఇవి పట్టుకోలేకపోవచ్చు. అధునాతన తరహా దాడులను అడ్డుకోలేకపోవచ్చు. కాబట్టి యాంటీవైరస్ సాఫ్ట్వేర్ను ఇన్స్టాల్ చేసుకోవటంతో పాటు దాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి కూడా. బలమైన ఫైర్వాల్స్ను ఏర్పాటు చేసుకోవాలి. బ్రౌజింగ్ చేసేటప్పుడూ పొరపాట్లకు తావివ్వకుండా చూసుకోవాలి.
ఫిషింగ్ మెయిళ్లను పట్టుకోలేకపోవచ్చు
‘ఫిషింగ్ మెయిళ్లన్నింటినీ ఇట్టే గుర్తిస్తా’ అని కొందరు ధీమాగా ఉంటుంటారు. ఇది తప్పు. ఫిషింగ్ ఈమెయిళ్లు రోజురోజుకీ అధునాతనంగా మారుతున్నాయి. వీటిని చూడగానే పోల్చుకోవటం అన్నిసార్లూ సాధ్యం కాదు. సైబర్ నేరగాళ్లు చాలా తెలివిగా ప్రవరిస్తుంటారు. ఫిషింగ్ మెయిళ్లు విశ్వసనీయమైనవి, అసలు సంస్థలవే అని నమ్మించేందుకు ప్రయత్నిస్తుంటారు. ప్రాచుర్యంలో ఉన్న లోగోలను వాడుతుంటారు. మెయిల్కు స్పందించటం అత్యవసరమనీ నమ్మబలుకుతుంటారు. అందువల్ల మెయిల్ను పంపించినవారి అడ్రస్ను ఒకటికి రెండు సార్లు సరి చూసుకోవాలి. లింక్స్ మీద క్లిక్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఆన్లైన్లో వ్యక్తిగత సమాచారాన్ని షేర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.
వై-ఫై నెట్వర్క్లన్నీ సురక్షితం కాదు
‘పబ్లిక్ వై-ఫై నెట్వర్క్లు మంచివే. వాటిని వాడితే ఇబ్బందేమీ ఉండదు’ అని మరికొందరు అపోహ పడుతుంటారు. ఇది నిజం కాదు. కాఫీ దుకాణాలు, హోటళ్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ల వంటి చోట్ల అందరికీ అందుబాటులో ఉంచే వై-ఫై నెట్వర్క్లు సురక్షితం కాదు. హ్యాకర్లు వీటిపై డేగ కన్ను వేసి ఉంచుతారు. తేలికగా నెట్వర్క్లోకి చొచ్చుకొచ్చే అవకాశముంది. రహస్య సమాచారాన్ని తస్కరించే ప్రమాదముంది. అందువల్ల పబ్లిక్ వై-ఫై నెట్వర్క్ల వాడకంలో జాగ్రత్త అవసరం. రహస్య సమాచారాన్ని యాక్సెస్ లేదా ట్రాన్స్ఫర్ చేయొద్దు. కనెక్షన్ను ఎన్క్రిప్ట్ చేసుకోవటానికి, భద్రతను పెంచుకోవటానికి వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్) వాడుకోవాలి.
మొబైల్ ఫోన్ల మీదా కన్ను
‘మొబైల్ ఫోన్ల మీద సైబర్ దాడులు జరగవు’ అనేది చాలామంది నమ్మకం. ఇది అపోహ మాత్రమే. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్ల వాడకం విస్తరిస్తున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు వీటిని కూడా లక్ష్యంగా చేసుకోవటం ఎక్కువైంది. హానికర యాప్లు, వెబ్సైట్లు, రక్షణలేని వై-ఫై నెట్వర్క్ల వంటివన్నీ మొబైల్ పరికరాలకు ముప్పు తెచ్చిపెట్టేవే. కాబట్టి ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్స్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్లేస్టోర్, యాప్స్టోర్ వంటి విశ్వసనీయమైన వనరుల నుంచే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవాలి. సున్నితమైన, రహస్య సమాచారాన్ని యాక్సెస్ చేసేటప్పుడు భద్రమైన కనెక్షన్లనే ఉపయోగించాలి.
డేటాను డిలీట్ చేస్తే చాలదు
‘ఒకసారి డేటాను డిలీట్ చేస్తే శాశ్వతంగా పోయినట్టే’ అని కొందరు పొరపడుతుంటారు. తమ పరికరాలు లేదా ఆన్లైన్ ఖాతాల నుంచి ఫైళ్లను డిలీట్ చేస్తే అవి శాశ్వతంగా ఎరేజ్ అయినట్టే అనుకోవటం తగదు. వీటిని డిలీట్ చేసినంత మాత్రాన పూర్తిగా తొలగిపోవు. భద్రంగా ఓవర్రైట్ చేస్తేనే శాశ్వతంగా పోయినట్టు. లేకపోతే డిలీట్ చేసిన ఫైళ్లను ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ సాయంతో తిరిగి పొందే అవకాశముంది. కాబట్టి తమకు అవసరం లేని రహస్య సమాచారం ఎప్పటికీ ఇతరుల కంట పడకూడదని అనుకుంటే డిస్క్ వైపింగ్ సాఫ్ట్వేర్ల వంటి సాధానాలతో ఎరేజ్ చేసుకోవాలి. లేదూ హార్డ్డిస్క్ వంటి మెమరీ స్టోరేజీ పరికరాలను పగల కొట్టటం వంటివైనా చేయొచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్క్రీన్ లాక్ అయినా జెమినీతో పనులు
గూగుల్ జెమినీ ఏఐ అసిస్టెంట్ను ఇప్పుడు లాక్ చేసిన ఆండ్రాయిడ్ ఫోన్ల మీదా వాడుకోవచ్చు. ఇష్టమైన ఆదేశాలు జారీచేయొచ్చు. అలారమ్స్ పెట్టుకోవటం, మ్యూజిక్ ప్లే చేయటం వంటి పనులెన్నో చేసుకోవచ్చు. -
ఐఫోన్లో కృత్రిమ గొంతు
యాపిల్ ఇటీవల పర్సనల్ వాయిస్ ఫీచర్ను పరిచయం చేసింది. మన గొంతు మాదిరిగానే అనిపించే కృత్రిమ గొంతుతో స్నేహితులు, కుటుంబసభ్యులతో మాట్లాడటానికి వీలు కల్పించటం దీని ప్రత్యేకత. -
కొత్తగా పోకో ఎం6 5జీ ఫోన్లు
మనదేశంలో కొత్త 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీతో పోకో ఎం6 5జీ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. మొదట్లో 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ.. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ.. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీతో వీటిని ప్రవేశపెట్టారు. -
త్వరలో నథింగ్ 2ఏ ప్లస్
ఈ సంవత్సరం ఆరంభంలో వచ్చిన నథింగ్ ఫోన్ 2ఏ కోవలో మరో కొత్త వేరియంట్ రాబోతోంది. నథింగ్ ఫోన్ 2ఏ ప్లస్ రూపంలో త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి వస్తోంది. -
ఐఫోన్ను కంటితోనే కదిలించండి
తాజా ఐఓఎస్ 18 బీటా యూజర్లకు కొత్తగా ‘ఐ ట్రాకింగ్’ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. పేరుకు తగ్గట్టుగానే దీని సాయంతో కళ్లతోనే ఐఫోన్ను నియంత్రించొచ్చు. -
ఇంటికి కావాలో కెమెరా..
గ్రామాలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా భద్రత కోసం సీసీటీవీ కెమెరాల నిఘా తప్పనిసరైంది. వీటిల్లో తీగతో కూడినవి, తీగలు లేనివి.. రెండు రకాలున్నాయి. వీటికి బయటి నుంచి విద్యుత్తు సరఫరా తప్పనిసరి. -
యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చేంతవరకూ ఆగాలా?
ఇంటెలిజెన్స్ అనే సొంత ఏఐ పరిజ్ఞానాన్ని తీసుకొస్తున్నట్టు యాపిల్ సంస్థ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇది అందుబాటులోకి రావటానికి ఇంకా చాలా నెలలు వేచి చూడాల్సిందే. -
ఐఫోన్ మాయలు
వచ్చే ఐఓఎస్ 18, ఐప్యాడ్ఓఎస్ 18, మ్యాక్ఓఎస్ సుకోయాతో బోలెడన్ని కొత్త ఫీచర్లు రానున్నట్టు యాపిల్ సంస్థ వార్షిక డెవలపర్ సమావేశంలో (డబ్ల్యూడబ్ల్యూడీసీ) ప్రకటించారు. -
పీసీ జోష్
డెస్క్టాప్, ల్యాప్టాప్ వంటి పీసీలతో గొప్ప ప్రయోజనం బోలెడన్ని అప్లికేషన్లు అందుబాటులో ఉండటం. గేమింగ్, గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్, వ్యాపార అవసరాలు.. ఇలా ఎలాంటి పనులకైనా సాయం చేయటానికి సిద్ధంగా ఉంటాయి. -
ఆనాటి పాత ఫోన్లే ముద్దు
ఇప్పుడు ఎవరిచేతిలో చూసినా అధునాతన టెక్ పరికరాలే కనిపిస్తున్నాయి కదా. అయితే స్మార్ట్ఫోన్లు అధికంగా వాడటం మానసిక సమస్యలు పెరగటానికి కారణమవుతోందని వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ తాజా నివేదిక పేర్కొంటోంది. -
ఫోన్ టైపింగ్ వేగంగా
కీబోర్డుల్లో మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్కీ ప్రత్యేకతే వేరు. ఉచితంగా లభించే దీన్ని ఆండ్రాయిడ్, ఐఓఎస్ పరికరాలు రెండింటిలోనూ వాడుకోవచ్చు. వేగంగా టైప్ చేయటానికి తోడ్పడే కృత్రిమ మేధ (ఏఐ) సపోర్టుతో కూడిన ఇందులో ఫీచర్లూ చాలానే ఉన్నాయి. -
జీబోర్డు మాయ
ఆండ్రాయిడ్ ఫోన్లయినా, ఐఓఎస్ ఫోన్లయినా ఎక్కువమంది గూగుల్ కీబోర్డు వాడుతుంటారు. తేలికగా టైప్ చేయటానికి, ఇతరత్రా అవసరాలకు వన్ హ్యాండెడ్ మోడ్ దగ్గరి నుంచి ప్రత్యేక ఎమోజీలు పంపటం వరకూ ఇందులో బోలెడన్ని ఫీచర్లున్నాయి. వీటిని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం. -
ఐఫోన్లో సొంత రింగ్టోన్
ఐఫోన్లో హోం స్క్రీన్ మీద వాల్పేపర్ మార్చుకోవటం, లాక్ స్క్రీన్, విడ్జెట్స్ జత చేయటం వంటివి తప్పితే ఫీచర్లను ఇష్టమైనట్టుగా మార్చుకునే అవకాశం తక్కువ. షార్ట్కట్స్ యాప్తో ఐకన్లను మార్చుకోవచ్చు గానీ అదో పెద్ద ప్రయాస. అయితే ఇష్టమైన రింగ్టోన్ను పెట్టుకునే అవకాశముంది. -
ఐఫోన్తో సొంత డొమైన్
సొంత డొమైన్ కొనుక్కోవాలని అనుకుంటున్నారా? ఫోన్ ద్వారానే కొనుక్కోవచ్చు. చేతిలో ఐఫోన్, ఐక్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉంటే చాలు. సొంత డొమైన్ పొందొచ్చు. -
వావ్.. మైక్రోసాఫ్ట్ డిజైనర్
కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో ఫొటోలు, బొమ్మలు చిత్రించాలని అనుకుంటున్నారా? అయితే మైక్రోసాఫ్ట్ డిజైనర్(https://designer.microsoft.com/) టూల్ను ప్రయత్నించి చూడండి. -
పీసీ వేగంగా స్టార్ట్
కొత్త విండోస్ పీసీ కొద్ది సెకండ్లలోనే బూటప్ అవుతుంది. కానీ క్రమంగా నెమ్మదిస్తూ వస్తుంది. మరి పీసీ త్వరగా స్టార్టయ్యేలా చేయాలంటే? ఇందుకు కొన్ని ట్రిక్కులు లేకపోలేదు. -
స్మార్ట్ఫోనే రిమోట్
టెలివిజన్లలో ఇప్పుడు స్మార్ట్ టీవీల హవా నడుస్తోంది. టీవీ కార్యక్రమాలే కాకుండా ఓటీటీలు, యూట్యూబ్, అంతర్జాల వీక్షణ వంటి వాటికివి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. -
పీసీ షట్డౌన్ తేలికగా..
కంప్యూటర్ను షట్డౌన్ చేయటం పెద్ద పనేమీ కాదు. కానీ కొన్నిసార్లు చాలా త్వరగా షట్డౌన్ చేయాల్సి రావొచ్చు. అప్పుడు కీబోర్డు మీటలు కలిపి నొక్కే పద్ధతులు బాగా ఉపయోగపడతాయి. అలాంటి కొన్ని చిట్కాలు చూద్దాం. -
వెబ్క్యామే స్కానర్
డెస్క్టాప్ ఉంది గానీ స్కానర్ లేదా? పోనీ వెబ్క్యామ్ అయినా ఉందా? అయితే దీన్నే స్కానర్లా వాడుకుంటే సరి. మ్యాక్లోనైతే- ఫొటో బూత్ను ఓపెన్ చేసి, డాక్యుమెంట్ను వెబ్క్యామ్ ముందుకు తీసుకురావాలి. -
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా వచ్చింది
ఐఓఎస్ 17.5 పబ్లిక్ బీటా అందుబాటులోకి వచ్చింది. అంటే డెవలపర్ అకౌంట్ లేకపోయినా తాజా ఫీచర్లు, అప్డేట్లను ఎవరైనా ప్రయత్నించొచ్చన్నమాట. ఐఓఎస్ 17.5 స్టేబుల్ వర్షన్ ఇప్పుడప్పుడే వచ్చే అవకాశం కనిపించటం లేదు. -
బహుబలి కెమెరా
అమెరికాలోని ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలేటర్ లేబరేటరీ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంత కెమెరాను రూపొందించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం బయటపడింది: హరీశ్రావు
-
గాజాకు పోలియో ముప్పు..! మురుగునీటిలో వైరస్ అవశేషాలు
-
ఆ 36 మంది వివరాలు ఎందుకు ఇవ్వట్లేదు జగన్?: హోంమంత్రి అనిత
-
ఐఫోన్ ప్రియులకు గుడ్న్యూస్.. ధరలు తగ్గించిన యాపిల్
-
అది తినకపోతే షమీ బౌలింగ్ వేగం 15Kmphకు తగ్గుతుందట..!
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి