Israel: యుద్ధ విస్తరణకు సంకేతమా?
పాలస్తీనాపై సాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం అక్కడితో ఆగుతుందా? విస్తరిస్తుందా? ఇతర దేశాలూ ఇందులో అడుగుపెడతాయా? బుధవారంనాటి పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సిరియా, లెబనాన్ల నుంచీ ఇజ్రాయెల్పై దాడులు
పాలస్తీనాకు ఇరాన్, ఖతార్, కువైట్ల మద్దతు
ఇజ్రాయెల్కు అమెరికా, ఈయూ పూర్తి అండాదండ
ఐరాసతోపాటు ప్రపంచ దేశాల్లో ఆందోళన
పాలస్తీనాపై సాగుతున్న ఇజ్రాయెల్ యుద్ధం అక్కడితో ఆగుతుందా? విస్తరిస్తుందా? ఇతర దేశాలూ ఇందులో అడుగుపెడతాయా? బుధవారంనాటి పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు.. లెబనాన్, సిరియాల నుంచీ ఇజ్రాయెల్ వైపు రాకెట్లు దూసుకురావడం, ఖతార్, ఇరాన్లాంటివి పాలస్తీనాకు మద్దతుగా నిలుస్తుండటం.. మరోవైపు అమెరికా, ఈయూ దేశాలు ఇజ్రాయెల్కు పూర్తి అండదండలందించడంతో ఐక్యరాజ్య సమితి సహా అందరిలోనూ ఆందోళన మొదలైంది.
వారూ దిగితే..
పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్పై గాజాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు బుధవారం మరోవైపు నుంచి దాడి ఎదురైంది. అది పక్కనున్న లెబనాన్, సిరియాల వైపు నుంచి. లెబనాన్లోని హెజ్బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్ దళాలు ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. అసలే గాజాలో ఇజ్రాయెల్ దాడులతో పరిస్థితి దిగజారుతుందని భావిస్తున్న ఐక్యరాజ్య సమితి.. సిరియా, లెబనాన్ల నుంచి దాడులతో మరింత ఆందోళన వ్యక్తం చేసింది. ఇరుపక్షాలూ సంయమనం పాటించాలని, ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది.
హమాస్కు సిరియా, లెబనాన్ మద్దతుదారులు. ఈ రెండూ యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్పై ముప్పేట దాడిలా అవుతుంది. మూడు వైపులా ఇజ్రాయెల్ యుద్ధం చేయాల్సి వస్తుంది. అన్నింటికీ మించి... ఇజ్రాయెలీలపై హమాస్ దాడిలో ఇరాన్ హస్తం ఉందని తేలితే పరిస్థితి మరింత దిగజారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లెబనాన్, సిరియాలతోపాటు ఇరాన్, ఖతార్, కువైట్ హమాస్ను సమర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్కు చిరకాల శత్రువైన ఇరాన్ హమాస్ తీవ్రవాదులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ దేశాలన్నీ హమాస్ వెనకాల నిలిస్తే యుద్ధం మరింత విస్తరించే ప్రమాదం పొంచి ఉంది.
అరబ్ ఐక్యతకు చిల్లు?
హమాస్కు పశ్చిమాసియాలోని అన్ని అరబ్ దేశాల నుంచి మద్దతు లభిస్తుందా.. అంటే ఔనని చెప్పడం కష్టం. 50 ఏళ్ల కిందట పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్పై వ్యతిరేకత వ్యక్తం చేసిన అనేక అరబ్ దేశాలు ఇప్పుడదే రీతిలో స్పందించకపోవడం గమనార్హం. పాలస్తీనాపట్ల సానుకూలత, సానుభూతి ఉన్నా ఇజ్రాయెల్ పట్ల వ్యతిరేకత అందరిలోనూ వ్యక్తం కావడం లేదు. ఈజిప్టు, బహ్రెయిన్, యూఏఈ హమాస్ దాడిని తీవ్రంగా ఖండించాయి. కీలకమైన సౌదీ అరేబియా ఎవరి పక్షం వహించకుండా లౌక్యంగా తటస్థంగా ఉండే ప్రయత్నం చేయడం విశేషం. అంటే ఇజ్రాయెల్పై వ్యతిరేకత విషయంలో అరబ్లీగ్లోనే ఐక్యత లేదు. మారుతున్న ప్రపంచ రాజకీయ భౌగోళిక సమీకరణాల్లో సౌదీ, యూఏఈలాంటి దేశాలు స్వావలంబన దిశగా సాగుతున్నాయి. ఇజ్రాయెల్, అమెరికాలతో సత్సంబంధాలను పెంచుకోవాలని భావిస్తున్నాయి.
అందులో భాగంగానే ఒక్కొక్కటిగా తమ వ్యతిరేక వైఖరిని వదిలేస్తూ ఇజ్రాయెల్తో ఒప్పందం చేసుకుంటున్నాయి. వీటినే అబ్రహమిక్ ఒప్పందాలు అంటారు. ఇప్పటికే ఈజిప్టు, యూఏఈలు ఈ బంధంలో ఉన్నాయి. త్వరలోనే సౌదీ అరేబియా ఒప్పందానికి సిద్ధమవుతోంది. బలమైన అరబ్ దేశమైన సౌదీ ఇజ్రాయెల్తో దోస్తీ కడితే పాలస్తీనా వాదన బలహీనమవుతుందన్న భయంతోనే ఆ ఒప్పందాన్ని దెబ్బతీయడానికి హమాస్ ఈ దాడులకు పాల్పడిందనే వాదన ఉంది. అంటే కేవలం తామే కాకుండా అరబ్ దేశాలన్నీ ఇజ్రాయెల్తో శత్రుత్వాన్ని కొనసాగించాలని, యుద్ధంలో పాల్గొనాలని హమాస్ కోరుకుంటోంది. ఏదో రకంగా యుద్ధాన్ని విస్తరించాలని చూస్తోంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
ఉగ్రవాదాన్ని దీర్ఘకాలంగా పెంచి పోషించిన ఓ దేశం.. చివరకు దానికే బలవుతోందని పాకిస్థాన్ను ఉద్దేశించి కేంద్రమంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. -
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
UAE Blue Residenency Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఈ వీసా ఎవరికంటే..? -
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదు: దేవినేని ఉమా
-
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
-
ఈ పుస్తకం ప్రతీ విద్యార్థి చదవాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
జగిత్యాల జిల్లాలో విషాదం.. అన్నదమ్ములను బలిగొన్న భూ తగాదా
-
బెంగళూరు గెలిచినా.. చెన్నైకే ‘ప్లే ఆఫ్స్’ ఛాన్స్.. అదెలాగంటే?
-
స్టాక్ మార్కెట్లలో కొనసాగిన లాభాలు