మోదీని గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం
కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం
భాజపాతో దేశానికి.. ప్రజాస్వామ్యానికి ప్రమాదం
సీపీఎం మహాసభలో ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి
ఈనాడు, హైదరాబాద్: కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపడమే లక్ష్యంగా భారత కమ్యునిస్టు పార్టీ(మార్కిస్టు) పోరాడుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఉద్ఘాటించారు. పార్టీ రాష్ట్ర మూడో మహాసభల సందర్భంగా శనివారం సాయంత్రం నిర్వహించిన ఆన్లైన్ మహాసభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే భాజపా ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ప్రజా ఉద్యమాలను బలపరచడం ద్వారానే ఇది సాధ్యం. పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడికక్కడ రాష్ట్రాల్లో పార్టీశాఖలు నిర్ణయం తీసుకుంటాయి. కలిసి పోరాడితే ప్రజల్ని ఓడించగలిగేవారు లేరనేది ఇటీవల రైతు ఉద్యమం చాటిచెప్పింది. ప్రధాని మోదీ దిగిరాక తప్పలేదు. రాజ్యాంగం మీద, ప్రజాస్వామ్యం మీద, మత సామరస్యంపైన జరుగుతున్న దాడులను, దోపిడీని ఎదుర్కోవాలంటే ప్రజా ఉద్యమాలే సరైన మార్గం. దీనికోసం ఎలాంటి ఎత్తుగడ అనుసరించాలనేది పార్టీ నిర్ణయిస్తుంది. దేశంలో అందరికీ రెండు డోసులు వ్యాక్సిన్ వేస్తే ప్రజలు కరోనా నుంచి బయటపడే అవకాశం ఉన్నా కేంద్రం చేతులు ఎత్తేసింది. దేశ సంపదంతా లూటీ అవుతోంది. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తోంది. దేశంలో కోటీశ్వరుల వద్ద ఉన్న సంపద విలువ 55.5 శాతం దేశ ప్రజల సంపదతో సమానం. ప్రపంచ స్థాయి ప్రమాణాల ప్రకారం దేశంలో ఆకలి, పేదరికం సూచీలు పడిపోతున్నాయి. ఎనిమిదేళ్లలో సామూహిక అత్యాచారాలు, మహిళలపై దాడులు, హత్యలు చోటుచేసుకున్నా సరైన నివారణ చర్యలు లేవు. వ్యవసాయం, విద్య, సహకార, విద్యుత్ తదితర వ్యవస్థలపై రాష్ట్రాల హక్కులను హరిస్తున్నారు. పార్లమెంటును రబ్బరు స్టాంపుగా మార్చారు. సీబీఐ, ఈడీలను స్వార్థానికి వాడుకుంటూ ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు’’ అంటూ సీతారాం ఏచూరి విమర్శించారు. పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారాట్ మాట్లాడుతూ.. పోరాటాలతోనే ఏదైనా సాధ్యమనేది అంతా గుర్తుంచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీతారాములు, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
పలు అంశాలపై చర్చ, తీర్మానాలు
భారత కమ్యునిస్టు పార్టీ(మార్క్సిస్టు) రాష్ట్ర మూడో మహాసభలు మంగళవారం వరకు జరగనున్నాయి. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్లో నిర్వహించనున్న ఈ సభల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారాట్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు కేంద్ర కమిటీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరుకానున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సభల్లో పలు అంశాలపై చర్చించి తీర్మానాలు ఆమోదించనున్నారు.
ప్రజా తెలంగాణయే సీపీఎం లక్ష్యం
తెలంగాణ ఆవిర్భావం తరువాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పాలకులు బంగారు తెలంగాణ నిర్మిస్తామని వాగ్దానం చేసినా నెరవేర్చలేదు. ప్రజా తెలంగాణ సాధించడం ఎలా అనేదానిపై పార్టీ ఆలోచన చేస్తోంది. కేంద్రంపై యుద్ధం ప్రకటించకపోతే ప్రజల ప్రయోజనాలకు రక్షణ కష్టం. కాంగ్రెస్ సరైన తీరులో స్పందించడం లేదు.
- బీవీ రాఘవులు, పొలిట్బ్యూరో సభ్యుడు
రాష్ట్రంలో విషసర్పంలా భాజపా
రాష్ట్రంలో భాజపా విషసర్పంలా ఎదుగుతోంది. దేశంతో పాటు ఈ రాష్ట్రంలోనూ సీపీఎంకు భాజపాయే ప్రధాన రాజకీయ శత్రువు. మరోమారు ప్రజాతంత్ర శక్తులను సమీకరిస్తాం. భాజపా దాడి కేవలం కమ్యునిస్టులపైనే కాదు తెరాసపైనా ఉంది. అయినా సీఎం కేసీఆర్ పోరాటం చేయడం లేదు. భాజపాతో బేరసారాలు ఆడుకోవడానికి అధికారాన్ని వాడుకుంటున్నారు. ఆయనతో ఎన్నికల పొత్తు పెట్టుకోం.
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!
-
రివ్యూ హీరామండి: ది డైమండ్ బజార్.. సంజయ్లీలా భన్సాలీ ఫస్ట్ వెబ్సిరీస్ ఎలా ఉంది?
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు