అప్పుడు ఖైదీలు.. ఇప్పుడు అధికారులు

Eenadu icon
By Telangana News Desk Updated : 31 Oct 2025 07:14 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఆదిలాబాద్‌ కలెక్టరేట్ సముదాయంలోని ఒకప్పటి సబ్‌జైలు ఇది. ఇటీవల డీజీపీ శివధర్‌రెడ్డి సమక్షంలో లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత బండి ప్రకాశ్‌ అలియాస్‌ ప్రభాత్‌ 1988లో ఇదే జైలులో శిక్ష అనుభవించి పరారయ్యారు. జైలును నూతన భవనంలోకి మార్చడంతో కొన్నేళ్లుగా ఖాళీగా ఉంది. ఇటీవల కలెక్టరేట్ భవనం కుప్పకూలడంతో కార్యాలయాల తరలింపు అనివార్యమైంది. భవనాలు సరిపడా లేకపోవడంతో ఈ సబ్‌జైలులో ప్రస్తుతం ఆర్డీవో కార్యాలయాన్ని కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఖైదీలను ఉంచిన గదుల్లో రెవెన్యూ దస్త్రాలను భద్రపరిచి,  మిగిలిన గదుల్లో అధికార కార్యకలాపాలను సాగిస్తున్నారు. 

ఈనాడు-ఆదిలాబాద్‌; న్యూస్‌టుడే, కలెక్టరేట్

Tags :
Published : 31 Oct 2025 07:13 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు