నేటి నుంచి హైదరాబాద్ సాహితీ వేడుక
వివిధ సాహితీ, సాంస్కృతిక, ప్రచురణ సంస్థల సహకారంతో హైదరాబాద్ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే సాహితీ వేడుక(లిటరరీ ఫెస్టివల్)కు రంగం సిద్ధమైంది.
ముఖ్యఅతిథిగా జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో
హాజరుకానున్న రచయితలు, కళాకారులు, దర్శకులు
ఈనాడు, హైదరాబాద్: వివిధ సాహితీ, సాంస్కృతిక, ప్రచురణ సంస్థల సహకారంతో హైదరాబాద్ లిటరరీ ట్రస్టు ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగే సాహితీ వేడుక(లిటరరీ ఫెస్టివల్)కు రంగం సిద్ధమైంది. రాష్ట్ర సచివాలయం సమీపంలోని విద్యారణ్య పాఠశాలలో జరిగే ఈ కార్యక్రమంలో అనేకమంది సాహితీవేత్తలు, రచయితలు, కళాకారులు, దర్శకులు, చిత్రకారులు పాల్గొననున్నారు. చర్చాగోష్ఠులు, పలు రకాల ప్రదర్శనలు, వివిధ అంశాలపై అవగాహన పెంచే కార్యక్రమాలెన్నో సమాంతరంగా జరగనున్నాయి. ఆయా రంగాలపై అధ్యయనం చేసిన దేశ, విదేశీ ప్రముఖులు సుమారు 120 మందికిపైగా అతిథులుగా హాజరుకానున్నారు. 27న మధ్యాహ్నం జరిగే ప్రారంభ కార్యక్రమానికి జ్ఞాన్పీఠ్ అవార్డు గ్రహీత దామోదర్ మౌజో ముఖ్య అతిథిగా హాజరుకానుండగా, తెలంగాణ ప్రభుత్వ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ అధ్యక్షత వహిస్తారు. ఈ సందర్భంగా భాష, సాహిత్యం, స్వేచ్ఛ-భిన్నాభిప్రాయాలపై సదస్సు జరగనుంది. అనంతరం జరిగే చర్చాగోష్ఠిలో ప్రముఖ సినీనటి, రచయిత, పెయింటర్ దీప్తినావల్ పాల్గొంటారు. తాజాగా ఆమె రాసిన ‘ఎ కంట్రీ కాల్డ్ చైల్డ్హుడ్-ఎ మెమొయిర్’ పుస్తకంపై చర్చ జరగనుంది. 28న ఉదయం పది గంటలకు జరిగే కార్యక్రమంలో ప్రముఖ పాత్రికేయుడు, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత పాలగుమ్మి సాయినాథ్ పాల్గొంటారు. 1998లో ‘ఎవ్రీబడీ లవ్స్ ఎ గుడ్ డ్రాట్’ పుస్తకాన్ని రాసిన సాయినాథ్, తాజాగా స్వాతంత్య్ర సమరంలో పాల్గొని గుర్తింపునకు నోచుకోని వారి గురించి ‘లాస్ట్ హీరోస్-ఫుట్ సోల్జర్స్ ఆఫ్ ఇండియన్ ఫ్రీడం’ పేరుతో పుస్తకం వెలువరించారు. దీని గురించి చర్చాగోష్ఠి జరగనుంది. ఇటీవలే హైదరాబాద్ గురించి రాసిన మన్రీత్ సోది సోమేశ్వర్ (న్యూయార్క్), చిన్నపిల్లల పుస్తక రచయిత నేహా జైన్ హాజరవుతారు. టైమ్మేనేజ్మెంట్ అంశంపై బ్లేజ్ ఆటోమేషన్ టెక్నికల్ డైరెక్టర్ శారద అక్కినేని, హైదరాబాద్లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రొఫెసర్ రీమా గుప్త, పర్యావరణం-వాతావరణ మార్పులపై యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినాలో పనిచేస్తున్న సిరి నల్లపరాజు తదితరులు మాట్లాడనున్నారు. ప్రపంచబ్యాంకు సీనియర్ ఆర్థిక శాస్త్రవేత్త శరణ్య భట్టాచార్య, శాస్త్ర సాంకేతిక రంగాల్లో మహిళలు అనే అంశంపై పుణెలోని ఐ.ఐ.ఎస్.ఇ.ఆర్లో పనిచేస్తున్న వినీత బాల్ తదితరులు ప్రసంగిస్తారు. బిలియన్ డాలర్ డ్రీమ్స్ అనే అంశంపై బి.వి.ఆర్ మోహన్రెడ్డి మాట్లాడతారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పలువురు చిత్రకారులు తమ ప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు మెలకువలు నేర్పించనున్నారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
10 లక్షల టన్నులు దాటిన ధాన్యం కొనుగోళ్లు
యాసంగి ధాన్యం కొనుగోళ్లు 10 లక్షల టన్నుల మైలురాయిని దాటాయి. ఇందులో 50 శాతానికి పైగా కొనుగోళ్లు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లోనే జరిగాయి. -
ఎండలు బాబోయ్..!
ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణలో నమోదవుతున్నాయి. -
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
ఎనిమిదేళ్ల ఈ చిట్టితల్లికి రాకూడని కష్టం వచ్చింది. అరుదైన క్యాన్సర్ బారినపడి విలవిలలాడుతోంది. తమ బిడ్డను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు అలుపెరగని పోరాటం చేస్తున్నారు. -
మీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం
ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘిచారంటూ మంత్రి కొండా సురేఖకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) హెచ్చరిక జారీ చేసింది. ఇక నుంచి సంయమనంతో వ్యవహరించాలని హెచ్చరిస్తున్నట్లు శుక్రవారం ఆమెకు పంపిన లేఖలో స్పష్టం చేసింది. -
భారత్ బయోటెక్ను సందర్శించిన ఉప రాష్ట్రపతి
మన దేశంలో పరిశోధనారంగంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలని.. తద్వారా అన్ని విభాగాల్లో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టాలని ఉప రాష్ట్రపతి జగ్దీప్ ధన్ఖడ్ సూచించారు. -
శ్రీదేవి ప్రసాద్కు యుధ్వీర్ పురస్కారం
శంకర్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు శ్రీదేవి ప్రసాద్ ప్రతిష్ఠాత్మక యుధ్వీర్ పురస్కారానికి ఎంపికయ్యారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావు
తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులైన జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు అలియాస్ జె.శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
జెనెటిక్స్ సెంటర్లు నిబంధనలు పాటించాలి: కర్ణన్
రాష్ట్రంలో జెనెటిక్స్ సంబంధిత కౌన్సెలింగ్ సెంటర్లు, లేబొరేటరీలు, క్లినిక్లు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ ఆదేశించారు. -
సోలార్ హబ్గా ‘సెస్’
తెలంగాణలోని సిరిసిల్ల విద్యుత్ సహకార సంఘం(సెస్)ను సౌరశక్తి కేంద్రం (సోలార్ హబ్)గా మార్చేందుకు జర్మనీ సంస్థలు ముందుకొచ్చినట్లు తెలంగాణ ప్రభుత్వ మాజీ సలహాదారు, వేములవాడ మాజీ శాసనసభ్యుడు చెన్నమనేని రమేశ్ తెలిపారు. -
పురపాలికల్లో వ్యర్థ జలాల శుద్ధికి మోక్షం!
రాష్ట్రంలో 101 పురపాలక సంఘాల్లోని వ్యర్థ జలాల శుద్ధికి మార్గం సుగమం అయ్యింది. అమృత్ పథకం కింద నిధులు విడుదల చేసేందుకు కేంద్రం అంగీకరించింది. -
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి
తరతరాల వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అన్నారు. -
జనరల్ బోగీల సంఖ్య పెంచాలి
దేశవ్యాప్తంగా ప్రతి రైలులో జనరల్ బోగీల సంఖ్యను ఐదుకు పెంచాలని ‘జనరల్ బోగీల సాధన సమితి’ సభ్యులు డిమాండ్ చేశారు. -
చెరువులో వాసవి నిర్మాణాలపై ఆధారాలివ్వండి: హైకోర్టు
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బాచుపల్లిలోని కోమటికుంట చెరువు ఎఫ్టీఎల్లో వాసవి ఇన్ఫ్రా ఎల్ఎల్పీ నిర్మాణాలు చేపడుతోందనడానికి తగిన ఆధారాలు సమర్పించాలని పిటిషనర్కు హైకోర్టు శుక్రవారం ఆదేశాలు జారీచేసింది. -
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు