Japan: సైన్యంలో లైంగిక వేధింపులు నిజమే.. క్షమాపణ చెప్పిన జపాన్ ఆర్మీ
జపాన్ సైన్యంలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సైన్యంలో మహిళలపై లైంగిక వేధింపులు జరిగాయని అక్కడి సైన్యం అంగీకరించింది.
టోక్యో: జపాన్ సైన్యంలో (Japan Army) అరుదైన పరిణామం చోటుచేసుకుంది. సైన్యంలో మహిళలపై లైంగిక వేధింపులు (Sexual Harassment) జరిగాయని అక్కడి సైన్యం అంగీకరించింది. ఇందుకు క్షమాపణ కోరుతున్నామని తెలిపింది. ఓ మాజీ సైనికురాలికి తోటి సిబ్బంది నుంచి ఎదురైన వేధింపులపై జరిపిన దర్యాప్తులో ఈ విషయాలు వెల్లడైనట్లు జపాన్ ఆర్మీ అధికారికంగా వెల్లడించింది.
తోటి సైనికుల నుంచి ఎంతోకాలంపాటు లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానంటూ రీనా గొనోయ్ అనే మాజీ సైనికురాలు సంచలన ఆరోపణలు చేశారు. తనతోపాటు ఎంతో మంది మహిళలు వేధింపులకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉద్యమాన్ని చేపట్టారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రక్షణశాఖ.. ఆమె ఆరోపణలపై అంతర్గత దర్యాప్తు జరిపించింది. ఆ దర్యాప్తులో రీనా చేసిన ఆరోపణలు నిజమని తేలాయి. ఈ నేపథ్యంలో ‘లైంగిక వేధింపుల వల్ల సుదీర్ఘకాలం పాటు ఎంతో వేదనను ఎదుర్కొన్న రీనా గొనోయ్కు క్షమాపణలు కోరుతున్నా’ అని విలేకరుల సమావేశంలో గ్రౌండ్-సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ యోషిహిదే యోషిదా పేర్కొన్నారు.
‘సర్వీసులో ఉన్న సమయంలో (2021 ఆగస్టు) ముగ్గురు సైనికాధికారులు నా శరీరాన్ని తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారు. ఆ సమయంలో పది మంది సైనికులు ఆ ఘటనను చూసి నవ్వుకున్నారు. అందులో ఏ ఒక్కరూ అధికారులను వారించలేదు. ఆ దారుణంపై ఫిర్యాదు చేసినప్పటికీ సరైన దర్యాప్తు చేయకుండానే దానిని మూసివేశారు’ అంటూ తనకు జరిగిన అన్యాయంపై రీనా గొనోయ్ సోషల్ మీడియాలో గళమెత్తారు. అనంతరం సైన్యం నుంచి కొన్నిరోజుల క్రితం రాజీనామా చేసిన గొనోయ్.. సైనిక అధికారులపై న్యాయపోరాటానికి దిగారు.
ఇందుకు సంబంధించి 2021లో చేసిన ఫిర్యాదుపై మరోసారి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తూ లక్ష మంది సంతకాలతో కూడిన పిటిషన్ను రీనా గొనోయ్ రక్షణశాఖకు అందించారు. తనకు జరిగినట్లుగానే సర్వీసులో ఉండగా వేధింపులకు గురైనట్లు 146 మంది తనకు సమాచారం ఇచ్చారని అందులో పేర్కొన్నారు. ఇలా రీనాతోపాటు సైన్యంలో లైంగిక వేధింపులకు సంబంధించి వస్తోన్న ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన జపాన్ రక్షణశాఖ మంత్రి యసుకజూ హమదా.. వీటిపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఆదేశించారు. ఈ బాధ్యతను ఆమె పనిచేసిన రీజినల్ ఆర్మీ డివిజన్కు అప్పజెప్పారు. వీటిపై దర్యాప్తు చేసిన అనంతరం గొనోయ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం ఉందని గ్రౌండ్-సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ చీఫ్ అంగీకరించారు. ఇందుకు క్షమాపణ కోరిన ఆయన.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు జపాన్ సైన్యంలో వివిధ రకాల వేధింపులకు సంబంధించి 2016లో 256 ఫిర్యాదులు రాగా.. 2021లో 2311 ఫిర్యాదులు వచ్చినట్లు జపాన్ రక్షణశాఖ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.