వ్యాయామమే ‘వెన్ను’దన్ను
జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల గురించి ఎక్కువ ఆందోళన చెందుతుంటాం. వాస్తవంగా అత్యధికులు వెన్నునొప్పితో సతమతమవుతున్నారు.
శారీరక శ్రమ తగ్గడంతో పెరుగుతున్న వెన్నెముక నొప్పులు
20 నుంచి 40 ఏళ్ల వారికి అధిక సమస్యలు
జీవనశైలి, పని ప్రదేశాల్లో మార్పులే పరిష్కారం
ఈనాడు, హైదరాబాద్: జీవనశైలి వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల గురించి ఎక్కువ ఆందోళన చెందుతుంటాం. వాస్తవంగా అత్యధికులు వెన్నునొప్పితో సతమతమవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. తాజాగా నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్లో ప్రచురితమైన ‘బ్యాక్ పెయిన్’ కథనం వెన్ను సమస్యకు సంబంధించి పలు ఆందోళనకర అంశాలను వెల్లడించింది. మారిన జీవనశైలి, ఆధునిక వసతులు, రవాణా సౌకర్యాలు, ఎక్కువ సమయం డెస్క్ల వద్ద కూర్చుని పనిచేస్తున్న కారణంగా వెన్నెముక కోణంలో మార్పులు వస్తున్నాయని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వెన్నునొప్పి నివారణ, నిర్వహణకు లక్షల కోట్ల ఖర్చు అవుతోందని తెలిపింది. కూర్చున్నప్పుడు, నిల్చున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు సరైన భంగిమలపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ నేపథ్యంలో వెన్నునొప్పి వచ్చే ముందు ఉండే లక్షణాలేమిటి? తద్వారా ఎదురవుతున్న ఇబ్బందులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రముఖ స్పైన్ సర్జన్, డైరెక్టర్ అండ్ చీఫ్ స్పైన్ సర్జరీ ఉదయ్ ఓమ్నీ హాస్పిటల్స్, అపోలో హెల్త్ సిటీ డాక్టర్ రాఘవదత్ ములుకుట్ల వివరించారు.
జీవితంపై వెన్నునొప్పి ప్రభావం అధికం
వెన్ను, మెడ, వీపు బాగంలో వచ్చే నొప్పులను వెన్ను సమస్యలుగా గుర్తించాలి. ప్రతి మనిషి జీవితంలో 20 నుంచి 40 ఏళ్ల వయసు అత్యంత కీలకమైంది. ఈ వయసు వారిలోనే వెన్ను సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఇవి వారి ఆరోగ్యంపై, పనితీరుపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయి. నొప్పి కారణంగా మనిషిలో చికాకు పెరిగిపోతుంది. ఒక్కోసారి వెన్ను, మెడ, నడుం నుంచి విపరీతమైన నొప్పి కాళ్లు, చేతుల్లోకి వ్యాపించి పనిచేయలేని పరిస్థితి వస్తుంది. ఇలాంటప్పుడు ప్రయాణాలపై ఆధారపడే మార్కెటింగ్ వృత్తుల్లోని వారు, ఆహార, నిత్యావసర సరకుల రవాణాదారులతోపాటు ఎగ్జిక్యూటివ్లు అల్లాడతారు. రోడ్లు సరిగా లేకపోవడం, అధిక స్పీడ్ బ్రేకర్లు, గతుకులు, గుంతల సమస్య తీవ్రతను మరింత పెంచుతుంది. మానసికంగానూ కుంగిపోతారు.
కాలుష్యం, పొగతాగడం వెన్ను ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి
పొగతాగే అలవాటు వెన్ను ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కొందరు స్పైన్సర్జన్లు బాగా పొగతాగేవారికి సర్జరీలు చేయడానికి నిరాకరిస్తారు. ఎందుకంటే ఇలాంటి వారికి ఆపరేషన్ చేసినా మెరుగైన ఫలితాలు ఉండవు. పొగతాగితే డిస్క్ న్యూట్రిషన్ దెబ్బతిని, అరుగుదల ఎక్కువగా ఉంటుంది. వాతావరణ కాలుష్యం కూడా ఇలాంటి ప్రభావాన్నే కలిగిస్తుంది.
ఏ క్యాన్సర్ అయినా మొదట చేరేది వెన్నుకే
వెన్నెముకలో ఇన్ఫెక్షన్లు ఇటీవల బాగా పెరిగాయి. రొమ్ము, ఊపిరితిత్తుల వంటి అవయవాలకు సోకే క్యాన్సర్లు సాధారణంగా మొట్టమొదట వెన్నెముకకే చేరుతాయి. వాటిని ఎంఆర్ఐ, ఎక్స్రేలతో గుర్తించగలుగుతున్నాం. కణుతులు, వంకర్లు, గూని వంటి వాటికి సమర్థంగా చికిత్స చేయగలుగుతున్నాం. ప్రపంచవ్యాప్తంగానూ వైద్యరంగంలో వెన్నెముక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కొనసాగుతోంది. జీ-20లోని భాగస్వామ్య దేశాల స్పైన్ సర్జన్లు నాలుగేళ్లుగా వెన్నెముక ఆరోగ్యంపై ప్రజలను జాగృతం చేస్తున్నారు. పేద దేశాల వైద్యులకూ అవగాహన పెంచుతున్నారు.
పని ప్రదేశంలో స్టాండింగ్ డెస్క్ తప్పనిసరి
ఉద్యోగులు పనిచేసే చోట కీలక మార్పులు అవసరం. ఉదాహరణకు ప్రతి ఆఫీసులో స్టాండింగ్ డెస్క్ పెట్టాలి. ఐటీ కంపెనీల్లో ఇలాంటి డెస్క్లు ఉంటే నిల్చునే పనిచేస్తారు. కూర్చుని, నిల్చుని పనిచేస్తుంటే మన శరీరాకృతి సక్రమంగా ఉంటుంది. అందరికీ నిటారుగా ఉండాలని పదేపదే చెబుతుంటాం. కానీ, అన్నివేళల్లో అలా ఉండటం అసాధ్యం. ఖరీదైన కుర్చీలు కొంటున్నా వాటిపై కూర్చున్న వారు ముందుకు వంగడమన్నది సహజం. అలాగే... వర్క్ఫ్రం హోం అయినా ఆఫీసులో ఉన్నా, ప్రతి ఇరవై నిమిషాలకు ఒకసారి లేచి చిన్నపాటి స్ట్రెచ్లు చేస్తుండాలి. సోఫాలకు దూరంగా ఉండాలి. ఆన్లైన్ సమావేశాలు, కార్పొరేట్ రంగంలో గంటల తరబడి జరిగే సమావేశాల మధ్యలో నిల్చుని మాట్లాడాలి. క్రికెట్ మ్యాచ్లు, సినిమాలు చూస్తున్నా ఇలాగే చేయాలి. ఆఫీసుల్లో యోగా హాళ్ల లాంటివి ఉండాలి.
చురుకుగా ఉండటమే పరిష్కారం
ఎక్కువసేపు కూర్చుంటే శారీరక శ్రమ తగ్గి కండరాలు బలహీనం అవుతాయి. వెన్నుపూసలపై ఒత్తిడి పెరిగి, అవి తొందరగా అరిగిపోతుంటాయి. నిద్ర మినహా మిగతా సమయంలో శారీరకంగా చురుగ్గా ఉండాలి. రోజులో కనీసం గంటన్నరసేపు తీవ్రంగా వ్యాయామం చేయాలి. నడకకు, మెట్లు ఎక్కడానికి, దిగడానికి, కింద కూర్చోవడానికి ప్రాధాన్యమివ్వాలి. పరుగెత్తడం, సైక్లింగ్ వంటివి చేయాలి. మొబైల్ ఫోన్ చూడటం తగ్గించాలి. బెడ్రూంలో టీవీ పెట్టుకోకూడదు. హార్మోన్ల సమస్యతో మహిళల్లో నడుంనొప్పులు ఎక్కువ. గృహిణులు ఇంటిపనినే వ్యాయామంగా భావిస్తారు. అది సరికాదు. ఉదయం లేదా సాయంత్రం గంటసేపు నడవాలి. యోగాకు ప్రాధాన్యమివ్వాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.
పిల్లలను మైదానాలకు పంపించండి
మనం కూర్చునే విధానం వెన్నెముక ఆకృతిపై ప్రభావం చూపుతుంది. ఆకృతి మారుతుందంటే.. వెన్ను సమస్యలు ముంచుకొస్తాయని అర్థం. ముఖ్యంగా పిల్లలు, విద్యార్థులపై చదువుల ఒత్తిడి అధికంగా ఉంటోంది. వారు చాలాసార్లు పది, అంతకంటే ఎక్కువ గంటలపాటు చదువుతుండటంతో వారి వెన్నెముకల్లో మార్పులు వస్తున్నాయి. మైదానాల్లో ఆటలకు దూరం కావడంతో శారీరక శ్రమ తగ్గిపోయింది. సుదీర్ఘ సమయం వంగి రాస్తుండటంతో వెన్నెముకను నియంత్రించే కండరాలు బలహీనమవుతున్నాయి. పిల్లల నడుం వంకర అవుతోంది. చిన్నారులను మైదానాలకు పంపించి, శారీరక శ్రమ పెరిగేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ఈత చాలామంచి వ్యాయామం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు