Lady Serial Killer: చేయని నేరాలకు ‘సీరియల్ కిల్లర్’గా ముద్ర.. 20 ఏళ్లకు క్షమాభిక్ష!
తన నలుగురు పిల్లలను హతమార్చిందనే ఆరోపణలపై ‘సీరియల్ కిల్లర్’గా ముద్రపడిన ఓ మహిళ 20 ఏళ్లుగా జైలుకు పరిమితమయ్యారు. అయితే, ఆ చిన్నారులు సహజంగానే మృతి చెందారని తాజా విచారణలో తేలడంతో తాజాగా ఆమె విడుదలయ్యారు. ఆస్ట్రేలియాలో ఈ వ్యవహారం వెలుగుచూసింది.
కాన్బెర్రా: దశాబ్ద కాలంలో వేర్వేరు సందర్భాల్లో తన నలుగురు పిల్లలను పొట్టన పెట్టుకుని.. ఆస్ట్రేలియా (Australia)లో క్రూరమైన ‘మహిళా సీరియల్ కిల్లర్ (Serial Killer)’గా ముద్రపడిన ఓ మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. ఇటీవల శాస్త్రీయ పరిశోధనల ఆధారంగా చేపట్టిన విచారణలో ఆమె తన చిన్నారులను హత్య చేయలేదని తేలింది. దీంతో అధికారులు ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించడంతో.. 20 ఏళ్ల తర్వాత జైలు జీవితం నుంచి బయటకు వచ్చారు.
న్యూసౌత్ వేల్స్కు చెందిన కాథలీన్ ఫ్లోబిగ్ (55)కు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈ నలుగురూ 1989- 99 మధ్య కాలంలో ఆయా సందర్భాల్లో ఆకస్మికంగా మృతి చెందారు. చనిపోయే సమయంలో వారంతా 19 రోజుల నుంచి 19 నెలల మధ్య వయసున్న వారే. కన్న తల్లే వారిని ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆమె తన డైరీలో పిల్లల పెంపకం కష్టాలపై రాసిన రాతలు, ఇతరత్రా సాక్ష్యాల ఆధారంగా 2003లో 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, తాను ఏ తప్పు చేయలేదంటూ ఆమె.. న్యాయ పోరాటం చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే ఇటీవల ఓ రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో ఈ కేసును మరోసారి దర్యాప్తు చేపట్టారు. ఇందులో ఊహించని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నలుగురు చిన్నారులు సహజంగానే మరణించి ఉండొచ్చని పరిశోధకులు అంచనాకు వచ్చారు. ఆ పిల్లల్లో అరుదైన జన్యుపరమైన లోపాలు ఉన్నాయని, ఇవి ఆకస్మిక మరణాలకు దారితీశాయని తేల్చారు. తల్లి డీఎన్ఏలోనూ అసాధారణ జన్యు క్రమం కనిపించిందని పరిశోధనా బృందానికి నాయకత్వం వహించిన ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కరోలా వినూసా తెలిపారు.
డైరీలో రాతలకు.. చిన్నారుల హత్యలకు సంబంధం లేదని, పిల్లలను ఒక్క సాక్ష్యం లేకుండా హతమార్చడం అసంభవమని తాజా దర్యాప్తు నివేదికలో పేర్కొన్నారు. పైగా, పిల్లలను ఊపిరాడనీయకుండా చేసినట్లు, లేదా వారు గాయపడినట్లు ఆధారాలు కూడా లభించలేదని గుర్తుచేశారు. ఈ క్రమంలోనే న్యూ సౌత్ వేల్స్ గవర్నర్ ఆమెకు క్షమాభిక్ష ప్రసాదించారు. న్యాయవ్యవస్థ మరింత శాస్త్రీయ సంస్కరణలతో ముందుకు సాగాలనే అవసరాన్ని ఈ కేసు చాటుతోందని ‘ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ సైన్స్’ వ్యాఖ్యానించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.