మూసీ జలాశయం నుంచి నీటి విడుదల
నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో సోమవారం అధికారులు డ్యామ్ మూడో నంబరు క్రస్ట్గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
కేతేపల్లి, న్యూస్టుడే: నల్గొండ జిల్లాలో నాగార్జునసాగర్ తర్వాత రెండో పెద్ద జలాశయంగా ఉన్న మూసీ రిజర్వాయర్ పూర్తిగా నిండడంతో సోమవారం అధికారులు డ్యామ్ మూడో నంబరు క్రస్ట్గేట్ ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. మండు వేసవిలో పూర్తిస్థాయిలో జలాశయం నిండడం రెండున్నర దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమం. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా సోమవారం 644.60 అడుగుల గరిష్ఠ స్థాయికి చేరింది. ఎగువ నుంచి ఇన్ఫ్లో క్రమంగా పెరుగుతుండడంతో అధికారులతో సమీక్ష అనంతరం మంత్రి సూచనల మేరకు ప్రాజెక్టు డీఈఈ చంద్రశేఖర్ డ్యామ్ మూడో నెంబరు క్రస్ట్గేట్ను అరడుగు మేర లేపి నీటిని విడుదల చేశారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా సోమవారం సాయంత్రానికి జలాశయంలో 4.36 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి 300 క్యూసెక్కుల వరదనీరు వస్తుండగా దిగువ మూసీలోకి అంతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల రైతులు, మత్స్యకారులు, అప్రమత్తంగా ఉండాలని నీటిపారుదలశాఖ ఈఈ డి.భద్రు సూచించారు. సూర్యాపేట, పెన్పహాడ్, కేతేపల్లి, వేములపల్లి, మిర్యాలగూడ మండలాల్లో రైతులు తమ పశువులను వదిలిపెట్టొద్దని, మూసీ వాగు వెంట మోటార్లను భద్రపరుచుకోవాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్