ఎవరి ధీమా వారిదే!
ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. నవంబరు 30న పోలింగ్ జరగనుండటంతో రానున్న యాభై రోజులు వాటికి కీలకం కానున్నాయి.
ఎన్నికల బరిలోకి ప్రధాన పార్టీలు
రానున్న 50 రోజులు అత్యంత కీలకం
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల నగారా మోగడంతో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమవుతున్నాయి. నవంబరు 30న పోలింగ్ జరగనుండటంతో రానున్న యాభై రోజులు వాటికి కీలకం కానున్నాయి. చాలా ముందుగానే అభ్యర్థులను ప్రకటించిన భారాస ప్రచారంలో ముందుండగా... కాంగ్రెస్, భాజపాలూ జోరు పెంచాయి. గత తొమ్మిదేళ్లలో చేసిన అభివృద్ధితోపాటు పెండింగ్లో ఉన్న వివిధ అంశాలను పరిష్కరించిన భారాస హ్యాట్రిక్ గ్యారంటీ అన్న ధీమాను వ్యక్తంచేస్తోంది. ఇటీవల ప్రకటించిన ఆరు గ్యారంటీలతో ప్రజలకు తమపై నమ్మకం పెరిగిందని, ఓటర్లు ఆశీర్వదిస్తారని కాంగ్రెస్ స్పష్టంచేస్తోంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొంత స్తబ్దుగా ఉన్న భాజపా ఇటీవల మళ్లీ జోరు పెంచింది. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన పసుపు బోర్డుతోపాటు తెలంగాణ ప్రభుత్వం కోరినట్లుగా కృష్ణా జలాల పంపిణీ పునఃసమీక్షకు నిర్ణయం తీసుకుంది. దాంతో పరిస్థితి తమకు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటోంది.
సభలు, శంకుస్థాపనలతో భారాస జోరు
ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సీఎం కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేలలో ఆరుగురికి మినహా మిగిలిన అందరికీ టికెట్లు ఇచ్చారు. రకరకాల కార్యక్రమాల పేరుతో అభ్యర్థులను పూర్తిస్థాయిలో ప్రచారంలోకి దింపడంతోపాటు, పలుచోట్ల నాయకుల్లో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నం చేశారు. నాలుగైదు చోట్ల తప్ప మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి సమస్యలు లేవని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు మంత్రులు కేటీఆర్, హరీశ్రావులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో వీరిద్దరూ సుడిగాలి పర్యటనలు చేసి బహిరంగసభలు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రచారంలోనూ, అన్నివర్గాలు తమకు మద్దతు ఇచ్చేలా చూసుకోవడానికి అవసరమైన చర్యల్లో భారాస ముందుంది. షెడ్యూలు రాకముందే ఒక విడత ప్రచారాన్ని పూర్తి చేసింది. అభ్యర్థులంతా నెలరోజులుగా పూర్తిగా నియోజకవర్గాల్లోనే తిరుగుతున్నారు. మరోవైపు కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఆయా కార్యక్రమాలకు దూరంగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... షెడ్యూలు వచ్చిన నేపథ్యంలో ఈ నెల 15 నుంచి వరుసగా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ ఆశలు
కర్ణాటక ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్లో ఉత్సాహం నెలకొంది. మూడు నెలలుగా దూకుడుగా ఉంటూ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. తొమ్మిదేళ్లపాటు అధికారంలో ఉన్న భారాసపై ప్రజల్లో అసంతృప్తి ఉందని, అది తమకు ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. హైదరాబాద్లో సీడబ్ల్యూసీ సమావేశాలను నిర్వహించింది. అదే సమయంలో నిర్వహించిన భారీ బహిరంగసభలో సోనియాగాంధీతో ఆరు గ్యారంటీలను ప్రకటింపజేసింది. రైతులు, మహిళలు, కార్మికులు, యువత, విద్యార్థులు ఇలా వివిధ వర్గాలకు ప్రయోజనం కలిగించేలా ఉన్న ఈ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని నిర్ణయించింది. అగ్ర నాయకులంతా టికెట్ల ఖరారు ప్రక్రియలో నిమగ్నం కావడంతో అనుకున్నట్లుగా ప్రచారం జరగడంలేదన్న అభిప్రాయముంది. షెడ్యూలుకు ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలనుకొన్నా ఆ కసరత్తు ఇంకా కొలిక్కి రాలేదు. పలు నియోజకవర్గాల్లో ఇప్పటివరకు ప్రచారం చేసుకొన్నవారు కాకుండా... కొత్త అభ్యర్థుల పేర్లు తెరపైకి వస్తున్నాయి. టికెట్ల కేటాయింపు తేలక పలుచోట్ల ఇంకా ప్రచారమే మొదలవలేదు. అయితే గతంలో 60-70 చోట్ల మాత్రమే బలమైన అభ్యర్థులుండేవారని, ఇతర పార్టీల నుంచి బలమైన నాయకులు చేరుతుండటంతో ప్రస్తుతం 90కి పైగా నియోజకవర్గాల్లో గట్టిపోటీ ఇచ్చే పరిస్థితి వచ్చిందని, అధికార పార్టీపైన ప్రజల్లో ఉన్న అసంతృప్తి తమకు లాభిస్తుందన్న ధీమాను కాంగ్రెస్ నాయకులు వ్యక్తంచేస్తున్నారు.
ప్రధాని సభలతో వేగం పెంచిన భాజపా
కర్ణాటక ఎన్నికలు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు తర్వాత భాజపాలో కొంత స్తబ్దత నెలకొన్నా నెలరోజులుగా వేగం పెరిగింది. మహబూబ్నగర్, నిజామాబాద్లలో ప్రధాని మోదీతో బహిరంగసభలు నిర్వహించింది. వెంటనే రాష్ట్రస్థాయి సమావేశానికి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా హాజరై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. అంతకుముందు కూడా భాజపా పాలిత రాష్ట్రాల్లోని 119 మంది ఎమ్మెల్యేలను తెలంగాణలోని ప్రతి నియోజకవర్గంలో పర్యటింపజేసి, పార్టీ పరిస్థితిపై నివేదికలు తెప్పించారు. అదేసమయంలో కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి కొన్ని రోజులుగా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. హోంమంత్రి అమిత్షా సైతం మంగళవారం ఆదిలాబాద్లో జరిగే బహిరంగ సభలోనూ, హైదరాబాద్లో మేధావులతో జరిగే సమావేశంలోనూ పాల్గొంటారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలంగాణలో రూ.9 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, అనేక పథకాలు ప్రారంభించిందని గట్టిగా ప్రచారం చేస్తున్నారు.
2018లో భారాసకు 47% ఓట్లు
గత అసెంబ్లీ ఎన్నికల్లో 47% ఓట్లతో 88 స్థానాలను గెలుచుకొని భారాస ఘన విజయం సాధించింది. 28% ఓట్లతో కాంగ్రెస్ 19 స్థానాలను, 7% ఓట్లతో భాజపా ఒకచోట, 4% ఓట్లతో తెదేపా రెండుచోట్ల, 3% ఓట్లతో ఎంఐఎం ఏడు స్థానాల్లో గెలుపొందాయి. అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి 12 మంది భారాసలో చేరగా, ఒకరు రాజీనామా చేసి భాజపాలో చేరి, ఉప ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఉత్తమ్కుమార్రెడ్డి ఎంపీగా గెలిచాక ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో ఆ స్థానంలోనూ భారాసనే గెలిచింది. ఇండిపెండెంట్లుగా గెలిచిన ఇద్దరితోపాటు తెలుగుదేశం నుంచి గెలిచిన ఇద్దరు కూడా అధికార పార్టీలో చేరారు. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భాజపా గెలుపొందింది. ప్రస్తుతం అసెంబ్లీలో అధికార భారాసకు 104 మంది ఎమ్మెల్యేలు, ఎంఐఎంకు ఏడుగురు, కాంగ్రెస్కు ఐదుగురు, భాజపాకు ముగ్గురు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
హడలెత్తించిన హఠాత్తు వాన
అకాల వర్షాలు మరోసారి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. గురువారం సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా విరుచుకుపడిన వాన రైతులు, సామాన్యులను ఆగం చేసింది. -
భూముల ధరలు సవరించాలి
హైదరాబాద్ సహా రాష్ట్రంలో అన్ని చోట్ల భూములు, స్థిరాస్తుల రేట్లు భారీగా పెరిగాయని, కానీ అదే స్థాయిలో రెవెన్యూ రాబడుల్లో రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ద్వారా వచ్చే ఆదాయం మాత్రం పెరగలేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రూ.35 వేల కోట్ల సేకరణ ఎలా?
రాష్ట్రంలో రైతుల రుణమాఫీకి నిధుల సేకరణకు ప్రభుత్వం పలు మార్గాలను అన్వేషిస్తోంది. రుణమాఫీకి రూ.33 వేల కోట్ల నుంచి రూ.35 వేల కోట్ల వరకు అవసరమని ప్రభుత్వం అంచనా వేసినట్లు తెలిసింది. -
వైద్య విద్యలో అత్యున్నత ప్రమాణాలే లక్ష్యం
వైద్యవిద్యలో అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పడంతో పాటు ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురావడం, ప్రజలకు వైద్యసేవలు చేరువగా తీసుకురావడమే తమ లక్ష్యమని జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఛైర్మన్ డాక్టర్ బి.ఎన్.గంగాధర్ తెలిపారు. -
జడ్జి పోస్టుల్లో కనిపించని సమాంతర రిజర్వేషన్లు
తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ సర్వీసులో జిల్లా జడ్జి (ఎంట్రీలెవల్) పోస్టుల్లో మహిళలకు వర్టికల్ రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
ఇసుక అక్రమ తవ్వకాల నిలిపివేతకు కలెక్టర్ల కమిటీలు
ఎన్జీటీ, సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాలు కొనసాగడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
జీవన్రెడ్డి మాల్ని స్వాధీనం చేసుకున్న ఆర్టీసీ అధికారులు
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
కొల్హాపుర్, శిర్డీల్లో చంద్రబాబు దంపతుల పూజలు
మహారాష్ట్రలోని కొల్హాపుర్లో కొలువైన శ్రీమహాలక్ష్మి, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను తెదేపా అధినేత చంద్రబాబు.. సతీమణి భువనేశ్వరితో కలసి గురువారం సందర్శించారు. -
ఎస్పీలు సరే.. కిందిస్థాయి అధికారులపై చర్యలేవీ?
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పెద్ద ఎత్తున జరిగిన హింసకాండ, విధ్వంసానికి బాధ్యులుగా తేలుస్తూ ఎన్నికల సంఘం.. ఇద్దరు ఎస్పీలను సస్పెన్షన్, ఒక కలెక్టర్, ఒక ఎస్పీని బదిలీ చేసింది. -
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ