కిషన్‌రెడ్డి కుటుంబ ఆస్తులు రూ.22 కోట్లు

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ.22.54 కోట్లుగా, అప్పులు రూ.1.59 కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి కుటుంబ ఆస్తుల

Updated : 17 Aug 2022 06:40 IST

ఈనాడు, దిల్లీ: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కుటుంబ ఆస్తులు 2022 మార్చి 31 నాటికి రూ.22.54 కోట్లుగా, అప్పులు రూ.1.59 కోట్లుగా ఉన్నాయి. 2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చి నాటికి కుటుంబ ఆస్తుల విలువ రూ.4.34 కోట్ల మేర పెరగగా, అప్పులు రూ.7 లక్షల మేర తగ్గాయి. కేంద్రమంత్రి ప్రధానమంత్రి కార్యాలయానికి సమర్పించిన వివరాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. ఆ ప్రకారం.. కిషన్‌రెడ్డి పేరు మీద వ్యక్తిగతంగా రూ.1.44 కోట్ల ఆస్తులున్నాయి. ఆయన సతీమణి కావ్య పేరు మీద రూ.12.83 కోట్ల ఆస్తులు, రూ.75,16,190 అప్పులు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఆమె వ్యక్తిగత ఆస్తి రూ.6,46,88,046 మేర, అప్పు రూ.75,16,190 మేర పెరిగింది. హిందూ ఉమ్మడి కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) పేరు మీదున్న ఆస్తి విలువ (రూ.1,23,23,000) ఏమాత్రం మారలేదు. కుమార్తె వైష్ణవి పేరున రూ.5.51 కోట్ల ఆస్తి, రూ.84.33 లక్షల అప్పు ఉంది. ఈమె ఆస్తి విలువ గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.1.87 కోట్లు, అప్పు రూ.76.66 లక్షల మేర తగ్గింది. కుమారుడు జి.తన్మయ్‌ పేరిట రూ.97,52,600 ఆస్తులున్నాయి. ఆయన ఆస్తి గత ఏడాది కంటే రూ.95,15,000 పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని