china: తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశాలపై ఆంక్షలు
చైనాలోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద ప్రవేశాలపై చైనా ఆంక్షలు విధించింది. 1989లో జరిగిన ఘటన నేపథ్యంలో ప్రజలు భారీ ఎత్తున తియానన్మెన్ స్క్వేర్ వద్ద గూమికూడే అవకాశం నేపథ్యంలో పోలీసులు ఈ చర్యలు చేపట్టారు.
బీజింగ్: రాజధాని బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్ వద్దకు ప్రవేశాలపై చైనా ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 1989లో జరిగిన ప్రజాస్వామ్య అనుకూల నిరసనల వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం ఈ ఆంక్షలు పెట్టారు. హాంకాంగ్లోని విక్టోరియా పార్కు వద్ద ఇద్దరు నిరసనకారులను పోలీసులు అరెస్టుచేశారు. 1989లో జూన్ 3 అర్ధరాత్రి, జూన్ 4 ఉదయం జరిగిన భారీ ప్రదర్శనపై సైన్యం ట్యాంకులతో విరుచుకుపడటంతో వేలమంది మరణించారు. వారికి నివాళిగా ప్రతి సంవత్సరం అక్కడ కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించేందుకు పెద్దసంఖ్యలో గుమికూడుతారు. అయితే.. ఇటు చైనాలోను, అటు హాంకాంగ్లో సైతం 2020 జూన్లో జాతీయ భద్రతా చట్టాన్ని కఠినంగా అమలుచేసి, నిరసనలపై ఆంక్షలు పెట్టారు. 1989లో జరిగిన హింసాత్మక ఘటనలో ఎంతమంది మరణించారో ఇప్పటికీ తెలియదు. ఇక బీజింగ్లో తియానన్మెన్ స్క్వేర్ వద్ద కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. అటువైపుగా నడిచి గానీ, సైకిల్ మీద వెళ్లినా పోలీసులు ఆపి, వారి గుర్తింపు చూపించాలంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్