UK VISA: యూకేలో కొత్త వీసా రూల్స్.. భారతీయ విద్యార్థులపై ప్రభావమెంత..?
బ్రిటన్ తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధనలు (Visa rules UK) భారత్తో సహా అందరు విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపుతాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత విద్యకోసం భారతీయ విద్యార్థులు అమెరికా, కెనడాతోపాటు బ్రిటన్పై (Study in UK) భారీ సంఖ్యలో మొగ్గు చూపుతున్న విషయం తెలిసిందే. అయితే, ఇటీవల యూకే యూనివర్సిటీల్లో చదువుతోన్న విద్యార్థులు లేదా అక్కడ చదివేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న విదేశీ విద్యార్థులకు సంబంధించి బ్రిటన్ ప్రభుత్వం కొత్త నిబంధనలు (New immigration system) తీసుకువచ్చింది. ఇలా కొత్తగా తీసుకువచ్చిన వీసా నిబంధనలపై (Visa rules UK) ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చ జరిగింది. ఈ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి ఎస్ జైశంకర్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
Visa Rules: విద్యార్థి వీసాల్లో మార్పుతో.. జాబ్స్కు బ్యాక్డోర్ బంద్
- విదేశీ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం వీసా నిబంధనలు మార్చిందనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం గమనించిందా..? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఔను అని ప్రభుత్వం బదులిచ్చింది.
- బ్రిటన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వీసా నిబంధనల ప్రకారం.. విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు అంతర్జాతీయ విద్యార్థులు స్టూడెంట్ నుంచి ఉద్యోగ వీసాకు మారలేరు. జులై 17, 2023 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని తెలిపింది.
- పరిశోధన ప్రోగ్రామ్గా గుర్తించిన పీజీ కోర్సులో నమోదైతే తప్ప.. తమపై ఆధారపడిన వారిని తీసుకువచ్చేందుకు అంతర్జాతీయ విద్యార్థులకు అనుమతి లేదు. జనవరి 1, 2024 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది.
- బ్రిటన్లో చదువుతున్న లక్షల మంది విద్యార్థుల్లో అనేకమంది తమ ఆర్థిక అవసరాల కోసం పార్ట్-టైం ఉద్యోగం చేస్తున్నారు. భవిష్యత్తులో కొత్త వీసా నిబంధనలు వారిపై ఏవిధమైన ప్రభావం చూపిస్తాయని సభ్యులు అడిగిన ప్రశ్నకూ భారత ప్రభుత్వం బదులిచ్చింది.
- 2022లో ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లిన భారతీయ విద్యార్థుల సంఖ్య 1.39లక్షలు (ఆధారపడిన వారు మినహా). ఈ కొత్త వీసా రూల్స్ అందరు విదేశీ విద్యార్థులపై ప్రభావం చూపిస్తాయని తెలిపింది.
- ఇరు దేశాల పౌరులు, విద్యార్థులు, ఉద్యోగుల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే క్రమంలో ఎదురయ్యే అన్ని సమస్యలపై బ్రిటిష్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని భారత ప్రభుత్వం వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
స్లొవేకియా ప్రధాని రాబర్డ్ ఫికోపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. -
ముసుగు మనుషుల దాడి: డ్రగ్లార్డ్ ‘ది ఫ్లై’ని విడిపించుకొని పారిపోయిన గ్యాంగ్..!
హాలివుడ్ సినిమా తరహాలో ఓ గ్యాంగ్ సభ్యులు డ్రగ్లార్డ్ను విడిపించుకుపోయారు. జైలు వాహన కాన్వాయ్పై ఆటోమేటిక్ ఆయుధాలు, ఖరీదైన ఎస్యూవీతో దాడి చేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చాబహార్ పోర్టు డీల్ను సంకుచిత దృష్టితో చూడకూడదు: అమెరికా ఆంక్షలపై భారత్
చాబహార్ పోర్టు డీల్పై అమెరికా చేసిన హెచ్చరికలకు భారత్ స్పందించింది. ఈ ఒప్పందాన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని వెల్లడించింది. -
మాకూ మోదీలాంటి నాయకుడు రావాలి: పాక్-అమెరికన్ వ్యాపారవేత్త
Modi: మోదీలాంటి నాయకత్వం కేవలం భారత్కే కాకుండా యావత్ ప్రపంచానికి మంచి చేస్తుందని పాక్-అమెరికన్ వ్యాపారవేత్త సాజిద్ తరార్ అన్నారు. పాక్లో సమస్యలన్నింటినీ పరిష్కరించగలిగే నాయకుడొకరు రావాలని ఆకాంక్షించారు. -
సౌర కుటుంబంలో గ్రహాంతర జీవుల కోసం..
భూమికి వెలుపల ఈ సువిశాల విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అన్నది అనాదిగా మానవుడిని వేధిస్తున్న ప్రశ్న. అయితే శతాబ్దాలుగా అది అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. -
చైనాకు పుతిన్.. రేపటి నుంచి పర్యటన ప్రారంభం
ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా ఇటీవల ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్.. తన తొలి విదేశీ పర్యటన చైనాలో చేయనున్నారు. -
ఖర్కీవ్ను కాపాడుకోవాలంటే మరిన్ని ఆయుధాలు కావాలి
రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్కు అమెరికా దాదాపు 61 బిలియన్ డాలర్ల సైనిక సాయం ఇటీవలే ప్రకటించింది. అయినా ఇంకా ఆయుధాలు కావాలంటోంది ఉక్రెయిన్. లేకపోతే రష్యాను ఓడించడం కష్టమంటోంది. -
ఇరాన్తో ఒప్పందంపై భారత్కు అమెరికా హెచ్చరిక!
ఇరాన్లోని చాబహార్ ఓడరేవు నిర్వహణకు సంబంధించి భారత్ కీలక ఒప్పందం కుదుర్చుకున్న వేళ అమెరికా పరోక్ష హెచ్చరిక జారీ చేసింది. -
2050 కల్లా మరో 24.5 కోట్లమంది వృద్ధులపై ఎండ ప్రతాపం!
పర్యావరణంలో మార్పుల కారణంగా రాబోయే పాతికేళ్లలో.. ఇప్పుడున్న సంఖ్యకు అదనంగా మరో 24.5 కోట్ల మందికిపైగా వృద్ధులపై మండుటెండల ప్రభావం పడే ముప్పుందని తాజా అధ్యయన నివేదిక ఒకటి హెచ్చరించింది. -
పీవోకేలో ఆగని హింస
పాక్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లో మళ్లీ హింస చెలరేగింది. పెరిగిన గోధుమ ధరలు, విద్యుత్తు బిల్లులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా అక్కడి ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. -
శ్వేతసౌధంలో ‘సారే జహాసే అచ్ఛా..’
భారత్కు చెందిన ‘సారే జహాసే అచ్ఛా’ గీతం సోమవారం శ్వేతసౌధంలో అతిథులను అలరించింది. అంతేకాదు అతిథులకు వడ్డించిన ఆహారంలో భారతీయ వంటకమైన సమోసాతోపాటు పానీపూరీకి చోటు దక్కింది. -
అవసరమైతే బైడెన్ను హతమార్చాలనుకున్నా
అమెరికాలోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని కూలదోసి హిట్లర్ నాజీ నిరంకుశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే అధ్యక్ష భవనం శ్వేతసౌధంపై ట్రక్కుతో దాడి చేశానని కందుల సాయి రక్షిత్ (20) అంగీకరించాడు. -
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారు. -
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
సింగపూర్కు చెందిన ఓ ఇన్ఫ్లుయెన్సర్.. 34 ఏళ్లకే నానమ్మ అయ్యారు. తన 17ఏళ్ల కుమారుడు గతేడాది తండ్రి అయిన విషయాన్ని ఆమె ఇటీవల వెల్లడించారు. -
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
థాయ్లాండ్లో రాచరిక చట్టాలపై అసమ్మతి గళం వినిపించిన ఓ మహిళా కార్యకర్త నెలల తరబడి నిరాహార దీక్ష అనంతరం మృతి చెందారు.
తాజా వార్తలు (Latest News)
-
టెలికాం టారిఫ్లు మన దగ్గరే తక్కువ: ఎయిర్టెల్ సీఈఓ
-
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు..
-
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఊర్వశి హొయలు.. సక్సెస్ జోష్లో అదితి
-
తెలంగాణలో వర్సిటీల ఉపకులపతుల నియామకానికి ఈసీ అనుమతి
-
మ్యూచువల్ ఫండ్ మదుపర్లకు గుడ్న్యూస్.. కేవైసీ నిబంధనల్లో సడలింపు
-
మళ్లీ కలిసిన కేఎల్ - సంజీవ్ గోయెంకా.. అభిమానికి గంభీర్ స్వీట్ రిప్లయ్!