Afghanistan: భారత్లో అఫ్గాన్ ఎంబసీ మూసివేత
Afghanistan: భారత్లో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు అఫ్గాన్ ఎంబసీ ప్రకటించింది. భారత ప్రభుత్వం నుంచి సహకారం కొరవడినందునే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో పేర్కొంది.
దిల్లీ: భారత్లో తమ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్లు అఫ్గానిస్థాన్ గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంబసీ (Afghanistan Embassy) ప్రకటించింది. దీంతో 2023 నవంబర్ 23 నుంచి దేశంలో తమ దౌత్య కార్యకలాపాలు నిలిచిపోనున్నట్లు తెలిపింది. వాస్తవానికి సెప్టెంబర్ 30 నుంచే అఫ్గాన్ ఎంబసీ (Afghanistan Embassy) కార్యకలాపాలు భారత్లో నిలిచిపోయాయి. కానీ, భారత ప్రభుత్వం నుంచి ఆశించిన సహకారం అందకపోవడంతో శాశ్వత మూసివేతకు నిర్ణయం తీసుకున్నామని ఎంబసీ ప్రకటించింది.
దౌత్య అధికారుల్లో కొంత మంది తాలిబన్ ప్రభుత్వానికి విధేయత ప్రకటించటంతో అంతర్గత కలహాలు తలెత్తినట్లు ఆరోపణలు వచ్చే అవకాశం ఉందని ఎంబసీ (Afghanistan Embassy) తమ ప్రకటనలో పేర్కొంది. ఇదే దిల్లీలో రాయబార కార్యాలయ మూసివేతకు కారణమనే వార్తలూ రావొచ్చని తెలిపింది. కానీ, తమ విధానాల్లో విస్తృత మార్పుల వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని చెప్పింది.
భారత్లోని అఫ్గాన్ పౌరులకు ఎంబసీ (Afghanistan Embassy) కృతజ్ఞతలు తెలిపింది. తమను అర్థం చేసుకొని సహకరించారని ప్రకటనలో పేర్కొంది. కాబుల్లో చట్టబద్ధమైన ప్రభుత్వం లేకపోయినా.. పరిమిత వనరులు, అధికారాలతోనే వారి సంక్షేమానికి కృషి చేశామని వివరించింది. గత రెండేళ్ల నుంచి భారత్లో అఫ్గాన్ వాసుల సంఖ్య గణనీయంగా పడిపోయిందని వెల్లడించింది. శరణార్థులు, విద్యార్థులు, వ్యాపారులు దేశాన్ని వీడారని పేర్కొంది. అలాగే 2021 ఆగస్టు తర్వాత చాలా పరిమిత సంఖ్యలో కొత్త వీసాలను జారీ చేసినట్లు తెలిపింది.
భారత్లో గత అఫ్గాన్ రిపబ్లిక్కు సంబంధించిన దౌత్య అధికారులు ప్రస్తుతం ఎవరూ లేరని ప్రకటనలో ఎంబసీ పేర్కొంది. వారంతా ఇతర దేశాలకు సురక్షితంగా చేరారని తెలిపింది. ప్రస్తుతం భారత్లో ఉన్న వ్యక్తులు తాలిబన్ ప్రభుత్వానికి అనుబంధంగా పనిచేస్తున్నవారని పేర్కొంది. తమ కార్యకలాపాలను పూర్తిగా భారత ప్రభుత్వానికి అప్పగించామని తెలిపింది. తాలిబన్ దౌత్య అధికారులకు అనుమతి ఇవ్వడమా లేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడమా అనే అంశాన్ని ప్రభుత్వ నిర్ణయానికే వదిలేస్తున్నామని పేర్కొంది.
అఫ్గానిస్థాన్లోని తాలిబన్ల ప్రభుత్వాన్ని భారత్ ఇంకా గుర్తించలేదు. ఈ క్రమంలోనే ఆ దేశ రాయబార కార్యాలయానికి సంబంధించి భారత్ నిర్ణయాలు తీసుకోవట్లేదు. దీంతో తమ పట్ల భారత్ నిర్లక్ష్యం వహిస్తోందంటూ ఎంబసీ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. 2021 ఆగస్టులో అఫ్గానిస్థాన్లో తాలిబన్లు అధికారం చేజిక్కించుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
Miss Universe Buenos Aires: 60 ఏళ్ల వయసులో అందాల తారగా కిరీటం దక్కించుకుందో మహిళ. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లోనూ పాల్గొననుంది. -
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
అమెరికా(USA)లో ఓ నల్లజాతీయుడిపై పోలీసులు వ్యహరించిన తీరుతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దాంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. -
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
క్రికెట్.. బేస్బాల్ గేమ్లా మారిపోతోంది: పంజాబ్ కెప్టెన్
-
అందాల పోటీల్లో తొలిసారి.. 60 ఏళ్ల ‘భామ’కు కిరీటం
-
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
-
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో