TELANGANA : సీఎం డైరెక్షన్‌లోనే భాజపా శ్రేణులపై దాడులు: బండి సంజయ్‌

ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడి చేయించారని...

Published : 29 Jan 2022 15:22 IST

చొప్పదండి: తెలంగాణ సీఎం కేసీఆర్‌ డైరెక్షన్‌లోనే భాజపా శ్రేణులపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ ఆరోపించారు. కరీంనగర్‌ జిల్లా చొప్పదండిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను బండి సంజయ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా సంజయ్‌ మాట్లాడుతూ... ఖమ్మంలోనూ తమ కార్యకర్త పట్ల దారుణంగా వ్యవహరించారన్నారు. ఆర్మూర్‌లో ఎంపీ అర్వింద్‌పై దాడి చేయించారని పేర్కొన్నారు. కొంతమంది పోలీసులు సీఎంకు కొమ్ముకాయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలను ప్రజలు గమనిస్తున్నారనే విషయాన్ని సీఎం గ్రహించాలని హెచ్చరించారు. ఇలాంటి దాడులతో సీఎం అభద్రతకు లోనైనట్లు తెలుస్తోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని