రక్తనాళాల్లో సమస్యలను సమతుల ఆహారంతో అడ్డుకుందాం!
వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి.
ఉల్లి, బచ్చలి, ద్రాక్ష, కమలాపళ్లు, చేపలతో ఆరోగ్యం
గుండె పోటు, జబ్బుల నియంత్రణ
తాజా అధ్యయనంలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్
వయసుతో నిమిత్తం లేకుండా గుండెపోటుకు గురై పలువురు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితి తలెత్తడానికి ప్రధాన కారణాల్లో.. రక్తనాళాల్లో (సిరలు, ధమనులు) రక్తం గడ్డకట్టడం ఒకటి అని నిపుణులు చెబుతున్నారు. ఈ ముప్పును తగ్గించడానికి ఎలాంటి ఆహారం దోహదపడుతుంది.. ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి.. వంటి అంశాలన్నీ కీలకం. ఇందుకు సంబంధించి ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐజేఎంఆర్) అధ్యయనాంశాలను వెల్లడించింది. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, చేపలు వంటివి తీసుకోవడం సిరల్లో రక్తం గడ్డకట్టే (థ్రాంబోఎంబోలిజం) ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్-బి, ఫోలేట్ కంటెంట్.. థ్రాంబోసిస్ (బ్లడ్ క్లాట్స్ ఎక్కువ కావడం)ను నివారించడంలో కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ అధికంగా ఉన్న చేపలను తినడం ద్వారా హైపర్ కాగ్లబిలిటీ (థ్రాంబోసిస్ ముప్పు పెరగడం)ని తగ్గిస్తుంది. పచ్చిమిరప, పలు కూరగాయల్లో ఉండే కొన్ని పోషక మూలకాలు ఫైబ్రినోలిసిస్ (బ్లడ్ క్లాట్స్ను నివారించేందుకు శరీరం సహజంగా చేసుకునే ప్రక్రియ)ను మెరుగుపరుస్తాయి. ప్లేట్లెట్ల అగ్రిగేషన్ (ఒకేచోట చేరిపోవడం)నూ తగ్గిస్తాయని వెల్లడైంది.
- కూరగాయలు, చేపలు, తృణధాన్యాలను క్రమం తప్పకుండా తీసుకునే వ్యక్తులను.. తీసుకోనివారిని పోలిస్తే సిరల్లో రక్తం గడ్డకట్టే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. ప్లేట్లెట్లు ఒకేచోట పోగుపడకుండా చేసే పోషకాలు ఉల్లిపాయలు, హాట్పెపర్, బచ్చలికూర, టమాటా, కమలాపళ్లు, ద్రాక్ష, నిమ్మలో అధికంగా ఉంటాయి. వెల్లుల్లి సీరమ్ కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. ఈ మేరకు సమతుల ఆహారం తీసుకోవడం కీలకమని పరిశోధకులు చెబుతున్నారు. ద్రాక్ష, సోయా, కోకా గుండెజబ్బులును తగ్గిస్తాయని పేర్కొన్నారు. సిరల థ్రాంబోఎంబోలిజం ప్రధానంగా ఆర్థోపెడిక్ సర్జరీలు చేయించుకున్న వారిలో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
ఎవరికి ముప్పు ఎక్కువ?
ఒకే పొజిషన్లో ఎక్కువసేపు ఉండటంవల్ల వచ్చే అవకాశం ఉంటుంది. అనారోగ్యంతో బెడ్కే పరిమితం కావడం, ఎక్కువసేపు నిల్చుని లేదా కూర్చునేవారిలో, వృద్ధులు, స్థూలకాయుల్లోనూ డీవీటీకి అవకాశం ఎక్కువ.
గుర్తించడం ఎలా? ప్రమాదం ఏమిటి?
కాళ్లు వాపులు వచ్చి ఎర్రబడిపోవడం, నరాలు కొంచెం ఉబ్బినట్లుగా వెడల్పుగా ఉన్నట్లు అనిపిస్తుంటాయి. అప్పుడు వెంటనే దీనిపై దృష్టి సారించాలి. ఎక్కడైనా క్లాట్ వచ్చినపుడు అది అకస్మాత్తుగా గుండెకు లేదా ఊపిరితిత్తులకు రక్తం సరఫరా చేసే రక్తనాళాల్లోకి వెళ్లి చేరే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో శ్వాస ఆడకపోవడం, గుండెపోటు సమస్యలు వస్తాయి. కాళ్లలో వచ్చిన వాళ్లకు ఇది చాలాకాలంగా ఉండి అల్సర్లు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
సాధారణంగా పెద్దవయసులో వారికి ఆర్థోపెడిక్ సహా పలు శస్త్రచికిత్సలు జరుగుతుంటాయి. అలాంటి సమయాల్లో ఎక్కువ రోజులు బెడ్ మీద ఉండాల్సి రావడంతో నాళాల్లో రక్తం సరఫరా మందగిస్తుంది. అందుకే ఇప్పుడు శస్త్రచికిత్స తర్వాత నడిపిస్తున్నారు. సర్జరీలు అయిన తర్వాత సాధ్యమైనంత త్వరగా నడక మొదలు పెట్టించాలి. డీవీటీ వచ్చే అవకాశం ఉన్నవాళ్లను గుర్తించి ముందుగానే వారికి బ్లడ్థిన్నర్స్ ఇవ్వడం ప్రారంభిస్తారు. కొందరు క్యాన్సర్ వ్యాధిగ్రస్థుల్లోనూ ఇవి ఎక్కువ ఉంటాయి. ఇన్ఫెక్షన్కు గురై.. రోగ నిరోధకశక్తి తక్కువగా ఉండి వ్యాధులతో బాధపడేవారిలోనూ.. గర్భనిరోధక మాత్రలు వాడేవారి కొందరిలోనూ.. వీటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. గర్భిణుల్లో కూడా సాధారణంగా ఉంటుంది. పశ్చిమదేశాల్లో ఇది బాగా ఎక్కువగా ఉంటుంది. మన వద్ద 15-20 శాతం వరకు ఉంటుందని అంచనా.
శాస్త్రీయంగా గుర్తించే విధానం
సాధారణంగా అల్ట్రాసౌండ్ కలర్ డాప్లర్ చేసి రక్తనాళ్లాలో సరఫరా ఎలా ఉంది గుర్తించి తెలుసుకోవచ్చు. కోవిడ్ సమయంలో ఎక్కువగా చేసిన డీడైమర్ టెస్ట్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. సీటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా కూడా గుర్తించవచ్చు.
- మధుమేహం, గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్, మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు జాగ్రత్తపడాలి. రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం కరిగిపోవడానికి ఇంజక్షన్లు ఇస్తారు. గతంలోలా కాకుండా ఇప్పుడు పర్యవేక్షణ సులువైంది. కొత్తగా మందులు అందుబాటులో ఉన్నాయి.
రాకుండా చూసుకోవడం ముఖ్యం..
ప్రధానంగా ఊబకాయం ఉన్నవాళ్లు బరువు తగ్గించుకోవాలి. ఎక్కువ సమయం కూర్చోవడం లేదంటే ఎక్కువ సేపు నిలబడి ఉండకూడదు. పొజిషన్లు మారుస్తూ ఉండాలి. ఒకవేళ ఎక్కువసేపు కూర్చుని పనిచేసే ఉద్యోగాలు చేసేవాళ్లు మధ్యమధ్యలో లేచి నడవడం అవసరం. డాక్టర్లలో కూడా కొంతమంది సర్జన్లు ఎక్కువసేపు నిలబడి సర్జరీలు చేస్తుంటారు.. వాళ్లలో కూడా ఇది వచ్చే అవకాశం ఉంటుంది. పొగతాగే అలవాటున్నవారు దాన్నుంచి బయటపడాలి. ఆర్థోపెడిక్ సర్జరీలు చేసుకున్న వారిని రెండు మూడు రోజులకే నడిపించడం లేదా బెడ్లోనే అటూ ఇటూ కదిలించడం చేయాలి.
- గర్భిణులను జాగ్రత్తగా పరిశీలిస్తుండాలి. ప్రయాణాల్లో ఎక్కువసేపు ఉండేవాళ్లు, క్రమం తప్పకుండా 16-20 గంటలు ప్రయాణం చేసేవాళ్లు స్టాకింగ్స్ తప్పనిసరిగా వేసుకోవాలి.
- ఆహారంలో ఆలివ్ ఆయిల్ వినియోగించడం చాలా ప్రయోజనకరం. ఇందులో ఉండే ఫినాల్ అనే మూలకం ప్లేట్లెట్లు ఒకేచోట జమ కావడాన్ని తగ్గిస్తుంది. ఒక మోతాదులో ఆకుకూరలు తీసుకోవచ్చు. రోగం నిర్ధారణ అయి.. వైద్యం చేయించుకుంటున్నవారు జంక్ఫుడ్లు, ప్యాకేజ్డ్ఫుడ్లు వంటివాటికి దూరంగా ఉండాలి’’
డీవీటీ ముప్పు తప్పాలంటే..!
- డాక్టర్ రాకేష్ కలపాల
ఒక్కోసారి ప్రాణాంతకంగా పరిణమించే ‘డీవీటీ’ ముప్పు బారినపడకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా కీలకమని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాకేష్ కలపాల తెలిపారు. ఆయన సూచించిన కీలకాంశాలు ఆయన మాటల్లోనే..
‘‘సిరల్లో రక్తం గడ్డకట్టడం సిరల థ్రాంబోఎంబోలిజం. ఇది డీప్ వెయిన్ థ్రాంబోసిస్ (డీవీటీ)కి దారితీస్తుంది. ఈ డీవీటీ పల్మనరీ ఎంబోలిజం, ధమనుల్లో రక్తం గడ్డకట్టే ముప్పును పెంచుతుంది. ధమనుల్లో రక్తం గడ్డకట్టడం ద్వారా గుండెపోటు ముప్పు పెరుగుతుంది. డీవీటీ అంటే లోపల ఉన్న సిరల్లో రక్తం గడ్డకట్టం. ఇది నడుము కింద, కాళ్లలోనూ.. నడుముపైనా రావొచ్చు. శరీరం పైభాగంలో ప్రధాన సిరలకు వస్తే ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఊపిరితిత్తులు, గుండెకు రక్తం సరఫరా చేసే నాళాల్లో గడ్డ కట్టకూడదు (క్లాట్ రాకూడదు). శరీరం కింది భాగంలో.. కాళ్లలో వచ్చేవాటి ద్వారా ముప్పు తక్కువ ఉంటుంది. పాదాలు, కాళ్లలో వస్తే డిస్టల్్ డీవీటీ అని.. నడుం పైనవస్తే ప్రాక్సిమల్ డీవీటీ అని అంటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ