Tamilisai Soundararajan: అదే దూరం.. అవే విభేదాలు
రాజ్భవన్, ప్రగతిభవన్ల మధ్య అంతరం ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు బిల్లుల పెండింగుతో పాటు తాజాగా నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనను తిరస్కరించడం.. రెండిటి మధ్య మళ్లీ వివాదానికి కారణమవుతోంది.
ఇప్పటికే రాజ్భవన్లో బిల్లుల పెండింగు
ఈనాడు, హైదరాబాద్: రాజ్భవన్, ప్రగతిభవన్ల మధ్య అంతరం ఇంకా కొనసాగుతూనే ఉంది. పలు బిల్లుల పెండింగుతో పాటు తాజాగా నామినేటెడ్ కోటాలో ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనను తిరస్కరించడం.. రెండిటి మధ్య మళ్లీ వివాదానికి కారణమవుతోంది. గతంలో నామినేటెడ్ కోటాలో కౌశిక్రెడ్డిని తిరస్కరించిన గవర్నర్.. తాజాగా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్ల పేర్లతో ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను ఆమోదించకపోవడం చర్చనీయాంశమవుతోంది. 2019 సెప్టెంబరు 8న గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేసిన తమిళిసై(Tamilisai Soundararajan) నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వంతో పలుసార్లు విభేదించారు. కౌశిక్రెడ్డి ఎమ్మెల్సీ సీటు దగ్గర మొదలైన వివాదం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ప్రొటోకాల్ పరమైన అంశాలకు తోడు అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు, రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలకు మొదట్లో ఆహ్వానించకపోవడం వంటి వాటిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్ర శాసనసభ, మండలి ఏకగ్రీవ ఆమోదం అనంతరం ప్రభుత్వం నుంచి వచ్చిన అధికశాతం బిల్లులను పెండింగులో పెట్టారు. కొన్నింటిని తిరస్కరించగా.. మరికొన్ని తిప్పిపంపారు. ఇంకొన్ని రాష్ట్రపతికి పంపారు. విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీతో పాటు.. కీలకమైన బిల్లులు కావడంతో.. ఇటీవల శాసనసభలో రెండో దఫా తీర్మానం చేసి పంపినవి సైతం పెండింగులోనే ఉన్నాయి.
ఆర్టీసీ బిల్లుకే ఆమోదం
కీలకమైన ఆర్టీసీ బిల్లును గవర్నర్ కొన్ని రోజులు పెండింగులో పెట్టడంతో కార్మికులు ఆందోళనకు దిగి.. రాజ్భవన్ ముట్టడికి యత్నించారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఈ బిల్లును ఆమోదించారు. విభేదాలు, వివాదాల నేపథ్యంలో మంత్రిగా పట్నం మహేందర్రెడ్డి ప్రమాణస్వీకారం రోజున సీఎం రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమై రాష్ట్ర సచివాలయంలో దేవాలయం, మసీదు, చర్చిల ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. గవర్నర్, సీఎం కేసీఆర్ల సమక్షంలోనే ప్రార్థనామందిరాల ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాత సీఎం స్వయంగా గవర్నర్ను తీసుకొని వెళ్లి సచివాలయాన్ని చూపించారు. దీంతో ప్రగతిభవన్, రాజ్భవన్ చేరువయ్యాయనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ, తాజాగా మంత్రిమండలి సిఫార్సు చేసిన అభ్యర్థిత్వాలను తిరస్కరించడంతో సయోధ్య ప్రశ్నార్థకంగా మారింది.
నామినేటెడ్ ఎమ్మెల్సీ పోస్టులకు గండం
గతంలో కౌశిక్రెడ్డిని నామినేటెడ్ ఎమ్మెల్సీగా ప్రభుత్వం ప్రతిపాదించగా.. 171(5) అధికరణ కింద ఆయన సేవాకార్యక్రమాలు ఎక్కడా నిర్వహించలేదనే కారణంతో గవర్నర్ తిరస్కరించారు. దీంతో ప్రభుత్వం ఆయన పేరును వెనక్కి తీసుకొని.. మాజీ సభాపతి మధుసూదనాచారి పేరును ప్రతిపాదించగా.. కొన్ని రోజుల పరిశీలన అనంతరం గవర్నర్ ఆమోదం తెలిపారు. తాజాగా నామినేటెడ్ కోటాలోని రెండు ఖాళీలను ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు ఎందిన కుర్రా సత్యనారాయణ, దాసోజు శ్రవణ్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని మంత్రిమండలి ఆమోదించి.. గవర్నర్కు పంపగా.. వీరిద్దరి పేర్లను తిరస్కరించడంతో మళ్లీ ఎంపిక వ్యవహారం మొదటికి వచ్చింది.
ముఖ్య నేతలతో సీఎం సమావేశం
రాజ్భవన్ నుంచి సమాచారం అందిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంలో పార్టీ నేతలతో సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. నామినేటెడ్ ఎమ్మెల్సీల ఎంపిక అంశంపై చర్చించారు. గతంలో కౌశిక్రెడ్డి పేరును తిరస్కరించిన తర్వాత రెండోసారి ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్కు పంపలేదు. ఆయనకు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే తాజాగా ఇద్దరు అభ్యర్థులు కీలకమైన ఎస్టీ, బీసీ సామాజికవర్గాల వారు కావడంతో.. వారిని మార్చకూడదనే అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలిసింది. ఎన్నికల కోడ్ కంటే ముందే మరోసారి మంత్రిమండలి సమావేశం నిర్వహించి, రెండోసారి వీరి పేర్లను పంపాలని.., గవర్నర్ నిర్దేశించిన నిబంధనల పరిధికి సంబంధించి సమాచారం ఇవ్వాలనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నాంపల్లి నియోజకవర్గంలోని బోయిగూడ కమాన్ ప్రాంతానికి చెందిన దివ్యాంగురాలైన రజినికి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఆహ్వానం పంపారు. -
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయన వియ్యంకుడి ఊరైన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో సందడి నెలకొంది. -
దారి దాటేలోగా... దారుణమే జరిగింది!
ప్రసవవేదన పడుతున్న నిండు గర్భిణిని ఆసుపత్రికి తరలించే దారి సక్రమంగా లేక... సకాలంలో వైద్యం అందక ఓ పసిబిడ్డ పుట్టీపుట్టగానే కన్నుమూసింది. -
Hyderabad: మాజీ మంత్రి కార్యాలయంలోని ఫర్నిచర్ తరలింపు!
మంత్రుల పేషీల నుంచి చిన్న కాగితం కూడా బయటకు వెళ్లడానికి వీలులేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలిచ్చిన 24 గంటలలోపే రవీంద్రభారతి ప్రాంగణంలో బుధవారం మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేషీ నుంచి ఫర్నిచర్ తరలిస్తున్న వైనం వెలుగుచూసింది. -
బలహీనపడిన తుపాను
మిగ్జాం తీవ్ర తుపాను తీరం దాటాక.. కోస్తాను కుదిపేసింది. ప్రకాశం జిల్లా నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లా వరకు భారీ, అతి భారీ వర్షాలతో ముంచెత్తింది. -
Revanth Reddy: ఆరు గ్యారంటీలతో ఆరంభం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరేందుకు సర్వం సిద్ధమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్రెడ్డి గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్లోని లాల్బహదూర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
Congress: పాక్షిక మంత్రివర్గమేనా?
రేవంత్రెడ్డితో పాటు గురువారం మధ్యాహ్నం మంత్రులుగా ఎంతమంది ప్రమాణ స్వీకారం చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది. బుధవారం దిల్లీలో ఏఐసీసీ నాయకులతో సమావేశమైన రేవంత్రెడ్డి.. మంత్రివర్గం గురించి కూడా చర్చించినట్లు సమాచారం. -
4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో మిగ్జాం తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. -
గ్యారంటీలకు ఏటా రూ.70 వేల కోట్లు!
ఎన్నికల హామీగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని అంచనా. -
ప్రమాణ స్వీకారానికి రండి..
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని పీసీసీ అధ్యక్షుడు, కాబోయే సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రజలకు బుధవారం బహిరంగ లేఖ రాశారు. -
ఉత్తమ పనితీరు కళాశాలలకు.. బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి
ఇక ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు సైతం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు. -
ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు
దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్ర తెలిపారు. -
పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం కావాలి
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం కావాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది. -
గ్రూప్-1 చిక్కుముడి వీడేదెలా?
రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగ ప్రకటనపై కొత్త ప్రభుత్వ నిర్ణయం కీలకం కానుంది. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని...2024 ఫిబ్రవరి 1న తొలి ఉద్యోగ ప్రకటనగా గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొంది. -
అప్పుడు ఎంత ఇబ్బంది పడ్డారో తెలుస్తోంది
రాష్ట్రంలో నియంతపాలన నుంచి బయట పడ్డామని పేర్కొంటూ సచివాలయ ఉద్యోగులు సంబరాలు చేసుకున్నారు. -
Revanth Reddy: రేవంత్ ఇంటికి నిరంతర విద్యుత్తు
తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా గురువారం రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్న నేపథ్యంలో ఆయన ఇల్లు, కార్యాలయం, ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో విద్యుత్తు సరఫరా తదితర అంశాలపై విద్యుత్తుశాఖ సమీక్షించింది. -
కొత్త ప్రభుత్వానికి అండగా ఉంటాం
తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి రాష్ట్ర ఉద్యోగుల సంఘం అభినందనలు తెలపింది. -
ఎస్సై ఉద్యోగాల తుది రాత పరీక్ష ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఎస్సై ఉద్యోగాలకు సంబంధించిన తుది రాత పరీక్ష ఫలితాలను పోలీసు నియామక మండలి ఎట్టకేలకు విడుదల చేసింది. -
ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్తకు ఐజీయూ పురస్కారం
జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ) సీనియర్ ప్రిన్సిపల్ శాస్త్రవేత్త డాక్టర్ లబానీ రే ను ప్రతిష్ఠాత్మక ఇండియన్ జియోఫిజికల్ యూనిట్(ఐజీయూ)-అన్ని తల్వానీ స్మారక పురస్కారం వరించింది. -
వివేకా హత్య కేసులో అభియోగాల నమోదుపై 20న విచారణ
మాజీ మంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులపై అభియోగాల నమోదు నిమిత్తం సీబీఐ కోర్టు.. విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. -
జనవరిలో రాష్ట్రానికి ఈసీ బృందం
లోక్సభ ఎన్నికల ఏర్పాట్ల వ్యూహరచన కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన అధికారుల బృందం వచ్చే జనవరి మొదటి వారంలో రాష్ట్రానికి రానుంది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. కాసేపట్లో నగరానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం
-
రేషన్కార్డుల జారీపై ఆశలు.. మళ్లీ దరఖాస్తు చేస్తున్న పేదలు
-
Bhimavaram: భీమవరంలో రేవంత్ వియ్యంకుడి ఇంట సందడి
-
ధవళేశ్వరం యువతికి ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు