డ్రైవర్ లేని బస్సులూ వచ్చేశాయ్!
అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం రోబో ట్యాక్సీలు, డ్రైవర్ లేని బస్సులతో ప్రయోగాలు మొదలుపెట్టింది. రవాణా, ప్రయాణికుల భద్రతాపరమైన సమస్యలు ఉన్నా నగరంలో రోబో ట్యాక్సీ సేవలను అనుమతించిన వారం రోజులకే అధికారులు డ్రైవర్ రహిత స్వయంచాలిత బస్సు సేవలకూ పచ్చజెండా ఊపారు.
శాన్ఫ్రాన్సిస్కోలో ఉచిత ప్రయాణం
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నగరం రోబో ట్యాక్సీలు, డ్రైవర్ లేని బస్సులతో ప్రయోగాలు మొదలుపెట్టింది. రవాణా, ప్రయాణికుల భద్రతాపరమైన సమస్యలు ఉన్నా నగరంలో రోబో ట్యాక్సీ సేవలను అనుమతించిన వారం రోజులకే అధికారులు డ్రైవర్ రహిత స్వయంచాలిత బస్సు సేవలకూ పచ్చజెండా ఊపారు. ఈ విద్యుత్తు బస్సు శాన్ఫ్రాన్సిస్కో నగరం వద్ద సముద్రంలోని ట్రెజర్ ఐలాండ్లో ప్రయోగాత్మకంగా మొదలైంది. 2,000 మంది నివసించే ఈ దీవిలోని నివాస ప్రాంతాలను మార్కెట్ ప్రాంతంతో కలిపే ఈ బస్సులో ప్రయాణాలు ఉచితం. ఒకేసారి 10 మంది ప్రయాణికులను తీసుకెళ్లే ఈ బస్సు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తిరుగుతుంది. డ్రైవర్ కానీ, స్టీరింగ్ వీల్ కానీ ఉండని ఈ బస్సులో రిమోట్ కంట్రోల్తో ఒక అటెండెంట్ మాత్రం ఉంటారు. అత్యవసర పరిస్థితిలో బస్సును ఆపడమే కాకుండా ప్రయాణికులకు ఆయన భరోసా ఇస్తాడు. డ్రైవర్ రహిత బస్సు కన్నా ముందు కాలిఫోర్నియా అధికారులు శాన్ఫ్రాన్సిస్కో నగరంలో క్రూజ్, వేమో అనే రెండు రోబో ట్యాక్సీ కంపెనీలను అనుమతించారు. వీటిలో క్రూజ్ సంస్థ జనరల్ మోటార్స్ కంపెనీ అనుబంధ సంస్థ. ఈ కంపెనీకి చెందిన రోబో ట్యాక్సీ గురువారం రాత్రి ఒక అగ్నిమాపక వాహనాన్ని ఢీకొనడంతో అందులోని ప్రయాణికుడు ఆసుపత్రి పాలయ్యాడు. రోబో ట్యాక్సీలు హఠాత్తుగా ఆగుతున్నాయని, రవాణాకు ఆటంకాలు కలిగిస్తున్నాయని ఆరోపణలు రావడంతో మరిన్ని రోబో ట్యాక్సీ సంస్థలకు ఇప్పుడే అనుమతులు ఇవ్వకూడదని నిర్ణయించారు. అయినా శాన్ఫ్రాన్సిస్కోలో డ్రైవర్ లేని బస్సుతో ప్రయోగాన్ని అనుమతించారు. ఈ బస్సులో అటెండెంట్ ఉంటారు కాబట్టి ప్రమాదం జరగదని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి