India-China: దెబ్బకు ఠా.. చైనా ముఠా!
గల్వాన్ తరహా దాడితో భారత సేనకు భారీ ప్రాణనష్టం కలిగిద్దామని చైనా ఘనంగా రూపొందించుకున్న వ్యూహం బెడిసికొట్టింది.
గల్వాన్ తరహా దాడితో భారత సేనకు భారీ ప్రాణనష్టం కలిగిద్దామని చైనా ఘనంగా రూపొందించుకున్న వ్యూహం బెడిసికొట్టింది. ప్రత్యర్థిని తక్కువగా అంచనావేసిన డ్రాగన్.. పప్పులో కాలేసింది. ఆ దేశ ఎత్తుగడలను ఓరకంట గమనించిన మన సేన ముందుగానే అప్రమత్తమై, ప్రతివ్యూహాన్ని అమలు చేయడంతో చైనా సైనికులకు చావుదెబ్బలు మిగిలాయి. ఈ నెల 9న అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కీలక వివరాలు మిలటరీ వర్గాల ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి.
ముందే పసిగట్టి..
* తవాంగ్ పరిసరాల్లో చైనా బలగాల తీరులో ఏదో తేడా ఉన్నట్లు భారత సైన్యం నవంబరు చివర్లోనే పసిగట్టింది. ఆ నెల 15న జి-20 సదస్సులో ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ అయిన కొద్దిరోజులకే ఇలాంటి మార్పు జరగడం గమనార్హం.
* చైనా సైనిక గస్తీ బృందాల హడావుడి పెరగడాన్ని గుర్తించిన భారత బెటాలియన్ కమాండర్లు ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
* క్రమంగా వేడి రాజుకోవడం మొదలైంది. ఇరు దేశాల గస్తీ బృందాలు తరచూ ఎదురుపడటం, ఉద్రిక్తతలు చోటుచేసుకోవడం పరిపాటిగా మారింది.
చొరబాటుకు యత్నించొచ్చు..
ఈ పరిణామాల నేపథ్యంలో మన బలగాల సంఖ్యను అధికారులు పెంచారు. ఆధిపత్యాన్ని చాటుకునేందుకు మన భూభాగంలోకి డ్రాగన్ సేన చొరబడొచ్చని అంచనా వేశారు. ఇలాంటి పరిణామాలకు ఎక్కడెక్కడ ఆస్కారం ఉందన్నదానిపై విశ్లేషించారు. చీకట్లోనూ వీక్షించేందుకు సాయపడే థర్మల్ ఇమేజర్లను ఉపయోగిస్తూ నిఘా పెట్టారు.
* తవాంగ్లోని యాంగ్జే ప్రాంతంలో హిమపాతం మాటున గప్చుప్గా చైనా తన సైనికుల సంఖ్య క్రమంగా పెంచుకోవడాన్ని డిసెంబరు 8వ తేదీ రాత్రి మనవాళ్లు పసిగట్టారు.
విరుగుడు సిద్ధం..
క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్న ఆ ప్రాంతంలోని భారత బ్రిగేడ్ హెడ్క్వార్టర్స్.. ఈ నెల 9న ఉదయం 6 గంటలకు స్థానిక కమాండర్లకు కీలక ఉత్తర్వులు జారీచేసింది. సైన్యంలోని సుశిక్షిత సత్వర స్పందన దళాల (క్విక్ రియాక్షన్ టీమ్- క్యూఆర్టీ)ను రంగంలోకి దించాలని నిర్దేశించింది.
* తన కుట్రలు, మోహరింపులను భారత సైన్యం గమనిస్తోందని, దానికి విరుగుడును సిద్ధం చేసిందని తెలియని డ్రాగన్ సేన.. తప్పుడు అంచనాలతో రంగంలోకి దిగింది. యాంగ్జే ప్రాంతంలో 50 మంది భారత సైనికులే ఉండొచ్చని లెక్కలువేసుకొని, వారిని ఎదుర్కోవడానికి 300 మందిని పంపింది. అక్కడికి కొద్ది దూరంలో మోహరించిన మన క్యూఆర్టీ బలగాలను చైనా గుర్తించలేకపోయింది.
ఘర్షణ ఇలా..
ఈ నెల 9న.. ముందుగా నిర్దేశించుకున్న సమయానికి చైనా సైనికులు మన భూభాగంవైపు రావడం మొదలుపెట్టారు. వారిని 50 మంది భారత జవాన్లు అడ్డుకున్నారు. రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది.
* కొద్దిగా దూరంలో మాటువేసిన చైనా అదనపు బలగాలు ప్రత్యర్థికి షాక్ కలిగించే ఎలక్ట్రిక్ కర్రలు, మేకులతో కూడిన కట్టెలు వంటి ఆయుధాలతో అకస్మాత్తుగా ముందుకు దూసుకొచ్చి, భారత సైనికులపై దాడికి దిగాయి.
* సరిగ్గా ఈ దశలో భారత క్యూఆర్టీ రంగంలోకి దూకింది. చిన్నబృందాలుగా విడిపోయి.. ప్రత్యర్థి సైనికులను చుట్టుముట్టింది. గల్వాన్ అనుభవాల దృష్ట్యా మన క్యూఆర్టీలు ఈసారి కర్రలు, మేకులతో కూడిన కట్టెలను ముందుగానే సిద్ధం చేసుకున్నాయి. వీటి దెబ్బను ప్రత్యర్థులకు రుచి చూపించడం మొదలుపెట్టాయి.
* ఈ హఠాత్పరిణామానికి డ్రాగన్ సైనికులు బిత్తరపోయారు. ఇంతమందితో తలపడడానికి తాము సిద్ధమైరాలేదని ఆలోచనలో పడ్డారు. ఈలోగా వీరి ఆయుధాలను మన సైనికులు గుంజుకొని దేహశుద్ధి చేశారు.
* దీంతో చైనా సైనికులు తోకముడిచారు. పరారవుతున్న డ్రాగన్ సైనికులను మనవాళ్లు వెంటాడి మరీ చితకబాదారు. కొద్దిదూరంలో ఉండి దీన్ని గమనిస్తున్న చైనా కమాండర్లు.. తమవారిని రక్షించుకోవడం కోసం గాల్లోకి కాల్పులు జరిపారు. దీంతో ఘర్షణ ఆగింది.
* మనవాళ్ల దాడిలో 10-15 మంది చైనా సైనికులకు తీవ్రగాయాలయ్యాయి. వీరు చనిపోయి ఉండొచ్చని భారత సైనికాధికారుల అంచనా.
చైనా జెట్ల రొద..!
తవాంగ్ ఘర్షణ తర్వాత టిబెట్లోని తన వైమానిక స్థావరాల్లో పెద్ద సంఖ్యలో డ్రోన్లు, యుద్ధవిమానాలను చైనా మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు 150 కిలోమీటర్ల దూరంలోని బంగ్డా వైమానిక స్థావరంలో డబ్ల్యూజడ్-7 సోరింగ్ డ్రాగన్ డ్రోన్ కనిపించింది. ఇది నిరంతరాయంగా 10 గంటల పాటు గగన విహారం చేయగలదు. నిఘా సమాచారాన్ని క్షిపణులకు చేరవేయగలదు. షింగాట్సే విమానాశ్రయంలో ఫ్లాంకర్ తరహా యుద్ధవిమానాలు, కేజే-500 గగనతల ముందస్తు హెచ్చరిక విమానాలు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో అరుణాచల్లో భారత వాయుసేన గగనతల గస్తీ ముమ్మరం చేసింది. ఆ రాష్ట్రంలో ఇటీవల రెండుసార్లు చైనా యుద్ధవిమానాలు హద్దు మీరేందుకు ప్రయత్నించగా.. మన జెట్లు వాటిని తరిమేశాయి.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారే అమెరికా ఆర్థిక వ్యవస్థ బలం: బైడెన్
Joe Biden: అమెరికా ఎప్పుడూ వలసదారులను ఆహ్వానిస్తుందని అధ్యక్షుడు బైడెన్ అన్నారు. వారే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు.. వెల్లడించిన అమెరికా పోలీసులు
కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని అమెరికా పోలీసులు తేల్చారు. అతడు హత్యకు గురైనట్లు తప్పుడు ప్రచారం జరిగిందని పేర్కొన్నారు. -
మూసేవాలా హత్యకేసు నిందితుడు గోల్డీబ్రార్ మృతి
ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో ప్రధాన నిందితుడు గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ను కొందరు దుండగులు కాల్చి చంపారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
నా లక్ష్యం వికెట్లు కాదు.. డాట్బాల్స్ వేయడంపైనే దృష్టిపెట్టా: బ్రార్
-
‘హరిహర వీరమల్లు’ దర్శకుడి మార్పు.. క్రిష్ స్థానంలో ఎవరంటే
-
ఎన్టీఆర్ నాకు తమ్ముడితో సమానం: రాజమౌళి
-
భానుడి ప్రతాపం.. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్నెట్స్..
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
-
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?