Pakistan: పాకిస్థాన్లో చైనా ఇంజినీర్లపై మజీద్ బ్రిగేడ్ దాడి..!
పాకిస్థాన్లోని కీలకమైన రేవు నగరం గ్వాదర్లో చైనా ఇంజినీర్ల కాన్వాయ్పై రెబల్స్ దాడి చేశారు.
ఇంటర్నెట్డెస్క్: పాకిస్థాన్(Pakistan)లో చైనా(China)కు చెందిన ఇంజినీర్ల వాహనశ్రేణిపై ఉగ్రదాడి జరిగింది. బలూచిస్థాన్లోని అత్యంత కీలకమైన గ్వాదర్లో ఈ ఘటన చోటు చేసుకొంది. స్థానికంగా ఉన్న ఫకీర్ కాలనీ వంతెనపైకి చైనా ఇంజినీర్లకు చెందిన ఏడు వాహనాలు చేరుకోగానే రెబల్స్ కాల్పులు జరిపారు. ఈ దాడికి తాము బాధ్యత వహిస్తున్నట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ పేరిట ఓ ప్రకటన విడుదలైంది. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఒక చైనా ఇంజినీరు.. భద్రతా సిబ్బంది ఒకరు గాయపడినట్లు సమాచారం. దాడికి పాల్పడిన ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టారు.
పాక్ స్వాతంత్ర్య దినోత్సవానికి (ఆగస్టు 14) ఒక రోజు ముందు ఈ దాడి జరగడం గమనార్హం. తాజా దాడులతో గ్వాదర్ పోర్టుకు వెళ్లే అన్ని మార్గాలను మూసివేశారు. ఈ దాడితో పాకిస్థాన్లోని చైనా దౌత్యకార్యాలయం అప్రమత్తమైపోయింది. పాక్లోని బలూచిస్థాన్, సింధ్ ప్రావిన్స్ల్లోని చైనీయులు తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఇళ్లలోనే ఉండిపోవాలని కోరింది.
గత 100 ఏళ్లలో చూడని ఘోరం : అమెరికా ఫైర్ డిపార్ట్మెంట్
పాకిస్థాన్లోని చైనా వాసులపై ఇటీవల కాలంలో దాడులు పెరిగిపోయాయి. ముఖ్యంగా గ్వాదర్ పోర్టుపై చైనా పెత్తనం చేయడంతో స్థానికులు ఆగ్రహంగా ఉన్నారు. గతేడాది మే నెలలో ఓ మహిళ కరాచీలోని విశ్వవిద్యాలయం సమీపంలో చైనీయులు ప్రయాణిస్తున్న బస్సుపై ఆత్మాహుతి దాడికి పాల్పడింది. ఈ దాడి కూడా బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీనే చేయించింది. ఇక 2021లో చైనా ఇంజినీర్లను తీసుకెళుతున్న బస్సుపై బాంబుదాడి జరిగింది. దీనిలో 13 మంది చనిపోయారు. ఈ దాడిలో మృతులకు పాకిస్థాన్ కొన్ని మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. అంతేకాదు.. చైనా దర్యాప్తు బృందాలు స్వయంగా పాక్కు వచ్చి విచారణ జరిపాయి. అదే ఏడాది ఏప్రిల్లో క్వెట్టాలో ఓ విలాసవంతమైన హోటల్పై కూడా బాంబుదాడి చేసి చైనా దౌత్యవేత్తను చంపేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365
-
తెదేపాకు ఓటేశాడని.. కొడవలితో చెవి కోసేశాడు
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM