అన్నదాతలకు రూ.5కే భోజనం
తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు రూ.5కే భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనుంది.
మార్కెట్ యార్డులు, రైతుబజార్లలో అమలు
రాష్ట్ర ప్రభుత్వ యోచన
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో రైతులకు రూ.5కే భోజన సౌకర్యం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలో ఖరారు చేయనుంది. రాష్ట్రంలో 192 ప్రధాన మార్కెట్ యార్డులు, 87 ఉప యార్డులున్నాయి. వీటన్నింటికీ కలిపి సీజన్ సమయంలో రోజూ 8 వేల నుంచి 10 వేల మంది వస్తుంటారు. మార్కెట్ యార్డుల్లో ప్రస్తుతం భోజన సౌకర్యాలు లేవు. ధాన్యం, ఇతర పంట ఉత్పత్తులను తీసుకొచ్చే రైతులు రోజంతా యార్డులోనే ఉంటారు. ఒక్కోసారి రాత్రిపూట సైతం అక్కడే ఉండాల్సి వస్తుంది. సమీపంలో ఉన్న క్యాంటీన్లు, హోటళ్లకు వెళ్లి భోజనాలు చేస్తారు. అధిక శాతం యార్డుల్లో మంచినీటి వసతి కూడా లేదు. ఈ నేపథ్యంలో రైతులకు రాయితీపై భోజన సౌకర్యం కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్నపూర్ణ పథకం ద్వారా నగరాలు, పట్టణాలు, ఆసుపత్రుల్లో సహాయకుల కోసం రూ.5కి భోజనం అందిస్తున్నారు. ఒక్కో భోజనానికి ప్రభుత్వం రూ.21 రాయితీ చెల్లిస్తోంది. ఈ పథకాన్ని మార్కెట్ యార్డులకూ విస్తరించాలని భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు 10 వేల మంది రైతులకు భోజన సౌకర్యం కల్పించేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా 36 రైతుబజార్లు ఉన్నాయి. వీటికి వేయి మందికి పైగా రైతులు కూరగాయలు తెస్తున్నారు. రైతుబజార్లలోనూ భోజన వసతుల్లేవు. అక్కడా రూ.5కి భోజన సౌకర్యం కల్పించనున్నారు.
దాతలకూ అవకాశం
ప్రభుత్వం తరఫునే కాకుండా.. దాతలు, వ్యాపార సంఘాల వారు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు భోజన వసతి కల్పించేందుకు ముందుకొస్తే వారికీ అవకాశం కల్పించాలని సర్కారు భావిస్తోంది. బోయినపల్లి, సిద్దిపేట, గజ్వేల్, వంటిమామిడి, కేసముద్రం, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ మార్కెట్ యార్డుల్లో దాతలు రాయితీపై భోజనం అందిస్తున్నారు. మిగిలిన యార్డుల్లోనూ దాతలు ఎవరైనా పూర్తి వ్యయం భరించేందుకు ముందుకొస్తే ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలోనూ ఈ పథకాన్ని ప్రారంభించాలని సర్కారు భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!