టీఎస్ఈఏపీసెట్కు తొలిరోజు 90 శాతానికి పైగా హాజరు
తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘టీఎస్ఈఏపీసెట్-2024’ పరీక్షకు మంగళవారం 90 శాతానికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. తొలిరోజు వ్యవసాయ, ఫార్మసీ (ఏపీ) విభాగంలో ఉదయం 9 గంటలకు నుంచి 12 వరకు జరిగిన మొదటి సెషన్ పరీక్షకు 90.41 శాతం మంది, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు జరిగిన రెండో సెషన్ పరీక్షకు 91.24 శాతం మంది హాజరయ్యారని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వెల్లడించారు. మొదటి సెషన్లో 33,500 మందికి గాను 30,288, రెండో సెషన్లో 33,505 మందికి గాను 30,571 మంది హాజరయ్యారు. ఏపీ, తెలంగాణల్లో కలిపి మొత్తం 301 కేంద్రాల్లో పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్ష కేంద్రాల్లో తొలిసారి ఫేషియల్ రికగ్నిషన్ విధానం అమలు చేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, జేఎన్టీయూహెచ్ వీసీ నరసింహారెడ్డి, సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తదితరులు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. .7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా, 9 నుంచి 11వ తేదీ వరకు ఇంజినీరింగ్ విభాగాల కోసం ప్రవేశపరీక్షలు జరగనున్నాయి.
టీఎస్ఎడ్సెట్ దరఖాస్తు గడువు పెంపు
రాష్ట్రంలోని విద్యాకళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే ‘టీఎస్ఎడ్సెట్-2024’కి ఆలస్యరుసుం లేకుండా దరఖాస్తు గడువును ఈ నెల పదో తేదీ వరకు పొడిగించిన ట్లు సెట్ కన్వీనర్ తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో https://edcet.tsche.ac.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆలస్యరుసుం రూ.250తో ఈ నెల 13వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మంత్రి మండలి సమావేశం నేడు
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (20/05/24)
-
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
-
‘బ్లూ ఆరిజిన్’ ప్రయోగం విజయవంతం.. అంతరిక్షయానం చేసిన తొలి తెలుగు వ్యక్తి
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
మీరు డౌన్లోడ్ చేసే యాప్స్ సురక్షితమైనవేనా? తెలుసుకోండిలా..
-
దాన్ని రికార్డు చేయొద్దని కోరినా.. ప్రసారం చేశారు: రోహిత్ మండిపాటు