జగన్ కేసుల్లో ఇద్దరు మాజీ ఐఏఎస్ల పిటిషన్ల కొట్టివేత
జగన్ అక్రమాస్తుల కేసుల్లో మాజీ ఐఏఎస్ అధికారులు బి.పి.ఆచార్య, కృపానందం వేర్వేరుగా దాఖలుచేసిన మూడు క్వాష్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది.
బీపీ ఆచార్య, కృపానందంల వ్యాజ్యాలపై తెలంగాణ హైకోర్టు తీర్పు
ఈనాడు, హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసుల్లో మాజీ ఐఏఎస్ అధికారులు బి.పి.ఆచార్య, కృపానందం వేర్వేరుగా దాఖలుచేసిన మూడు క్వాష్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. హెటిరో, అరబిందో, లేపాక్షి నాలెడ్జ్ హబ్లకు భూకేటాయింపుల కేసుల్లో నిందితుడిగా ఉన్న మాజీ ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యపై అభియోగాలను విచారణకు తీసుకుంటూ సీబీఐ కోర్టు వెలువరించిన నిర్ణయాన్ని తెలంగాణ హైకోర్టు సమర్థించింది. అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను సీబీఐ కోర్టు విచారణకు తీసుకోవడాన్ని సవాలు చేస్తూ రెండు కేసుల్లోనూ అప్పటి ఏపీఐఐసీ వీసీ, ఎండీగా పనిచేసిన బి.పి.ఆచార్య వేర్వేరుగా దాఖలుచేసిన పిటిషన్లను కొట్టేస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. దీంతోపాటు భారతి సిమెంట్స్ వ్యవహారంలో తనపై కేసును కొట్టేయాలని బి.కృపానందం దాఖలుచేసిన పిటిషన్ను కొట్టివేసింది. లేపాక్షి నాలెడ్జ్ హబ్, హెటిరో, అరబిందోల్లో నిందితుడుగా ఉన్న బి.పి.ఆచార్య దాఖలు చేసిన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ విచారణ చేపట్టారు. బి.పి.ఆచార్యపై 2012లో అభియోగపత్రం దాఖలు చేసినప్పుడు ప్రాసిక్యూషన్కు కేంద్రం అనుమతి లేనందున కేవలం ఐపీసీ సెక్షన్ల కింద అభియోగాలపై సీబీఐ కోర్టు విచారణకు తీసుకుంది. ఈ కేసును కొట్టేయాలని ఆచార్య తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసి, వాటిని 2021 సెప్టెంబరు వరకూ పొడిగిస్తూ వచ్చింది. 2016లో ఆచార్య ప్రాసిక్యూషన్కు అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆచార్యపై రెండు కేసుల్లోనూ అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలను విచారణకు తీసుకోవాలని సీబీఐ మెమో దాఖలుచేసింది. వీటిని సీబీఐ కోర్టు అనుమతించడంతో ఆచార్య హైకోర్టులో పిటిషన్లు వేశారు. వీటిపై వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి.. కేంద్రం ప్రాసిక్యూషన్కు అనుమతించినందున విచారణకు తీసుకోవడం సమర్థనీయమేనన్నారు. ఈ అంశానికి సంబంధించి వి.డి.రాజగోపాల్ కేసులో ఇదే హైకోర్టు స్పష్టత ఇచ్చిందన్నారు.
విచారణకు ఈ సమాచారం చాలు: కృపానందం పిటిషన్పై హైకోర్టు
భారతి సిమెంట్స్ వ్యవహారంలో సీబీఐ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని మాజీ ఐఏఎస్ అధికారి బి.కృపానందం దాఖలుచేసిన పిటిషన్ను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు సీజే జస్టిస్ ఉజ్జల్ భూయాన్ తీర్పు వెలువరించారు. కడప జిల్లాలో ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి చెందిన భారతి సిమెంట్స్కు లీజుల జారీలో కృపానందం అనుకూలంగా వ్యవహరించారని సీబీఐ ఆరోపించింది. ఇరుపక్షాల వాదనలను విన్న ప్రధాన న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తూ కృపానందంపై విచారణ కొనసాగించడానికి సీబీఐ అభియోగపత్రంలో పేర్కొన్న కారణాలు సరిపోతాయని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
32 మంది వృద్ధులు మరణించినా కళ్లు తెరవరా?
అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న కొందరు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం వేటు వేసినా.. ఇంకా చాలామంది అధికారుల్లో మార్పు రాలేదు. గుణపాఠాలు నేర్చుకోవడంలేదు. -
జగన్ జమానాలో.. వైద్యానికి వైరస్!
‘ఆరోగ్య శ్రీ’-అక్కరకు రాదాయే... నాడు-నేడు- ఏనాడవుతుందో తెలియదాయే... ప్రజారోగ్యం- గాలికొదిలే... వైద్యులు- వలసపోయే... హెల్త్హబ్స్- ఎగిరిపోయే... మందుల పంపిణీ- మచ్చుకైనా కానరాదాయే... ఒక్క అవకాశమంటూ వచ్చి... కనికట్టు కేటాయింపులతో... ఐదేళ్లలో ఆంధ్రావని ఆరోగ్యరంగాన్ని ఐసీయూ పడకెక్కించారు జగన్! -
‘నోటిపారుదల’ మేత.. ఆడుతూ పాడుతూ మేత
‘ప్రతిపక్ష నాయకుడిని, ఇతర నేతలను తిడితే కానీ సీటు రాదు’ అనేది వైకాపాలో పాటించే విధానం. అందుకే ఒకరిని మించి మరొకరు బూతు పురాణంలో పోటీ పడుతుంటారు. -
చిరుజీవులనూ వదల్లేదు!
గనులు, కొండలు గుట్టలు, చెరువులు... ఇసుక, మట్టి, మద్యం... వీటిలో దోచుకున్నది చాలలేదేమో... పూలమ్ముకునే, పాలమ్ముకునే... రోడ్లపై కూరగాయలమ్ముకునే... చిరువ్యాపారులనూ వదల్లేదు జగన్ సర్కారు! -
ప్రోత్సాహమనె.. పొగబెట్టె!
దేశంలో రాష్ట్రాల్లో... అది పారిశ్రామికంగా ముందున్నదైనా... ఇప్పుడిప్పుడే అడుగులేేస్తున్నదైనా... పరిశ్రమలను అధికంగా ప్రోత్సహిస్తాయి... ఉపాధి పెరుగుతుందని ఊతమిస్తాయి... రాయితీలతో రారమ్మంటాయి. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
ఆధ్యాత్మిక సాధనకు వారధిలా సంస్కృతం
దైవభాష సంస్కృతం ఆధ్యాత్మిక సాధనకు వారధిలా నిలుస్తోందని, దాన్ని మన సాంస్కృతిక వారసత్వ సంపదగా భావించి పరిరక్షణకు ప్రచారం చేయడం కర్తవ్యంగా గుర్తించాలని భారత ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ అన్నారు. -
నన్ను అంతమొందించేందుకు కుట్ర
తనను అంతమొందించేందుకు విశాఖలో కుట్ర జరుగుతోందని జై భారత్ నేషనల్ పార్టీ (జేబీఎన్పీ) అధ్యక్షుడు వి.వి. లక్ష్మీనారాయణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు కస్టడీలో నేరాన్ని అంగీకరించిన సతీష్?
ముఖ్యమంత్రి జగన్పైకి తానే రాయి విసిరినట్లు.. గులకరాయి కేసులో ఏ1 సతీష్కుమార్ అలియాస్ సత్తి అంగీకరించారని తెలిసింది. -
తప్పుడు కేసులపై పోలీసులకు సమన్లు
తెదేపా నాయకుడిని రకరకాల కేసుల్లో ఇరికించి నిత్యం స్టేషన్ల చుట్టూ తిప్పుతూ వేధిస్తున్న పోలీసులపై కేసు నమోదు చేయాల్సిందిగా తెనాలి కోర్టు ఆదేశించింది. -
29న వర్సిటీల్లో ఉద్యోగాల భర్తీపై సమావేశం
వైకాపాతో అంటకాగుతున్న ఉన్నత విద్యామండలిలోని కొందరు ఎన్నికల కోడ్ను హేళన చేసేలా ప్రవర్తిస్తున్నారు. నిరుద్యోగ యువతను ప్రభావితం చేసేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. -
ప్రధాని రాష్ట్ర పర్యటన వాయిదా!
ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలుత నిర్ణయించిన ప్రకారం మే 3, 4 కాకుండా 7, 8 తేదీల్లో ఆయన రాష్ట్రానికి రానున్నారని తెలిసింది. -
ఉద్యోగుల బకాయిలు చెల్లించండి
డీఏ బకాయిలు, 11వ పీఆర్సీ, సరెండర్ లీవులతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర ప్రయోజనాలను చెల్లించాలని సీఎస్ జవహర్రెడ్డికి ఏపీ సచివాలయ ఉద్యోగుల సీపీఎస్ సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట్ల రాజేశ్, వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. -
ఐదేళ్లలో 10మందికే!
నేనున్నా.. విదేశాల్లో ఉన్నత చదువులు చదవండి అన్నారు జగన్. ఆ మాటలను నమ్మిన పేద విద్యార్థులు కలల సౌధాలు నిర్మించుకోవాలని ఆశలకు రెక్కలు కట్టుకుని విదేశాల్లో వాలిపోయారు. -
నిందితులు ఏపీ సీఎంకు సన్నిహితులు
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు నిందితుల్లో వైఎస్ భాస్కరరెడ్డి, అవినాష్రెడ్డిలు ఏపీ ముఖ్యమంత్రి జగన్కు సన్నిహితులని, రెండో నిందితుడైన సునీల్యాదవ్కు బెయిలు మంజూరు చేస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని సునీతారెడ్డి తరఫు న్యాయవాది హైకోర్టు దృష్టికి తెచ్చారు. -
ఎన్నికల వేళ.. బకాయిల తాయిలం
ఐదేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగులను అనేక రూపాల్లో రాచిరంపాన పెట్టిన జగన్ ప్రభుత్వానికి పోలింగ్ తేదీ సమీపిస్తున్న వేళ వారిపై ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. -
‘సమర్థ్’ యాప్ను పోలీసు అధికారులంతా వాడాలి
ఈ ఎన్నికల్లో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకునేందుకు ‘సెక్యూరిటీ అరేంజ్మెంట్ మ్యాపింగ్ అనాలసిస్ రెస్పాన్స్ ట్రాకింగ్ హబ్ (సమర్థ్)’ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే
-
పవన్కల్యాణ్కు మద్దతుగా వరుణ్తేజ్ ప్రచారం