Telangana News: 22 జిల్లా జడ్జిల పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణలో 22 జిల్లా జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. జిల్లా జడ్జిల్లో 13 నేరుగా.. మరో 9 సీనియర్ సివిల్ జడ్జిలకు నియామక పరీక్ష ద్వారా పదోన్నతి పద్ధతిలో

Published : 16 Apr 2022 22:12 IST

హైదరాబాద్‌: తెలంగాణలో 22 జిల్లా జడ్జిల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. జిల్లా జడ్జిల్లో 13 నేరుగా.. మరో 9 సీనియర్ సివిల్ జడ్జిలకు నియామక పరీక్ష ద్వారా పదోన్నతి పద్ధతిలో భర్తీ చేయనున్నారు. మే 2 వరకు సీఎస్ కార్యాలయానికి దరఖాస్తులను సమర్పించాలని ప్రభుత్వం తెలిపింది. కనీసం ఏడేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులు జిల్లా జడ్జి ఉద్యోగానికి అర్హులు. రాతపరీక్ష, వైవా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. మరో 9 జిల్లా ఉద్యోగాల పదోన్నతుల ద్వారా భర్తీ చేయనున్నారు. కనీసం ఐదేళ్ల అనుభవం కలిగిన సీనియర్ సివిల్ జడ్జిలను రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని