Telangana News: చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం

తెలంగాణలో మరో రెండు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్ధ (రెడ్కో) ఛైర్మన్‌గా వై.సతీశ్‌

Published : 21 Jun 2022 19:31 IST

హైదరాబాద్‌: తెలంగాణలో మరో రెండు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్ధ (రెడ్కో) ఛైర్మన్‌గా వై.సతీశ్‌ రెడ్డిని నియమించారు. రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, థియేటర్‌ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా అనిల్ కుమార్‌ కుర్మాచలానికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకానికి సీఎం కేసీఆర్‌ ఆమోద ముద్ర వేశారు. అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలనశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీరు మూడేళ్లపాటు బాధ్యతల్లో కొనసాగనున్నారు. సతీశ్‌ రెడ్డి తెరాస సామాజిక మాధ్యమాల విభాగం కన్వీనర్‌గా పనిచేస్తున్నారు. అనిల్‌ కుర్మాచలం తెరాస ఎన్‌ఆర్‌ఐ సెల్‌ లండన్‌ విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని