ఇంటికి కిలో బంగారం ఇచ్చినా తెరాస అధికారంలోకి రాదు: కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కిలో బంగారం పంచినా అధికారంలోకి రారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వైఖరి, తెరాస ప్రభుత్వం అవినీతిపై తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు.
గాంధీభవన్, న్యూస్టుడే: వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి కిలో బంగారం పంచినా అధికారంలోకి రారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ వైఖరి, తెరాస ప్రభుత్వం అవినీతిపై తెలంగాణ ప్రజలకు స్పష్టమైన అవగాహన వచ్చిందన్నారు. ఆయన మంగళవారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. అవినీతి గురించి చెపుతున్నందుకే సభలో మాట్లాడకుండా తనను అడ్డుకున్నారన్నారు. కోమటిరెడ్డి సోదరులు కలిసుంటే నల్గొండ జిల్లాలో వారికి ఎదురుండదని భయపడి తమ మధ్య మనస్పర్థలు ఉన్నట్లు ఒక వర్గం మీడియా ద్వారా దుష్ప్రచారం చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్లో సమర్థ నాయకులకు కొదవ లేదని, ఎవరి నియోజకవర్గాల్లో వారు పాదయాత్రలు చేస్తే చాలు సునాయాసంగా గెలుస్తామని రాజగోపాల్రెడ్డి అభిప్రాయపడ్డారు.
* కాంగ్రెస్ శాసనసభా పక్షం బుధవారం సమావేశం కానుంది. కాంగ్రెస్ పక్షనేత భట్టివిక్రమార్క అధ్యక్షతన మధ్యాహ్నం 12 గంటలకు సీఎల్పీ కార్యాలయంలో జరిగే ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్