Ts News: 317 జీవోను సవరించే వరకు కేసీఆర్ను వదిలిపెట్టం: బండి సంజయ్
కరోనాను ఎదుర్కోవడంలో భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజల తరఫున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృతజ్ఞతలు
హైదరాబాద్: కరోనాను ఎదుర్కోవడంలో భారతదేశాన్ని ప్రథమ స్థానంలో నిలిపిన ప్రధాని నరేంద్రమోదీకి తెలంగాణ ప్రజల తరఫున భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే.. మన దేశంలోని ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఆ స్థాయిలో లేనప్పటికీ కరోనాను విజయవంతంగా ఎదుర్కోగలిగామన్నారు. కరోనాను కట్టడి చేసేందుకు లాక్డౌన్ పెడితే ప్రతిపక్షాలు విమర్శించాయన్నారు. అదే సమయంలో లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బందులు పడొద్దని అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు బండి సంజయ్ పేర్కొన్నారు.
‘‘317జీవో వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో 317జీవోపై చర్చించకపోవడం దుర్మార్గం. 317 జీవోను సవరించే వరకు కేసీఆర్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఉద్యోగ, ఉపాధ్యాయులు తల్చుకుంటే గతంలో ప్రభుత్వాలే కూలిపోయాయి. వారికి భాజపా అండగా ఉంటుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులకు మద్దతుగా జాతీయ నాయకులతో వర్చువల్గా సభ నిర్వహిస్తాం. నోటిఫికేషన్ల కోసం కమిటీలు వేశామని చెబుతూ సీఎం కేసీఆర్ కాలయాపన చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సిబ్బంది, మౌలిక సదుపాయాలు లేవు. అలాంటప్పుడు ఆంగ్ల మాధ్యమాన్ని ఎలా అమలు చేస్తారు? కార్పొరేట్ పాఠశాలల నుంచి డబ్బులు దోచుకోవడానికే ఈ నాటకం. ఏడేళ్లలో ఒక్క ప్రభుత్వ పాఠశాలనైనా కేసీఆర్ సందర్శించారా?సీఎం ఏది మాట్లాడినా విశ్వాసం లేకుండా పోయింది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ నిర్వహించిన సమావేశానికి ఎందుకు హాజరుకాలేదో చెప్పాలి’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు