UK: బ్రిటన్లో ఠారెత్తిస్తోన్న ఉష్ణోగ్రతలు.. ఆల్టైం రికార్డ్ బ్రేక్!
బ్రిటన్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 39.1డిగ్రీల సెల్సియస్ (102.4 ఫారన్హీట్) ఉష్ణోగ్రతలు.......
(సెంట్రల్ లండన్లో ఓ ఫౌంటెయిన్ వద్ద ఓ వ్యక్తి సేదతీరుతున్న దృశ్యం..)
లండన్: బ్రిటన్లో నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. మంగళవారం రికార్డు స్థాయిలో 39.1డిగ్రీల సెల్సియస్ (102.4 ఫారన్హీట్) ఉష్ణోగ్రతలు నమోదైనట్టు బ్రిటన్ వాతావరణ శాఖ వెల్లడించింది. సౌత్ లండన్లోని గాట్విక్ విమానాశ్రయానికి సమీపంలో చార్ల్వుడ్ సర్రేలో ప్రాథమికంగా ఈ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని.. ఇవి మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలిపింది. యూకేలో ఇప్పటివరకూ నమోదైన అత్యంత అధిక ఉష్ణోగ్రతలు ఇవేనని పేర్కొంది. ఈరోజు ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉందని.. తొలిసారిగా 40డిగ్రీల సెల్సియస్ మార్కును దాటే ప్రమాదం లేకపోలేదని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు, బ్రిటన్లో ఇప్పటివరకూ నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 38.7 డిగ్రీల సెల్సియస్గా ఉండేది. 2019 జులై 25న కేంబ్రిడ్జి బోటానిక్ గార్డెన్లో ఈ ఉష్ణోగ్రత నమోదైంది.
ఈ వారంలో భారీ ఉష్ణోగ్రతలు (41డిగ్రీల సెల్సియస్) నమోదయ్యే అవకాశం ఉన్నట్టు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అత్యంత తీవ్రమైన వేడి ఉంటుందని, ముఖ్యంగా రాత్రివేళల్లోనూ వేడి కొనసాగుతుందని హెచ్చరించారు. నగరప్రాంతాల్లో నివసించేవారు ఈ ఉష్ణ ప్రభావానికి గురవుతారని తెలిపారు. వడగాడ్పులతో పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలతో పౌరులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఉపశమనం పొందేందుకు బీచ్ల వెంట పరుగులు తీస్తున్నారు. అత్యంత అరుదుగా సంభవించే ఈ వడగాడ్పులు ఇప్పటికే ఇంగ్లాండ్తో పాటు వేల్స్లోని పలు ప్రాంతాలను తాకినట్టు వాతావరణ శాఖ ఇటీవల తెలిపింది. ఒకవేళ అదే జరిగితే ప్రజలు అనారోగ్యం బారిన పడటంతో పాటు ప్రాణాపాయ స్థితి ఏర్పడుతుందని బ్రిటన్ ఆరోగ్య విభాగం హెచ్చరికలు జారీ చేసింది. ఒకవేళ ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్కు చేరితే వాతావరణ అత్యయిక స్థితి ప్రకటించే అవకాశం ఉందంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM