White House: ఆ విషయాల్లో.. మోదీకి బైడెన్ ఉపదేశం చేయరు!
మావన హక్కులపై ప్రధాని మోదీకి (Narendra Modi) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎలాంటి ఉపదేశం చేయరని అమెరికా అధ్యక్ష భవనం (White House) వెల్లడించింది.
వాషింగ్టన్: భారత్లో మానవ హక్కులపై (Human Rights) ఆందోళన వ్యక్తం చేస్తూ అమెరికా ఇటీవల కొన్ని ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మోదీ అమెరికా పర్యటన నేపథ్యంలో, మానవ హక్కులు, మత స్వేచ్ఛ గురించి ప్రస్తావించాలని అమెరికా కమిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడం వంటి సంస్థలు, కొందరు చట్టసభ సభ్యులూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు సూచించారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్ష భవనం (White House) కీలక వ్యాఖ్యలు చేసింది. మానవ హక్కులపై ప్రధాని మోదీకి (Narendra Modi) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఎలాంటి ఉపదేశం చేయరని స్పష్టం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. నేటితరం బలమైన ద్వైపాక్షిక భాగస్వామ్యాల్లో ఒకటిగా ఇరు దేశాల బంధాన్ని చూస్తామని తెలిపింది.
‘ నరేంద్ర మోదీకి జో బైడెన్ ఉపదేశం ఇవ్వరు. పత్రికా, మత, ఇతర స్వేచ్ఛల విషయంలో ఎదురవుతోన్న సవాళ్ల విషయానికొస్తే.. మా అభిప్రాయాలను మేం తెలియజేస్తాం. ఉపన్యాసాలు ఇవ్వడం కానీ, మాకు సవాళ్లు లేవని చెప్పడం కానీ చేయము. భారత్లో రాజకీయాలు, ఇతర ప్రజాస్వామ్య వ్యవస్థలు ఎక్కడికి వెళ్తున్నాయనే ప్రశ్నలకు అక్కడి వారే (భారతీయులు) నిర్ణయిస్తారు. అమెరికాలో అవి నిర్ణయించబడవు’ అని వైట్హౌస్ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సల్లివాన్ స్పష్టం చేశారు. ఇక ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యానికి చెక్ పెట్టడంపై బైడెన్, మోదీల మధ్య చర్చ ఉంటుందా అన్న ప్రశ్నకు సల్లివాన్ స్పందించారు. ఇది చైనా పర్యటన కాదని, అయినప్పటికీ సైన్యం, టెక్నాలజీ, ఆర్థికవ్యవస్థ వంటి విషయాల్లో చైనా పాత్ర తప్పకుండా ప్రస్తావనకు వస్తుందన్నారు.
మరోవైపు, భారత్తో బంధం విషయంలో అమెరికాకు ఉన్న అన్ని అంశాలను ప్రధాని మోదీతో నేరుగా ప్రస్తావించాలని అధ్యక్షుడు బైడెన్కు చట్టసభ సభ్యులు ఇటీవల సూచించారు. రెండు దేశాల మధ్య విజయవంతమైన, బలమైన, దీర్ఘకాలిక సంబంధాలను కొనసాగించడానికి ముఖ్యమైన అంశాలపై పూర్తి స్థాయిలో చర్చించాలని 75 మంది చట్టసభ సభ్యులు కోరారు. ఈ మేరకు వారు బైడెన్కు లేఖ రాశారు. అమెరికా విదేశాంగ విధానంలో మానవ హక్కుల రక్షణ, మీడియా స్వేచ్ఛ, మత స్వేచ్ఛ, బహుళత్వం అనేవి అతి ముఖ్యమైన అంశాలని.. ఇక్కడ అమలయ్యే ఈ విధానాలను మన మిత్ర దేశాల్లోనూ అమలు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేయాలని సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
19 ఏళ్ల కుర్రాడిని కిడ్నాప్ చేసి.. అతడి ఇంటికి 100 మీటర్ల దూరంలోనే 26 ఏళ్లు బంధించారు. చివరికి ఓ సోషల్ మీడియా పోస్టులో లభించిన క్లూ ఆధారంగా అతడిని అధికారులు రక్షించారు. -
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
One Chip Challenge: పాఖీ కంపెనీ విసిరిన వన్ చిప్ ఛాలెంజ్ తీవ్ర విమర్శలకు దారితీసింది. గత ఏడాది సంభవించిన హారిస్ వోలోబా మరణానికి ఇదే కారణమని పరోక్షంగా తేల్చింది. -
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
India-US: భారత్-అమెరికా ఇరు దేశాల్లోని పరిమితులను గుర్తించి వాటిని కలిసికట్టుగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని భారతీయ అమెరికన్ చట్టసభ్యులు అభిప్రాయపడ్డారు. అలా కాకుండా కేవలం హితబోధలు చేస్తే ఫలితాలు ఉండవని స్పష్టం చేశారు. -
రష్యా, చైనా మైత్రి ఏ దేశానికి వ్యతిరేకం కాదు
ఉక్రెయిన్ యుద్ధానికి రాజకీయ పరిష్కారం కుదిరి ఐరోపాలో శాంతి సుస్థిరతల పునరుద్ధరణ జరుగుతుందని చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ (70) ఆకాంక్షించారు. -
రఫాపై ఇజ్రాయెల్ దాడిని ఆపించండి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై ఇజ్రాయెల్ దాడిని అడ్డుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని (ఐసీజే) దక్షిణాఫ్రికా కోరింది. గాజాలో ఇజ్రాయెల్ నరమేధానికి పాల్పడుతోందని దక్షిణాఫ్రికా వేసిన కేసుపై గురువారం అంతర్జాతీయ న్యాయస్థానంలో విచారణ ప్రారంభమైంది. -
ఖర్కీవ్లో రష్యా దాడులను నిలువరించాం
ఈశాన్య ఉక్రెయిన్లోని ఖర్కీవ్ ప్రాంతంలో వారం రోజులుగా దాడులతో విరుచుకుపడుతున్న రష్యా బలగాలను తాము నిలువరించినట్లు ఉక్రెయిన్ గురువారం ప్రకటించింది. -
భారతీయ అమెరికన్ల ప్రాతినిధ్యం పెరగాలి
కొన్నేళ్ల నుంచి అమెరికా ఎన్నికల్లో పాల్గొనే భారత సంతతి అమెరికన్ల సంఖ్య పెరుగుతున్నా ఇక్కడ దినదినాభివృద్ధి చెందుతున్న వారి జనాభాకు అనుగుణంగా వారి ప్రాతినిధ్యం ఉండడం లేదని భారత-ఆఫ్రికన్ సంతతికి చెందిన మహిళ, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (59) అన్నారు. -
12 సెకన్లలో రూ.200 కోట్లు మాయం
అమెరికాలో అత్యంత ప్రతిష్ఠాత్మక విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఇద్దరు అన్నదమ్ములు పక్కదారి పట్టారు. తమ చదువు, నైపుణ్యాలను దుర్వినియోగం చేసి హైటెక్ మోసానికి పాల్పడ్డారు. -
భారత్ చంద్రుడిపై ప్రయోగాలు చేస్తుంటే.. మనం పిల్లల్నే కాపాడుకోలేకపోతున్నాం
పాకిస్థాన్ దయనీయ పరిస్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు సయ్యద్ ముస్తఫా కమల్.. భారత్ సాధిస్తున్న పురోగతిని ప్రస్తావించారు. -
స్లొవేకియా ప్రధానికి తప్పిన ప్రాణాపాయం
దుండగుడి కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికార వర్గాలు గురువారం వెల్లడించాయి.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ