Pakistan: ఓఐసీ పాకిస్థాన్ బాకాలా పనిచేస్తోంది: భారత్
వోఐసీ సంస్థ పాకిస్థాన్(Pakistan) బాకాలా పనిచేస్తోందని భారత్ (India) మండిపడింది. భారత్ అంతర్గత విషయాల్లో ఆ సంస్థకు ఎటువంటి పాత్ర లేదని పేర్కొంది.
ఇంటర్నెట్డెస్క్: ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) తీరుపై భారత్ (India) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థ విశ్వాసాన్ని కోల్పోతోందంటూ విమర్శించింది. ఇటీవల ఓఐసీ సెక్రెటరీ జనరల్ హిస్సెయిన్ బ్రహిమ్ తవా పాక్ ఆక్రమిత కశ్మీర్ను సందర్శించారు. భారత్ (India) జరుపుతున్న షెల్లింగ్తో ప్రభావితమైన వారి కోసం అక్కడ జరిపిన ప్రార్థనల్లో ఆయన పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో భారత్ ప్రకటన వెలువడింది. ‘‘భారత్లోని భాగమైన జమ్ము కశ్మీర్లో ఓఐసీకి ఎటువంటి పాత్రలేదు. ఓఐసీ లేదా దాని సెక్రటరీ జనరల్ భారత్ (India) అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’’ అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి అరిందం బాగ్చీ హెచ్చరించారు.
ఓఐసీ సెక్రటరీ జనరల్ పాకిస్థాన్ (Pakistan) బాకా వలే పనిచేస్తున్నారని బాగ్చీ పేర్కొన్నారు. ఓఐసీకూడా పూర్తిగా పచ్చి మతపరమైన పక్షపాత, వాస్తవాలను వక్రీకరించే విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు. భారత్ (India)లో ఉన్న జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగదోసే దుర్మార్గపు అజెండాలో భాగస్వామి కాకూడదని భారత్ (India) ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.