Kamala Harris: తప్పు చేయొద్దు.. రష్యాకు కమలా హారిస్ గట్టి హెచ్చరిక
ఉక్రెయిన్ వివాదం విషయంలో రష్యాపై అమెరికా తన స్వరాన్ని పెంచింది. ఒకవేళ ఉక్రెయిన్పై దాడికి పాల్పడితే.. తాము, మిత్రదేశాలతో కలిసి మునుపెన్నడూ లేని ఆర్థిక ఆంక్షలను విధిస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా...
బెర్లిన్: ఉక్రెయిన్ వివాదం విషయంలో రష్యాపై అమెరికా తన స్వరాన్ని పెంచింది. ఒకవేళ ఉక్రెయిన్పై దాడికి పాల్పడితే.. తాము, మిత్రదేశాలతో కలిసి మునుపెన్నడూ లేని ఆర్థిక ఆంక్షలను విధిస్తామని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హెచ్చరించారు. అంతటితో ఆగకుండా.. పొరుగున నాటోను మరింత బలోపేతం చేస్తామన్నారు. శనివారం మ్యూనిక్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ వేదికగా కమలా హారిస్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా ఆక్రమణకు పాల్పడితే ఐక్యతతో కూడిన వేగవంతమైన, తీవ్రమైన ప్రతిస్పందన ఉంటుందని స్పష్టం చేశారు. ‘మేం దీర్ఘకాలిక ఆర్థిక, ఎగుమతుల ఆంక్షలు విధిస్తాం. రష్యా ఆర్థిక సంస్థలు, కీలక పరిశ్రమలను లక్ష్యంగా చేసుకుంటాం. రష్యాకు సహకరించేవారినీ వదిలిపెట్టం’ అని కమలా హారిస్ పేర్కొన్నారు. ‘ఈ విషయంలో తప్పు చేయొద్దు. కఠిన ఆంక్షలతో పెద్దఎత్తున నష్టం వాటిల్లుతుంది’ అని రష్యాను ఉద్దేశించి అన్నారు.
‘ఉక్రెయిన్పై రష్యా దాడి చేస్తే అమెరికా.. మిత్రదేశాలు, భాగస్వాములతో కలిసి కఠినమైన ఆర్థిక ఆంక్షలను విధిస్తుందని కచ్చితంగా చెప్పగలను’ అని హారిస్ అంతకుముందు ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుత జర్మనీ పర్యటనలో భాగంగా హారిస్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్తో వేర్వేరుగా సమావేశం కానున్నారు. మరోవైపు ఉక్రెయిన్తో ఉద్రిక్తతల వేళ రష్యా శనివారం భారీ ఎత్తున క్షిపణుల విన్యాసాలు చేపట్టిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.