బాబూజీ స్మారక నాణెం విడుదల

బాబూజీ మహరాజ్‌ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు.

Updated : 01 May 2024 03:27 IST

బాబూజీ మహరాజ్‌ మార్గదర్శకాలు.. ప్రతి తరంలో ఉజ్వల భవిష్యత్తుకు నాంది పలుకుతాయని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో మిషన్‌ వ్యవస్థాపకుడు బాబూజీ మహరాజ్‌ 125వ జయంతి వారోత్సవాలు మంగళవారం రెండో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఆర్‌బీఐ ప్రత్యేకంగా ముద్రించిన బాబూజీ స్మారక వెండి నాణేన్ని రామచంద్ర మిషన్‌ గ్లోబల్‌గైడ్‌ కమలేష్‌ డి పటేల్‌(దాజీ)తో కలిసి కోవింద్‌ ఆవిష్కరించారు. నాణెం కోసం నేరుగా ఆర్‌బీఐ నుంచి ఆర్డర్‌ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు.

న్యూస్‌టుడే, నందిగామ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని