Royal family: వందల కార్లు.. రూ.4వేల కోట్ల ప్యాలెస్: ఈ రాజ కుటుంబం హవానే వేరయా..!
విలాసవంతమైన రాజ భవనాలు, ప్రముఖ సంస్థల్లో పెట్టుబడులు, లండన్, పారిస్లో ఆస్తులు.. యూఏఈ రాజ కుటుంబం(royal family of Dubai) సంపద ఎంతో తెలుసా..?
దుబాయ్: ప్రైవేటు విమానాలు, వందల్లో కార్లు, వేలకోట్ల రూపాయల విలువైన భవంతి.. ఈ సంపద గురించి వింటుంటే కళ్లు చెదిరిపోతుంది కదా..! ఈ విలాస జీవితం యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్(Sheikh Mohamed bin Zayed Al Nahyan) రాజ కుటుంబం(royal family of Dubai) సొంతం. 305 బిలియన్ డాలర్ల ఆస్తులతో వాల్టన్ కుటుంబాన్ని దాటి.. 2023లో ప్రపంచంలోనే అత్యంత సంపన్న కుటుంబంగా అవతరించింది. అంటే ఆ సంపద విలువ అక్షరాలా రూ.25,38,667 కోట్లు.
యూఏఈని పాలిస్తోన్న షేక్ మహ్మద్ బిన్ జయీద్ అల్ నహ్యాన్.. ఈ కుటుంబ పెద్ద. 18 మంది సోదరులు, 11 మంది అక్కాచెల్లెళ్లు ఉన్నారు. ఆయనకు తొమ్మిది మంది సంతానం, 18 మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఇక ఆస్తుల విషయానికొస్తే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చమురు నిల్వల్లో ఆరు శాతం ఈ కుటుంబం అధీనంలోనే ఉన్నాయి. 2008లో రూ.2,122 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన మాంచెస్టర్ సిటీ ఫుట్బాల్ క్లబ్ వీరి యాజమాన్యంలోనే ఉంది. అలాగే ఎలాన్మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్, ప్రముఖ సింగర్ రిహన్నా బ్యూటీ బ్రాండ్ ఫెంటీతో పాటు పలు ప్రముఖ కంపెనీల్లో వాటాలున్నాయి. ఇక దుబాయ్ పాలకుడు సోదరుడి వద్ద 700కు పైగా కార్ల కలెక్షన్ ఉంది. వాటిలో విలాసవంతమైన బుగాటి, లంబోర్గిని, మెర్సిడెస్ బెంజ్ బ్రాండ్లున్నాయి. వారి కుటుంబానికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంపెనీ ఆదాయం గత ఐదేళ్ల కాలంలో 28,000 శాతం పెరగడం విశేషం.
ఈ రేంజ్లో ఆస్తిపాస్తులున్న ఈ కుటుంబం నివసించే భవంతి ఇంకే స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు. అబుదాబీలోని ఖాసర్ అల్ వాటన్ అధ్యక్ష భవనంలో రాజకుటుంబ సభ్యులు ఉంటున్నారు. యూఏఈ(UAE)లో వారికున్న ఎన్నో భవనాల్లో అతి పెద్దది ఇదే. పెంటగాన్ వైశాల్యానికి మూడు రెట్లు ఎక్కువ. 94 ఎకరాల్లో విస్తరించి ఉన్న దీని విలువ రూ. 4,078 కోట్లు. 37 మీటర్ల వెడల్పాటి డోమ్ ఈ ప్యాలెస్కు ప్రత్యేక ఆకర్షణ. లండన్, పారిస్తో పాటు ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వీరికి ఆస్తులున్నాయి. 2015 లెక్కల ప్రకారం.. లండన్లో బ్రిటిష్ రాజకుటుంబంతో సరిసమానమైన ఆస్తులు కలిగిఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇవిగాక, వేల కోట్లు విలువ చేసే నౌకలు, విమానాలు వారి లగ్జరీకి నిదర్శనం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోటీకి చైనా భయపడదు
దెబ్బతిన్న ద్వైపాక్షిక సంబంధాలను గాడిలో పెట్టేందుకు అమెరికా, చైనాల మధ్య ఐదు సూత్రాలపై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. -
అట్టుడుకుతున్న అమెరికా వర్సిటీలు
ఓ వైపు ప్రదర్శనలు.. మరోవైపు అరెస్టులు.. ఇదీ అమెరికా విశ్వవిద్యాలయాల్లో పరిస్థితి. గాజాపై ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ప్రదర్శనలు ఆగే సూచనలు కనిపించడం లేదు. -
ఆ పసికందు చనిపోయింది
ఇజ్రాయెల్ గగనతలదాడిలో మృతి చెందిన పాలస్తీనా మహిళ గర్భం నుంచి సురక్షితంగా వైద్యులు బయటకు తీసిన పసికందు మృతి చెందింది. -
ప్రాణాలు కాపాడుతున్న క్యాన్సర్ టీకా
చర్మ క్యాన్సర్ (మెలనోమా)కు రూపొందించిన ఎంఆర్ఎన్ఏ టీకాను బ్రిటన్లో రోగులపై పరీక్షిస్తున్నారు. ఇది బాధితులకు ఆశాకిరణంగా ఉందని వారు చెప్పారు. -
రాజకీయలబ్ధికి మీ ఎన్నికల్లోకి మమ్మల్ని లాగకండి : పాక్
ఎన్నికల్లో రాజకీయలబ్ధి పొందేందుకు భారతీయ నేతలు తమ ప్రసంగాల్లో పాకిస్థాన్ ప్రస్తావన తీసుకురావడం మానుకోవాలని పొరుగు దేశం విజ్ఞప్తి చేసింది. పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బాలోచ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్కు సంబంధించి భారతీయ నేతలు చేసిన అన్ని వాదనలను తాము తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేశారు. -
దలైలామా ప్రతినిధులతోనే చర్చిస్తాం
బౌద్ధమత గురువు దలైలామా ప్రతినిధులతోనే తాము చర్చలు జరుపుతామని చైనా స్పష్టం చేసింది. అంతేకానీ, ప్రవాసంలో ఉన్న టిబెట్ ప్రభుత్వ ప్రతినిధులతో కాదని తెలిపింది. -
అమెరికాలో పోలీసుల కాల్పులు.. భారత సంతతి వ్యక్తి మృతి
అమెరికాలోని శాన్ ఆంటోనియోలో జరిగిన పోలీసు కాల్పుల్లో భారత సంతతి వ్యక్తి సచిన్ సాహు (42) ప్రాణాలు కోల్పోయారు. -
ఉక్రెయిన్కు రక్షణగా అమెరికా పేట్రియాట్లు
రష్యాతో పోరులో ఉక్రెయిన్ సైన్యాన్ని బలోపేతం చేసే దిశగా అమెరికా పావులు కదుపుతోంది. తాజాగా ప్రకటించిన 6 బిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీలో పేట్రియాట్ క్షిపణులను చేర్చింది.
తాజా వార్తలు (Latest News)
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!
-
క్రీడలపై గ‘లీజు’ పెత్తనం.. జగన్ జమానాలో అంతా వ్యాపారమే