Nigeria: నైజీరియాలో బందిపోట్ల దాడి.. వందల మంది మృతి..!
నైజీరియాలో బందిపోట్లు నరమేధం సృష్టిస్తున్నారు. మంగళవారం నుంచి గురువారం మధ్య ప్రజలపై పలుమార్ల దాడులు చేసి దోపిడీలకు పాల్పడ్దారు. ఈ
ఇంటర్నెట్డెస్క్: నైజీరియాలో బందిపోట్లు నరమేధం సృష్టిస్తున్నారు. మంగళవారం నుంచి గురువారం మధ్య ప్రజలపై పలుమార్ల దాడులు చేసి దోపిడీలకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో కనీసం 200 మంది ప్రాణాలు కోల్పోయారు. గత సోమవారం ఇక్కడి సైనిక దళాలు అడవుల్లోని సాయుధులపై దాడి చేసి 100 మందిని మట్టుబెట్టాయి. దీనికి ప్రతిగా వారు జంఫారా రాష్ట్రంలో దాడులకు తెగబడ్డారు. ఈ క్రమంలో దాదాపు 100 మంది చనిపోయి ఉండొచ్చని తొలుత భావించినా.. ఆ తర్వాత మృతుల సంఖ్య 200కు చేరింది. భారీ ఆయుధాలతో మోటార్సైకిళ్లపై వచ్చిన ముష్కరులు ఇళ్లను దహనం చేయడంతోపాటు మనుషుల్ని ఊచకోత కోశారు. ఈ క్రమంలో 2,000 పశువులను దొంగిలించారు.
ఇక్కడి క్రిమినల్ గ్యాంగ్లతో ప్రభుత్వ దళాలకు ఘర్షణలు జరుగుతున్నాయి. ప్రభుత్వం వీరిని బందిపోట్లుగా పేర్కొంది. ప్రభుత్వ దళాల దాడులను తప్పించుకొనేందుకు ఈ బందిపోట్లు జంఫారా రాష్ట్రం వైపు వెళ్లినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ఈ దాడి ఘటనపై నైజీరియా అధ్యక్షుడు మహమ్మద్ బుహారీ మాట్లాడుతూ ‘సాయుధులపై పోరాటంలో ప్రభుత్వ దళాలు వెనక్కి తగ్గేది లేదు. తాజా దాడి బందిపోట్ల నిస్పృహను తెలియజేస్తోంది’ అని పేర్కొన్నారు. ఈ బందిపోట్లను కూడా ఉగ్రవాదులగా ప్రకటిస్తూ కఠిన వైఖరి అనుసరిస్తామని అక్కడి ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.