China: జీరో కొవిడ్ నిబంధనలు సడలించిన చైనా..!
చైనా(China)లో ఎట్టకేలకు జీరోకొవిడ్ (Zero Covid) నిబంధనలను సడలించారు. స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఏకాంతంలో ఉండొచ్చు.
ఇంటర్నెట్డెస్క్: జీరో కొవిడ్(Zero Covid) నిబంధనలను సడలిస్తూ బుధవారం చైనా(China) ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దాదాపు 10 రోజులుగా డజనుకు పైగా నగరాల్లో జీరో కొవిడ్(Zero Covid) నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు ఆందోళనలకు దిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కొత్త నిబంధనల ప్రకారం తరచూ కొవిడ్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాదు, లక్షణాలు లేని, స్వల్ప లక్షణాలు ఉన్న వారు ఇంట్లోనే ఏకాంతంలో గడపొచ్చు. గతంలో ఇటువంటి లక్షణాలు ఉన్నవారిని బలవంతంగా వైద్యశాలలకు తరలించేవారు. గతంలో ఏదైనా భవనంలో కొవిడ్ కేసు వస్తే ఆ ప్రాంతం మొత్తాన్ని సీల్ చేసేవారు. కానీ, ఇక ఆ విధానం అమలు చేయరు. ఆ భవనం నుంచి బయటకు వెళ్లే మార్గాలను తెరిచే ఉంచుతారు. ఈ విషయాన్ని బీజింగ్లోని నేషనల్ హెల్త్ కమిషన్ ప్రకటించింది.
చైనా(China)లో కఠిన లాక్డౌన్లతో జీరోకొవిడ్(Zero Covid) పాలసీని అమలు చేసి వైరస్ కట్టడి చేయాలని అధ్యక్షుడు జిన్పింగ్(xi jinping) భావించారు. దీనిని సీసీపీ ఘనతగా ప్రచారం చేయాలని అనుకున్నారు. ఈ క్రమంలో వైరస్పై ప్రజాయుద్ధం ప్రకటించారు. వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో డజన్ల కొద్దీ అధికారులను విధుల నుంచి తొలగించారు. నగరాల్లో లాక్డౌన్లు విధించారు. లాక్డౌన్లపై ప్రశ్నించిన ప్రజలు, వైద్య నిపుణుల నోళ్లను బలవంతంగా మూయించారు. దీని అమలును డిజిటల్ నిఘా కిందకు తీసుకొచ్చారు. దీంతో ప్రజలు బయటకు కదలాలన్నా ఇబ్బందికరంగా మారింది. మరోవైపు చైనా (China) ఆర్థిక వ్యవస్థకు ఇవి భారంగా పరిణమించాయి. దీంతోపాటు గ్వాంగ్ఝూ, బీజింగ్ వంటి పలు చోట్ల ఆందోళనలకు కారణం అయ్యాయి. ఈ నేపథ్యంలో దాదాపు 10 నిబంధనల్లో చైనా (China) సడలింపులు ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.