Air Canada Flight: సీటులో కూర్చునేందుకు నిరాకరణ.. ప్రయాణికులను బయటకు పంపిన పైలట్!
ఎయిర్ కెనడా సంస్థకు చెందిన ఒక విమానం నుంచి ఇద్దరు మహిళలను కిందకు దించేశారు. వారికి కేటాయించిన సీట్లు అపరిశుభ్రంగా ఉండటంతో ప్రశ్నించడమే దీనికి కారణం.
ఇంటర్నెట్ డెస్క్: టేకాఫ్కు సిద్ధంగా ఉన్న విమానంలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు నిరాకరించిన ఇద్దరు మహిళలను సిబ్బంది బయటకు పంపించారు. ‘ఎయిర్ కెనడా సంస్థ’ (Air Canada Flight)కు చెందిన విమానంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అసలేం జరిగిందంటే..
లాస్ వెగాస్ (Las Vegas) నుంచి మాంట్రియల్ (Montreal)కు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న విమానంలో ఇద్దరు మహిళా ప్రయాణికులు తమకు కేటాయించిన సీట్లలో కూర్చునేందుకు నిరాకరించారు. సీట్ల నుంచి దుర్వాసన రావడమే అందుకు కారణం. వారు అనుమానంతో వాటిని పరిశీలించగా ఎవరో అక్కడ వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో వారు సిబ్బందికి సమాచారం అందించారు. అయితే, ఇంతకు ముందు ఈ విమానంలో ప్రయాణించిన వ్యక్తి వాంతులు చేసుకున్నారని.. దానిని సరిగా శుభ్ర పర్చకుండానే సీటును కవర్ చేశారని తేలింది. దీంతో సిబ్బంది ప్రయాణికులకు క్షమాపణలు చెప్పారు. దుర్వాసన పోయేందుకు సువాసన ద్రవ్యాలు, కాఫీ పొడిని అక్కడ చల్లారు. ఎంత ప్రయత్నించినా.. దుర్వాసన మాత్రం ఆగలేదు.
గ్రీన్కార్డు ‘జీవిత కాలం’ లేటు
విమానంలో ఖాళీలు లేవని.. వారు అక్కడే కూర్చోవాలని సిబ్బంది సూచించారు. కొన్ని నిమిషాలపాటు దీనిపై వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో సమాచారం అందుకున్న పైలట్ అక్కడకు చేరుకొన్నారు. అక్కడ కూర్చునేందుకు ఇష్టం లేకపోతే.. విమానం నుంచి దిగిపోవాలని చెప్పారు. లేదా భద్రతా సిబ్బంది సాయంతో కిందికి దింపేస్తారు అని హెచ్చరించారు. దీంతో సిబ్బంది ఆ ప్రయాణికులను బయటకు పంపించేశారు. విమానంలో ఉన్న బెన్సన్ అనే మరో ప్రయాణికురాలు ఈ ఘటన వివరాలను ఫేస్బుక్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్గా మారింది.
‘‘అక్కడ ఎవరో వాంతులు చేసుకున్నట్లు గుర్తించారు. దుర్వాసన వస్తోంది. అక్కడ కూర్చోవాల్సిన ఇద్దరు మహిళలు దీనిపై సౌమ్యంగానే సిబ్బందితో మాట్లాడుతున్నారు. ఇంతలో పైలట్ వచ్చి వారితో దురుసుగా ప్రవర్తించారు. అనంతరం వారిని బయటకు పంపించారు. ఎయిర్ కెనడా సంస్థకు చెందిన విమానంలో ఈ ఘటన జరగడం బాధాకరం. కెనడాకు చెందిన పౌరురాలిగా ఈ విషయంపై సిగ్గుపడుతున్నాను’’ అని రాసుకొచ్చారు. అనంతరం ఎయిర్ కెనడా సంస్థ ప్రయాణికులకు క్షమాపణలు చెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
నువ్వు కొత్త ప్లేయర్వి కాదు.. వరల్డ్ కప్లో సత్తా చాటాలి: గంభీర్
-
సైలెంట్గా ఓటీటీలోకి ‘కృష్ణమ్మ’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే
-
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా