రిషి సునాక్పై అవిశ్వాస లేఖ
వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు మరో సవాల్ ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహారాలను చూసే 1922 కమిటీ ఛైర్మన్ గ్రాహమ్ బ్రాడీకి అవిశ్వాస లేఖను సమర్పించారు.
సొంతపార్టీ ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ చర్య
ఆమె మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కు నమ్మిన వ్యక్తిగా పేరు
లండన్: వచ్చే ఏడాది సాధారణ ఎన్నికలు జరగనున్న వేళ బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు మరో సవాల్ ఎదురైంది. ఆయనకు వ్యతిరేకంగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ ఆండ్రియా జెన్కిన్స్ హౌస్ ఆఫ్ కామన్స్ వ్యవహారాలను చూసే 1922 కమిటీ ఛైర్మన్ గ్రాహమ్ బ్రాడీకి అవిశ్వాస లేఖను సమర్పించారు. సునాక్ను పదవి నుంచి దింపి.. ఆయన స్థానంలో నిజమైన కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకునే సమయం వచ్చిందని ఆమె పేర్కొన్నారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్కు నమ్మిన వ్యక్తిగా పేరు ఉన్న ఆండ్రియా.. కేబినెట్ నుంచి సువెల్లా బ్రేవర్మన్ను తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ క్రమంలోనే ఆమె ఈ అవిశ్వాస లేఖను సమర్పించారు. సునాక్ ప్రధాని పదవి చేపట్టిన తర్వాత ఆయనపై అవిశ్వాస లేఖ రావడం ఇదే తొలిసారి. అయితే దీనిపై ఇప్పుడే ఆయన అవిశ్వాస పరీక్షను ఎదుర్కోవాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. పార్టీకి చెందిన మొత్తం ఎంపీల్లో 15శాతం మంది తాము కొత్త నాయకుడిని కోరుకుంటున్నామంటూ లేఖలు పంపితే అప్పుడు కన్జర్వేటివ్ పార్టీలో రిషి నాయకత్వంపై విశ్వాస పరీక్ష ఓటింగ్ నిర్వహిస్తారు.
సునాక్ ప్రతిపాదనలకు రాజు ఆమోద ముద్ర
మరోవైపు బ్రిటన్ విదేశాంగ మంత్రిగా డేవిడ్ కామెరూన్, హోం మంత్రిగా జేమ్స్ క్లెవర్లీని నియమిస్తూ ప్రధాని రిషి సునాక్ చేసిన ప్రతిపాదనలకు రాజు ఛార్లెస్ ఆమోదముద్ర వేసినట్టు 10 డౌనింగ్ స్ట్రీట్ ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్రిటన్ విదేశాంగ మంత్రిగా తన నియామకాన్ని అంగీకరిస్తున్నట్లు డేవిడ్ కామెరూన్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!
వీసారహిత బృంద పర్యటనలను అనుమతించే విషయాన్ని చర్చించేందుకు భారత్, రష్యాలు జూన్లో తొలివిడత చర్చలు జరపనున్నాయి. -
ప్రపంచంలో ‘3F’ల సంక్షోభం.. కేంద్ర మంత్రి జైశంకర్
ఉగ్రవాదాన్ని దీర్ఘకాలంగా పెంచి పోషించిన ఓ దేశం.. చివరకు దానికే బలవుతోందని పాకిస్థాన్ను ఉద్దేశించి కేంద్రమంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. -
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
UAE Blue Residenency Visa: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మరో కొత్త వీసా పథకాన్ని ప్రకటించింది. 10 ఏళ్ల కాలానికి బ్లూ రెసిడెన్సీ వీసాను ఇవ్వనున్నట్లు తెలిపింది. మరి ఈ వీసా ఎవరికంటే..? -
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
ఉత్తర కొరియాలో ఉంటూ.. అమెరికాలోని కీలక టెక్ కంపెనీలకు వర్క్ఫ్రమ్ హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్నారు కొందరు. ఈ విషయం బయటపడి తమ టెక్నాలజీ ఎక్కడ దారి తప్పుతుందో అని అమెరికా హడలిపోతోంది. -
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
ఆ బాలుడి మృతి ‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లేనా?.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
చార్ ధామ్లో ఇకపై రీల్స్ చిత్రీకరణ నిషిద్ధం
-
లఖ్నవూతో మ్యాచ్.. టాస్ గెలిచిన ముంబయి.. జట్లు ఇవే!
-
ఏపీలో ‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ఈసీ
-
శిఖర్ పహారియాతో బంధంపై పెదవి విప్పిన జాన్వీ.. ఏమన్నారంటే!
-
వీసా లేకుండా పర్యటనల కోసం.. భారత్, రష్యా త్వరలో చర్చలు!
-
అరెస్టును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్పై ‘సుప్రీం’ తీర్పు రిజర్వు