China: భారత్ నోట.. ‘తైవాన్ జలసంధి’ మాట..!
భారత్ తొలిసారి ‘తైవాన్ జలసంధి సైనికీకరణ’ అంశాన్ని ప్రస్తావించింది. భారత్ సాధారణంగా తైవాన్పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్ కార్యాలయం శనివారం
ఇంటర్నెట్డెస్క్: భారత్ తొలిసారి ‘తైవాన్ జలసంధి సైనికీకరణ’ అంశాన్ని ప్రస్తావించింది. భారత్ సాధారణంగా తైవాన్పై చైనా చర్యలను నేరుగా ప్రస్తావించదు. శ్రీలంకలో మనదేశ హైకమిషన్ కార్యాలయం శనివారం అర్ధరాత్రి ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. దీంతో నాన్సీపెలోసీ తైవాన్ పర్యటన అనంతరం చైనా యుద్ధవిన్యాసాలు చేయడం వంటి పరిణామాలపై భారత్ మరింత స్పష్టంగా తన వైఖరి తెలిపినట్లైంది.
ఈ నెల మొదట్లో విదేశీ వ్యవహారాల శాఖ ఈ జలసంధి పరిస్థితిపై విడుదల చేసిన ప్రకటనలో ‘‘సైనికీకరణ’’ అనే పదం వినియోగించలేదు. ‘‘ఇటీవల చోటు చేసుకొంటున్న పరిణామాలు ఆందోళనకరం’’ అని పేర్కొంది. అంతేకాదు ‘‘ఇరుపక్షాలు సంయమనం పాటించాలని.. ఏకపక్షంగా యథాతథ పరిస్థితులను మార్చకూడదని, ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని, ఈ ప్రదేశంలో శాంతి, సుస్థిరతను కొనసాగించేందుకు కృషి చేయాలని కోరుతున్నాం’’ అంటూ భారత్ ఆగస్టు 12వ తేదీన ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఏక చైనా విధానాన్ని’ భారత్ పునరుద్ఘాటించాలని అప్పట్లో బీజింగ్ కోరింది. కానీ, దీనికి భారత్ విదేశాంగ శాఖ నుంచి అస్పష్టమైన సమాధానం వచ్చింది. ‘‘భారత్ విధానాలు తెలిసినవే. అవి సుస్థిరంగా ఉంటాయి.. వాటిని పునరుద్ఘాటించాల్సిన అవసరం లేదు’’ అని పేర్కొంది.
తాజాగా ‘తైవాన్’ ప్రస్తావన తీసుకురావడానికి చైనానే ఓ రకంగా కారణమైంది. ఇటీవల శ్రీలంకలోని హంబన్టోట రేవుకు చైనాకు చెందిన యువాన్ వాంగ్-5 నౌక రావడం వివాదానికి కారణమైంది. కొలంబోకు న్యూదిల్లీ నుంచి అభ్యంతరాలు ఎదురయ్యాయి. దీనిపై శ్రీలంకలోని చైనా దౌత్యవేత్త కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఉత్తరాన ఉన్న పొరుగు దేశం నుంచి శ్రీలంక తీవ్ర ఒత్తిడికి గురైంది’’ అని పేర్కొన్నారు. దీనిపై శ్రీలంకలోని భారత హైకమిషన్ కార్యాలయం తీవ్రంగా స్పందిస్తూ.. ప్రాథమిక దౌత్య మర్యాదలను చైనా ఉల్లంఘించిందని పేర్కొంటూ ట్వీట్ చేసింది. ‘‘తైవాన్ జలసంధి సైనికీకరణకు, యువాన్ వాంగ్-5 నౌక హంబన్టోటాకు రావడానికి సంబంధాలు అంటగడుతూ చైనా రాయబారి రాసిన కథనానికి స్పందనగా ఈ ట్వీట్ చేస్తున్నాం’’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!