సాహసం చేయరా.. కార్మికా!
చిత్రంలో కార్మికులు చేస్తున్న పనిని చూస్తే ఔరా..అనక తప్పదు. సైబరాబాద్ మధ్యలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్స్టేషన్ కోసం పెద్ద పెద్ద భవనాలకు అడ్డు రాకుండా భూమికి దాదాపు 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన స్తంభాలకు విద్యుత్తు లైన్లు అనుసంధానించడానికి కార్మికులు వాటిని ఎక్కి పనిచేస్తున్నారు.
చిత్రంలో కార్మికులు చేస్తున్న పనిని చూస్తే ఔరా..అనక తప్పదు. సైబరాబాద్ మధ్యలో నిర్మిస్తున్న 400 కేవీ సబ్స్టేషన్ కోసం పెద్ద పెద్ద భవనాలకు అడ్డు రాకుండా భూమికి దాదాపు 80 మీటర్ల ఎత్తులో ఏర్పాటు చేసిన స్తంభాలకు విద్యుత్తు లైన్లు అనుసంధానించడానికి కార్మికులు వాటిని ఎక్కి పనిచేస్తున్నారు. అంత ఎత్తయిన స్తంభంపై ఉంటే గాల్లో తేలుతున్నట్లు ఉంటుంది. ఆ ఎత్తులో పోల్కి అనుసంధానించిన రాడ్పై పాకుతూ విద్యుత్తు తీగలు లాగి నట్లు, బోల్టులు, జంపర్లు కింది నుంచి తాడు సాయంతో అందుకుని బిగించడం నిజంగా సాహసమే. ఇందు కోసం ముందుగా శిక్షణ ఇచ్చి, సంబంధిత వీడియోలు చూపించారని కార్మికులు తెలిపారు. స్తంభాలపైన ఉన్న వారితో వాకీటాకీలో మాట్లాడుతూ అవసరమైన సామగ్రిని పంపుతామని కింద పని చేస్తున్న కార్మికులు చెప్పారు. ఈ పనులు బాహ్యవలయ రహదారి (ఓఆర్ఆర్) నుంచి నానక్రాంగూడకు వెళ్లే మార్గంలో కనిపించాయి.
-ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
టిబెట్ అంశంపై వారితో మాత్రమే చర్చిస్తాం : చైనా
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!