Hyderabad: కార్పొరేటర్‌ తిన్న బిర్యానీలో బల్లి.. హోటల్‌ నిర్వాహకుడిపై కేసు

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో బిర్యానీలో బల్లి కలకలం రేపింది. రామ్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ రవిచారి సోదరుడు శ్రీనివాస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌

Updated : 27 May 2022 18:21 IST

బాగ్‌లింగంపల్లి: హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో కొనుగోలు చేసిన బిర్యానీలో బల్లి కనిపించడం కలకలం రేపింది. రామ్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ రవిచారి సోదరుడు శ్రీనివాస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌ నుంచి చికెన్‌ బిర్యానీ తెప్పించుకున్నారు.  ఇద్దరూ కలిసి బిర్యానీ తింటుండగా అందులో బల్లి కనిపించింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరికీ వాంతులయ్యాయి. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులకు కార్పొరేటర్‌ ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న భాజపా కార్యకర్తలు హోటల్‌ ఎదుట నిరసన తెలిపారు. దీంతో రెండు గంటల పాటు ఉద్రిక్తత నెలకొంది. జీహెచ్‌ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో.. ముగ్గురు ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు డా.స్వాతి, డా.వేనక, డా.సిరాజ్‌లు బిర్యానీ నమూనాలు సేకరించారు. హోటల్‌ నిర్వాహకుడికి షోకాజ్‌ నోటీసు జారీ చేసిన అధికారులు.. నమూనాలను ల్యాబ్‌కు పంపించి ఫలితాలు రాగానే చర్యలపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని