దేశ ప్రతిష్ఠ పెంచేలా యాదాద్రి ‘పవర్’
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్కేంద్రం దేశ కీర్తిప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
కార్పొరేట్ వ్యక్తులు ఒత్తిడి తెచ్చినా ప్రభుత్వ రంగంలోనే నిర్మాణం
ప్లాంటు పరిశీలనలో సీఎం కేసీఆర్
వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రెండు యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామన్న అధికారులు
ఈనాడు, నల్గొండ: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్కేంద్రం దేశ కీర్తిప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ప్రైవేటు, కార్పొరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా తలొగ్గకుండా.. రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి ప్రభుత్వరంగ సంస్థ బీహెచ్ఈఎల్ ద్వారా ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నామని స్పష్టంచేశారు. పనులు జరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావును అభినందించారు. వీలైనంత తొందరగా పూర్తి చేసి ఉత్పత్తి మొదలుపెట్టాలని ఆదేశించారు. కరోనా కారణంగా పనులు ఏడాదిన్నర ఆలస్యమయ్యాయని.. 2023 డిసెంబరు నాటికి రెండు యూనిట్లను పూర్తి చేసి విద్యుదుత్పత్తి ప్రారంభిస్తామని, మిగిలిన మూడు యూనిట్లు 2024 జూన్ నాటికి పూర్తవుతాయని ఈ సందర్భంగా ప్రభాకరరావు.. సీఎంకు వివరించారు. థర్మల్ విద్యుత్కేంద్రం పనులను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు జగదీశ్రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్రావు, ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి సీఎం కేసీఆర్ సోమవారం పరిశీలించారు. హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 12.56 గంటలకు హెలికాప్టర్లో సీఎం విద్యుత్కేంద్రం ప్రాంగణానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్లాంటు ఫేజ్-1, యూనిట్-2 బాయిలర్ ప్రదేశానికి బస్సులో వచ్చారు. అక్కడ 82 మీటర్ల ఎత్తులో ఉన్న 12వ ఫ్లోర్కు చేరుకొని నిర్మాణ పనులను బీహెచ్ఈఎల్, జెన్కో అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులతో మాట్లాడి.. నిర్మాణ వివరాలు తెలుసుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన డిస్ప్లే బోర్డులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
పది వేల మందికి ఉపయోగపడేలా టౌన్షిప్ నిర్మాణం
విద్యుత్ కేంద్రంలో పనిచేసే సుమారు 10 వేల మంది సిబ్బందికి ఉపయోగపడేలా అద్భుతమైన టౌన్షిప్ నిర్మాణం జరగాలి. ఇందుకు పట్టణ ప్రణాళిక నిపుణుల సేవలను వినియోగించుకోవాలి. సిబ్బంది క్వార్టర్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన తక్షణం చేపట్టాలి. ఇందుకు ప్రత్యేకంగా వంద ఎకరాలు సేకరించాలి. ఇదే ప్రాంతంలో భవిష్యత్తులో సోలార్ ప్లాంటు సైతం ఏర్పాటు చేయనున్నందున సిబ్బంది ఇంకా పెరుగుతారు.. అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవాలి. స్పోర్ట్స్ కాంప్లెక్స్కు 50 ఎకరాలు కేటాయించాలి. సిబ్బంది కోసం సూపర్మార్కెట్, కమర్షియల్ కాంప్లెక్స్, క్లబ్ హౌస్, హాస్పిటల్, స్కూల్, ఆడిటోరియం, మల్టీప్లెక్స్ నిర్మాణాలను చేపట్టాలి. ప్లాంటు సిబ్బందికి సేవలందించే ప్రైవేట్ సర్వీసు స్టాఫ్కూ క్వార్టర్లు నిర్మించాలి. దామరచర్ల మండల కేంద్రం నుంచి ప్లాంటు వరకు ఏడు కి.మీ.ల మేర నాలుగులైన్ల సీసీ రహదారిని వెంటనే మంజూరు చేయాలని ఆదేశిస్తున్నా. దామరచర్ల(విష్ణుపురం) రైల్వే స్టేషన్ విస్తరణతోపాటు దామరచర్ల-వీర్లపాలెం రహదారిలో ఉన్న రైల్వే క్రాసింగ్ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి అధికారులు రైల్వే శాఖతో సమన్వయం చేసుకోవాలి’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్లాంటు నిర్మాణానికి భూములిచ్చిన రైతులతోపాటు సాగర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలని సీఎస్ సోమేశ్కుమార్, కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డిలను సీఎం ఆదేశించారు. స్థానిక ఎమ్మెల్యే భాస్కర్రావు, ప్రజలు ఇచ్చిన వినతి పత్రాలను పరిష్కరించేలా అక్కడికక్కడే అధికారులకు పలు సూచనలు చేశారు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కోటిరెడ్డి, విప్ సునీత, ఎమ్మెల్యేలు భాస్కర్రావు, సైదిరెడ్డి, శేఖర్రెడ్డి, లింగయ్య, భూపాల్రెడ్డి, కిశోర్కుమార్, ప్రభాకర్రెడ్డి, జీవన్రెడ్డి, రవీంద్రకుమార్, మల్లయ్యయాదవ్, భగత్, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ అనుసంధానత
‘‘కనీసం 30 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బొగ్గు నిల్వలు సహా ఇతర అంశాల్లోనూ అధికారులు ముందుచూపుతో వ్యవహరించి నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి రాజధాని హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాలకు విద్యుత్ కనెక్టివిటీ ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలి. ప్లాంటుకు అవసరమైన నీళ్లను కృష్ణా నది నుంచి తీసుకోవాలి. కృష్ణపట్నం పోర్టు, నార్కట్పల్లి-అద్దంకి రహదారిని దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో ప్లాంటు నిర్మాణానికి ఈ ప్రాంతాన్ని ఎంపిక చేశాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు